Pages

Subscribe:

Saturday 13 August 2011

ఫిత్నా- ద మూవీ





courtesy: http://www.geertwilders.nl/index.php?option=com_frontpage&Itemid=1
 
నెథర్‌ల్యాండ్స్ పార్టీ ఫర్ ఫ్రీడం అధ్యక్షుడైన Geert Wilders ఇస్లాం మతంపై తాను తీసిన మిని డాక్యుమెంటరీ మూవీ ఫిత్నా (Fitna) ముస్లిం మనోభావాలను దెబ్బతీసిందని మరియు ఇది విద్వేషంతో కూడినదని (Hate Speech) కేసు బుక్‌చేసి విచారిస్తున్నారు. Fitnaలో Wilders చూపించిన సన్నివేశాలు మరియు వాక్యాలన్ని ఇస్లామిక్ గ్రంథాలైన ఖురాన్, హడీస్, సీరాల నుండి తీసుకొన్నవే! అప్పుడది Hate Speech ఎలా అవుతుంది? Wilders కూడా తెలివిగా తన కోర్టు విచారణలో సాక్షులుగా ముస్లిం విద్వాంసులని (Muslim Scholars), ముల్లాలని, ముఫ్టీలని ఆహ్వానించాడు. Fitnaలో ఉన్న విషయాలు వారు కాదనలేరు. సాక్షులను విచారించకుండానే చేసేది లేక Geert Wilders Trialని డిస్మిస్ చేసారు. మళ్ళీ Wildersను కోర్టు బోనెక్కించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Geert Wilders- ఇస్లామిక్ అణచివేతను వాక్‌స్వతంత్రంతో (Free Speech) ఎదుర్కొంటున్న ఒక మానవతావాది, స్వేచ్ఛని సమాధానాన్ని కోరుకొనే నిజమైన చాంపియన్! Geert Wilders తీసిన "ఫిత్నా"ని ఇక్కడ చూడండి. 

(Full screenలో చూడండి- వీడియోలో ఖురాన్, హడీస్ నుంచి సేకరించిన వాక్యాలను చదవండి)

 

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-4

మక్కా నుండి తరిమివేయబడటంతో మహమ్మద్‌కు గర్వభంగమయ్యింది. "అల్లాహ్‌చే ఎన్నుకోబడ్డ ప్రవక్త" అనే ఆధిక్యత జనాల దృష్టిలో ప్రశ్నార్థకమయ్యింది. కాబట్టి మహమ్మద్ ప్రతీకారంతో రగిలిపోయాడు. అందుకే అతను మదీనాలో ఉన్నప్పుడు అల్లాహ్‌చే అందుకొన్న సందేశం (2వ సురా) ప్రతీకార అయతులతో (వాక్యాలతో) నిండిపోయింది. మక్కావారు తమను పట్టణం నుంచి బహిష్కరించి తిరిగి రాకుండా నిలువరించడమే చిత్రహింస అని "హింస"కు కొత్త నిర్వచనం చెప్పాడు మహమ్మద్. ఈ "చిత్రహింస"కు ప్రతిగా మక్కావారిపై దండెత్తాలని అల్లాహ్ ఆజ్ఞ అంటూ తన అనుచరులైన ముసల్మాన్లను ప్రేరేపించాడు. మహమ్మద్ ఉద్దేశమేమిటంటే మక్కావారు తమను హింసించినందుకు వారిపై యుద్ధం చేయడం, తమతో పోల్చుకొంటే ఒక విధంగా వారిని తక్కువగా శిక్షించినట్లే! మక్కానుండి వెలివేయబడ్డందుకు (చిత్రహింస) మక్కావారిపై దండెత్తి వారిని చంపేయాలనడం సబబేనా? (ఖురాన్ 2: 193- ఊచకోత కంటే "చిత్రహింస" భరింపజాలనిది).       

కాని మక్కావారు మహమ్మద్‌ను తరిమేయడం ముమ్మాటికి సరైన పనే. ఎందుకంటే మహమ్మద్ తన అనుచరులైన ముసల్మాన్లతో కలిసి ఆయుధాలు సమకూర్చుకొని మక్కావారిపై బహిరంగంగా తిరిగుబాటు వ్యూహాలు పన్నాడు. తమపై కక్ష్యగట్టి భౌతిక దాడులకు బెదిరించేవారికి ఏ నగరవాసులూ ఆశ్రయమివ్వరు. (అయినప్పటికీ, కొద్దికాలం తరువాత మక్కావారు తెలివితక్కువగా మహమ్మద్‌తో సంధి చేసుకొని అతనిని మక్కాలోనికి అనుమతించారు. కొద్దికాలంలోనే మక్కా మహమ్మద్ పాదాక్రాంతమయ్యింది. వారి ఆచారాలు, విశ్వాసాలు అన్నీ నిర్దాక్షిణ్యంగా తుడిచివేయబడ్డాయి).

మక్కావారు మహమ్మద్‌ను బహిష్కరించడానికి ఇంకో కారణమేమిటంటే, సర్వమతాలకు పూజాపీఠమైన మక్కాలోని కాబాను మహమ్మద్ మతమైన ఇస్లాంకు అప్పగించి కేవలం ఇస్లాం మాత్రమే అక్కడుండాలని మహమ్మద్ మొండిగా వాదించడం. ఇస్లాంలో పరమతసహనం పూర్తిగా కొరవడింది కాబట్టి మక్కావారు మహమ్మద్‌ను బహీష్కరించారు. ముస్లింలు కాబాచుట్టూ తిరగడానికి మక్కావారికి ఏం అభ్యంతరంలేదు కాని, ముస్లింలకు మాత్రం ఇతరులెవరు అక్కడ ప్రదిక్షణాలు చేయరాదని చెప్పేవారు. క్రీ.శ.630 లో మక్కాను కైవసం చేసుకొన్నాక వారన్న మాటలు అక్షరాల నిజం చేసారు- మక్కావారందరు ఇస్లాంలోకి మారాలి లేక చావాలి అని అవకాశమిచ్చి కాబాలోని అన్నీ విగ్రహాలని ధ్యంసం చేసారు. (ఖురాన్: సురా 9:18-19).   


ఇప్పుడు 2వ సురాలోని అయతుల్ని పరిశీలిద్దాం:

"......వారు ఎక్కడ దొరికుతే అక్కడ చంపేయండి, వారు మిమ్మల్ని ఏచోట్ల నుండి తరిమివేసితిరో అచ్చటనుండి వారినీ తరిమివేయుడి, ఎందుకంటే చంపడంకంటే చిత్రహింస ఇంకా కఠినమైనది. శాంతికరమైన ప్రార్థనా స్థలాలవద్ద వారితో పోరాడకండి కాని ఒకవేళ వారు మీపై దాడి చేస్తే అప్పుడు వారిని (అక్కడే) చంపండి. ఇదే అవిశ్వాసులకు తగిన బహుమానం. వారు మనలను హింసింపకుండునట్లు అంతమగువరకు పోరాడుడి, సంపూర్ణంగా అల్లాహ్ యొక్క మతం స్థాపింపబడువరకు పోరాడుడి!" (సురా 2:191-193).    

ఈ అయతులను చూపించి ముస్లింలు కేవలం ఆత్మరక్షణ కోసమే మహమ్మద్ పోరాడేవాడు అని వివరిస్తారు కాని చారిత్రిక సందర్భాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. నిజానికి ఈ వాక్యభాగం ముస్లింల ధౌర్జన్యాన్ని మరియు ఇస్లాం యొక్క బలవంతపు వ్యాప్తిని సమర్థించుకోడానికి వ్రాయబడినట్లు గ్రహించగలము.

మక్కావారు ముస్లింలపై దాడులు చేయలేదు. నేడు ముస్లింలు ఆరోపిస్తున్నట్లు అనాడు మక్కావారు ముస్లింలను చంపలేదు. ఇందుకు ఖురానే సాక్ష్యం- తరిమివేయబడటాన్ని చిత్రహింసగా మహమ్మద్ పేర్కొన్నాడు కాని మక్కావారు ముసల్మాలని చంపినట్లు పేర్కొనలేదు. పైపెచ్చు తాను చేయబోయే మారణకాండను సమర్థించుకోడానికి మక్కావారికి మేలు చేస్తున్నట్లు చిత్రహింసకంటే (తరిమివేయబడటానికంటే) చంపడం నయమని మక్కావారిని చంపులాగున ముసల్మాన్లను ప్రేరేపించాడు. (ఖురాన్‌లోని పై అయతుల్ని జాగ్రత్తగా చదవండి).

ఇంకో విషయం ఏంటంటే, మహమ్మద్ అన్నట్లు "చిత్రహింస (బహీష్కరింపబడుట) కంటే వధ మేలు" అనుకొంటే ఆత్మరక్షణకై పోరాడే మహమ్మద్ వారికి అదే చిత్రహింసను (బహిష్కరణను) శిక్షగా విధించాలని పై అయతుల్లో ఎందుకన్నట్లు? ఇది ప్రతీకారేచ్చ కాదా? మక్కావారు ముస్లింలను చిత్రహింసలు చేసి చంపారు అనే ఆరోపణల్లో సత్యముంటే వారు మొట్టమొదట మహమ్మద్‌నే చంపేవారు. వారికి నీతివుంది కాబట్టి బహిష్కరణతో సరిపెట్టారు. మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ ప్రాణాలు తీయడానికి తిరుగుబాటు చేసి అల్లర్లురేపుతున్న మహమ్మద్‌ను బహిష్కరించడం దయతో కూడుకొన్న న్యాయవిధా? లేక ప్రతీకారంతో మక్కా కారవాన్లపై దాడులు చేసి చంపి దోచుకోవడం  దయతో కూడిన పనా?        

Friday 12 August 2011

ఇది రమదాన్! దేశమేదైనా పాటించకపోతే....పగిలిపోద్ది

టర్కీష్ జాతీయుడైన ఒక జర్మన్ M.P. రమదాన్ మాసంలో సాసేజ్ ఆర్డర్ చేస్తే...... ఎమయ్యిందో మీరే ఇక్కడ చదవండి! 

Thursday 11 August 2011

4.9 కోట్ల మంది హిందువుల ఆచూకీ?

బంగ్లాదేశ్‌లో 1949 నుండి సుమారు 4.9 కోట్ల హిందువుల అదృశ్యం గురించి మాట్లాడుతూ నియర్ ఈస్ట్ మరియు సౌత్ సెంట్రల్ ఆసియాలో మానవ హక్కులు మరియు మత స్వేచ్ఛకై హెచ్.ఆర్. 440 బిల్లును సమర్థిస్తున్న రిప్రసెంటెటివ్ డోల్డ్. బంగ్లాదేశ్‌లోని హిందువులపై దాడులు మరియు వారి బలవంతపు వలసలు, ఇరాక్‌లోని మిషాబా ప్రాంత క్రైస్తవులపై కఠిన ఆంక్షలు మరియు ఇరాన్‌లో బహాయ్ మతస్తుల నిర్బంధాలను ఖండిస్తూ ఇవి భరింపలేని హింసలని అమెరికన్ పార్లమెంట్ సభ్యుడైన డోల్డ్ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులను నివారించడానికి  హెచ్.ఆర్. 440 బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు.

ఎన్నో శాంతి సందేశాలిచ్చే ముస్లిం సమర్థకులు, ముల్లాలు ఇస్లామిక్ దేశాల్లో మైనారిటీ మతస్తులపై జరిగే ఆకృత్యాలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇస్లాం శాంతికరమైన మతమైతే వారి దేశాల్లోని మైనారిటీలు ఇళ్ళు, ఆస్తులు వదిలేసి ఎందుకు పారిపోతారో ముస్లిం అపాలజిస్ట్లు, ముల్లాలు సమాధానం చెప్పాలి. ఎటూ పారిపోలేనివారు అంత దీనావస్థలో ఎందుకుంటారో చెప్పాలి. ముస్లిం చట్టాల్లో ముస్లిమేతరులపై వివక్ష ఎందుకుంటుందో చెప్పాలి.


 

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-3

మొదట రక్తం చిందించింది మక్కావారే కాబట్టి వారినుండి రక్షించుకోడానికి మహమ్మద్ పోరాడాడు అని ముస్లింలు, ముల్లాలు సమర్థించుకొంటారు. అయితే ఇది ఎంతవరకు నిజమో చరిత్రను పరిశీలిద్దాం.

ఒకసారి ముసల్మాన్లు ప్రార్థనలు చేసుకొనుచుండగా ఒక అన్యమతస్తుడు వారికి అంతరాయం కలిగిస్తున్నాడనే నెపంతో సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ అనే ముస్లిం నాయకుడు అతన్ని ఒంటె దవడయముకతో కొట్టి చంపాడు. ఇస్లాం పరిరక్షణకై మొట్టమదటి హత్య ఇదే (ఇబ్న్ ఇషాక్/హిషాం:166). 

కొత్తగా ఇస్లాం మతం పుచ్చుకొన్నవారికి మతం పేరుతో ఎవరినన్నా హింసించినా తప్పించుకోవచ్చనుకొనేవారు. ఒకసారి అబూ జహ్ల్ (విగ్రహారాధికుడు) అనే మక్కా పెద్ద మహమ్మద్‌ను కించపరుస్తూ మాట్లాడాడనే నెపంతో హంజా అనే ఒక బలమైన ముస్లిం అతనిని తన విల్లుతో బలంగా కొట్టాడు. అబూ జహ్ల్ బలహీనుడగుటచే ఏమీచేయలేక ఇంటికి వెళ్లి తన దగ్గర పనిచేస్తున్న ముస్లిం సేవకులని ప్రతీకారంతో హింసించాడు. ఈ విధంగా ముస్లింలు జరిగించే హింసకు ప్రతిహింస కూడా పెరిగిపోయింది (ఇబ్న్ ఇషాక్/హిషాం:185).

తగినంత సంఖ్యా బలం పొందుకొన్నాక, ముస్లింలు మక్కావారిపై మొట్టమొదట యుద్ధం ప్రకటించారు. అయితే ఈ యుద్ధంలో ముస్లింలు ఓడిపోయి మక్కా నుండి తరిమివేయబడ్డారు. ముస్లింలు అక్కడనుండి మదీనాకు వలసపోయి స్థిరపడ్డారు. అయినా మహమ్మద్ తన ఓటమిని జీర్ణించుకోలేక మక్కావారి కారావాన్లపై తెగబడి దాడులు చేసి వారిని చంపుతూ దోపుడు సొమ్ము కొల్లగొట్టేవాడు. 

****************
మదీనాలో నివసించేటప్పుడు కూడా మక్కావారు ముస్లింలను హింసించేవారు అని ముస్లింలు మాటిమాటికి ఆరోపిస్తారు. ఇందులో ఎంతవరకు సత్యముందో పరిశీలిద్దాం: 

మహమ్మద్ తన అనుచరులతో మదీనాకు వలసవెళ్లాక (హిజ్రా) కొద్దికాలానికి అతనికి అల్లాహ్ గాబ్రియేలు దూత ద్వారా ఇచ్చిన సందేశమే ఖురాన్‌లోని రెండవ అధ్యాయం (2వ సురా). ఈ అధ్యాయంలో హింసాత్మక వచనాలు అధికంగా ఉంటాయి (ఎందుకో అర్థం చేసుకోవచ్చు- మహమ్మద్ మక్కానుంచి తరిమివేయబడ్డాడు కాబట్టి!). 2వ సురాలో ఉన్న రెచ్చగొట్టే విషయాలను కప్పిపుచ్చుకోడానికి లేక సమర్థించుకోడానికి ముస్లిం మత సమర్థకులు (muslim apologists) మదీనాలో కూడా ముస్లింలను మక్కావారు హింసించారని ఆరోపిస్తారు. 2వ అధ్యాయంలోని వచనాలు అవిశ్వాసులైన పాగన్లు, విగ్రహారాధికులు, క్రైస్తవులు మరియు యూదులు ముస్లింలపై చేసిన అక్రమాలకి, దౌర్జన్యాలకి మరియు హింసకు ప్రతిగా వారిని తుదముట్టించుటకు ప్రేరేపిస్తాయి.  వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి ముస్లిం విద్వాంసులు అనాడు మదీనాలోని ముస్లింలపై అనేక దాడులు జరిగి చిత్రహింసలనుభవించారని వివరిస్తారు.  

దురదృష్టమేంటంటే మహమ్మద్ "చిత్రహింస" అని దేనిగురించి అన్నాడో ముస్లిం చరిత్రకారుల వివరణలను ఇంతకుముందే చూసాము. నేడు "హింస" అంటే భౌతికంగా, మానసికంగా సరైన కారణం లేకుండా గాయపర్చడం. మహమ్మద్ ప్రకారం "చిత్రహింస" అంటే ఆయన చెప్పింది అనుసరించకపోవడం, అతను రెచ్చగొడుతున్న మతవిద్వేషాలకు హెచ్చరించడం, యుద్ధం ప్రకటిస్తే అతనిని ఓడించి సంహరించకుండా, భౌతికంగా గాయపరచకుండా మక్కా నుంచి బహిష్కరించడం. ఈ "చిత్ర హింస"లకు ప్రతిగా అవిశ్వాసులను (కాఫీర్లను) సంహరించడం సరైన న్యాయం అని మహమ్మద్‌కు అల్లాహ్ సందేశమిచ్చాడు. (మహమ్మద్ మక్కావారి చిత్రహింసలు తాలలేక తనను తన అనుచరులను రక్షించుకోడానికి మాత్రమే కత్తి పట్టాడు- ఇది ముస్లిం సమర్థకుల వాదన). నిజానికి గమనించినట్లైతే, మక్కావారు మహమ్మద్ దాడులనుంచి తమనుతాము కాపాడుకోడానికి ప్రయత్నించారు. వారికి ఇస్లాం ఒక మతంగా మక్కాలోని కాబాలో ఉండడానికి, వారి మతప్రచారం చేసుకోడానికి ఎటువంటి అభ్యంతరం లేకపోయెను కాని కాబాలో కేవలం ఇస్లామే ఉండాలి, అన్యమతాలు వ్యర్థం అని దూషణలకు దిగినప్పుడు మాత్రమే వారు అభ్యతరం తెలిపారు.

మహమ్మద్ 2వ సురా ప్రకటించినప్పుడు వారిపై దాడులు జరిగినట్లు ఏ చరిత్రకారుడూ తెలుపలేదు. వారిపై సైన్యాలు దండెత్తి రావడం కాని లేక అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లుగాని ఎటువంటి అధారాలు లేవు. మదీనాపై మక్కావారి ప్రభావం ఎంతమాత్రము లేకుండెను. ముస్లింలు ఆరోపించినట్లు ఆనాడు వారిపై మదీనాలో ఎటువంటి హింసా లేక దాడి జరుగలేదు. "సీరా (biography)"లో వివరింపబడిన ప్రకారం తమపై యుద్ధం ప్రకటించి బహీష్కరణకు గురైన మహమ్మద్‌నకు హాని చేసే ఉద్దేశం మక్కావారికి ఎంతమాత్రం లేదు. 

అసలు ముస్లింలపై నిరంతరం దాడులు జరిగినట్లైతే వారిని పదే పదే యుద్ధానికి ప్రేరేపించాల్సిన అవసరం ఎందుకు? ఉదాహరణకు, ఎవరైనా మీ ఇంట్లోకి చొరబడి మీ కుటుంబసభ్యులపై దాడిచేస్తుంటే మీ కుటుబాన్ని, మిమ్మల్ని మీరు రక్షించుకోడానికి అల్లాహ్ నుంచి ప్రేరణకై నిరీక్షిస్తారా? కాని మహమ్మద్ మాత్రం తన ముస్లిం తెగను అల్లాహ్ పేరుతో కాఫీర్లు ఒక్కడు కూడా మిగలకుండా చచ్చువరకు సంహరించాలని తెగ విస్తారంగా ప్రేరేపించాడు. ఇదంతా కూడా మక్కా నుంచి బహీష్కరింపబడినందుకు ప్రతీకారచర్య కాదా?, యుద్ధకాంక్ష అసలే కాదా? ఇది ఆత్మరక్షణ కోసమేనా? ఎవరినుంచి ఆత్మరక్షణ?  
 

Wednesday 10 August 2011

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-2

అప్పట్లో మక్కావాసులు ఎంతో సహనశీలురైయుండిరి. మక్కా యొక్క ఆర్థిక సామాజిక ప్రగతి అక్కడికి వచ్చే యాత్రీకులపై అధారపడి ఉన్నప్పటికీ, ఆ యాత్రీకులను, మక్కావారిని అపహాస్యం చేస్తూ, వారి విశ్వాసాల్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ మహమ్మద్ 13 సంవత్సరాలు తన కొత్తమతమైన ఇస్లాంని ప్రకటించసాగాడు. దీనినిబట్టి మక్కావారు ఎంత ఓర్పుతో వ్యవహరించారో స్పష్టంగా తెలుస్తుంది.

మొదట్లో మహమ్మద్ మాటల్ని ఆయన స్నేహితులు మరియు కుటుంబసభ్యులు మాత్రమే అంగీకరించారు. పదమూడేండ్ల మతప్రచారం తరువాత మహమ్మద్ సంపాదించుకొన్న అనుచరగణం కేవలం ఒక వందమంది. వీరు ముసల్మాలనబడిరి. మహమ్మద్ భార్య (ఆమె పరివారం మరియు పనివారు) కాకుండా ఇస్లాంని స్వీకరించిన మొట్టమొదటి  వ్యక్తి అలీ (ఇతను మహమ్మద్‌కు అల్లుడవుతాడు మరియు తరువాత నాల్గవ ఖలీఫాగా ఎంచబడతాడు). ఇస్లాంను స్వీకరించిన ఇంకో ముఖ్యమైన వ్యక్తి ధనవంతుడైన అబు బాకర్ అనే వర్తకుడు. ఇతని పుణ్యమాని ముస్లిం తెగ ప్రభలింది.   

మహమ్మద్, అల్లాహ్‌తోపాటు మక్కావారి దేవుళ్ళను కూడా అంగీకరించే"సైతాను సందేశం"(Satanic Verses) అనే సంఘటన తరువాత జరిగిన కొన్ని పరిణామాలాతో మహమ్మద్‌కు మక్కావారితో సంబంధాలు చెడాయి. (సైతాను సందేశం Satanic Verses అనగా- మహమ్మద్ తమ దేవతాదేవుళ్ళను అంగీకరించాడని తెలిసి మక్కావారు సంతోషించి మహమ్మద్‌ను ఆదరించిరి. దీవివల్ల మహమ్మద్ అనుచరులు ఆయన చెప్పిన మాటల విశ్వసనీయతను ప్రశ్నించిరి. తనవారు తనపై నమ్మకం కోల్పోతున్నారని మహమ్మద్ గ్రహించి తనతో ఆ మాటలు, అనగా పాగన్లతో, ఇతరమతస్తులతో కలిసుండాలనే మాటలు సైతాను ప్రేరేపించి చెప్పించాడని వారికి సంజాయిషీ ఇచ్చి మళ్లీ మక్కావారి మతాల్ని, ఆచారాల్ని ద్వేషించడం మొదలుపెట్టాడు- తబారీ:1192; ఖురాన్ 22:52; 53:19-26; అంటే మహమ్మద్ సైతానుచే ప్రేరేపింపబడి పరమతసహనం గురించి మాట్లాడుటను Satanic Verses అందురు).    

ఈ పరిణామంతో నివ్వేరపోయిన మక్కావారు ఇంతకుమునుపుకంటె కోపోద్రికులై ముస్లింలను ఇంకెక్కువగా అవమానించారు. మక్కావారు చేసిన ఈ అవమానాలనే ముస్లింలు "భయంకరమైన చిత్రహింసలు"గా పేర్కొంటారు. అయితే ఈ "చిత్రహింసల"ను గురించి ముస్లిం చరిత్రకారులైన ఇబ్న్ ఇషాక్ మరియు అల్ తబారీ వ్రాసిన వివరాలలో కేవలం ఒక్క ముస్లిం చనిపోయినట్లుగా ఉంది. అది కూడా ఒక వృద్ధ మహిళ- ఈమె ముస్లింలకు జరుగుతున్న అవమానాలకు, అశాంతికి కలతచెంది మనోవేదనతో మృతిచెందింది (ఎవరూ భౌతికంగా గాయపరిచి చంపలేదు).    

ముస్లింమత ఆధునిక పరిరక్షకులకు (modern apologists) ఇది మింగుడుపడని విషయం. ఎందుకంటే వీరు ఎంతసేపూ మక్కావారు చిత్రహింసలకు గురిచేయబట్టే మహమ్మద్ వీరిపై దాడులు చేసాడు అని పదే పదే వాదించి తెలియనివారిని నమ్మించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. అయితే సత్యమేంటో ముస్లిం చరిత్రకారులు వ్రాసిన చరిత్రపాఠాలను చూసి గ్రహించవచ్చు.  

{మక్కావారే మొదట కత్తిదూసారు అనేది పచ్చి అబద్ధం. ఇది ముస్లిం ప్రచారం (muslim propaganda). చెప్పాలంటే మహమ్మద్ అసలు ఏ కారణం లేకుండానే దాడిచేసిన సందర్భాలున్నాయి. వీటి గురించి తదుపరి టపాలో వివరిస్తాను.}  

Sunday 7 August 2011

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-1

ముస్లిం చరిత్రకారులు వివరించిన ప్రకారం మక్కావాసులకు మహమ్మద్ ఇస్లాం అనే కొత్తమతాన్ని పాటించడం మరియు బోధించడం వలన ఎటువంటు అభ్యంతరం కలుగలేదు. ఎప్పుడైతే మహమ్మద్ తాను మాత్రమే దేవుడైన అల్లాహ్‌చే మానవాళికి పంపబడిన నిజమైన ఆఖరి ప్రవక్తగా ప్రకటించుకొనుచూ, ఇతర మతాలను, వారి విశ్వాసాలను కించపరుస్తూ, వారి పూర్వీకులను దూషించడం, అవహేళన చేయడం మొదలుపెట్టాడో అప్పుడు మక్కా ప్రజలు అభ్యంతరపడి మహమ్మద్‌ను మందలించారు (ఇబ్న్ ఇషాక్: 167). మక్కాలోని పెద్దలు వారి ఆచారాలపై మహమ్మద్ చేస్తున్న తీవ్రమైన ఆరోపణలు, దూషణలు విని కోపోద్రికులై మహమ్మద్‌కు ఆయన పూర్వస్థితిని గుర్తుచేస్తూ గద్దించి, హేళనచేసి పిచ్చివాగుడుగా కొట్టిపారేసారు. ఎందుకంటే ఆయన స్థితికి, దేవుని ప్రవక్త అని ఇంకా ఆయన చెప్పుకొంటున్న అనేక ప్రగల్భాలకి అసలు పొంతనలేకుండా పోయింది.

"మక్కావాసులు మహమ్మద్‌ను మానసికంగా, శారీరికంగా చిత్రహింసలు పెట్టి అనేకమార్లు చంపడానికి ప్రయత్నించడం వల్లే ఆయన అక్కడనుండి మదీనాకు పారిపోయాడు" అని ముస్లింలు మహమ్మద్ మక్కావాసులు మరియు వర్తకులు ప్రయాణించేటపుడు జరిగించిన హింసాత్మక దోపిడీలు మరియు హత్యలను సమర్థించడానికి పదే పదే వక్కానించి చెబుతారు. కాని అసలు మక్కాలో మహమ్మద్ ఎంత చిత్రహింసకు గురైయ్యాడో ముస్లిం మత గ్రంథాలనుండి ముస్లిం చరిత్రకారుల వివరణల నుండి నిజం తెలుసుకొందాం: 

ముస్లిం చరిత్రకారుల ప్రకారం మక్కావాసులు మహమ్మద్ ప్రచారంచేస్తున్న ఇస్లాం అనే నూతనమతం విషయమే ఎంతో సహనంతో వ్యవహరించారు. స్వతహగా, అనేక మతాల యాత్రికులకు కేంద్రబిందువైన మక్కా ఎంతో సహనం కలిగిన ప్రాంతంగా అనాడు ప్రసిద్ధిచెందిది. క్రైస్తవులు, యూదులు, బహుదేవతారాధికులు ఇలా అనేకులు తమతమ పవిత్ర మాసాల్లో "కాబా"లో పూజలుచేయడానికి సుదూరప్రాంతాలనుండి మక్కాకి వచ్చేవారు. వీరందరు ఎంతో పరమతసహనంతో పక్కపక్కనే వారివారి ప్రార్థనలు చేసుకొనేవారు. స్థానికంగ ఉండేవారు కూడా వీరికి మంచి ఆతిథ్యమిచ్చేవారు. ఎందుకంటే యాత్రీకుల వల్ల మక్కాలో బాగా వ్యాపారం జరిగేది. ఇది వర్తకులకి కూడా ప్రథాన కేంద్రంగా ఉండేది.   

మహమ్మద్ తన కొత్తమతాన్ని 13 సంవత్సరాలపాటు ఎంత ప్రచారంచేసినా కనీసం పదుల సంఖ్యలోనైనా అందులో చేరకపోవడంతో అసహనంతో ఇతరమతాలవారిని తీవ్రపదజాలంతో దూషిస్తూ అవమానకరమైన వ్యాఖ్యలు చేసేవాడు. దీవివల్ల స్థానికులకి, ప్రయాణీకులకి అందరికి విసుగుకలిగి కోపోద్రికులై అతన్ని అదుపు చేయడానికి మందలించేవారు.
"మహమ్మద్ అల్లాహ్ తనకు కనబర్చిన ఇస్లాం గురించి ప్రచారంచేసినప్పుడు మక్కావారెవరూ ఇతనిని వ్యతిరేకించలేదుకాని వారి దేవతాదేవుళ్ళను కించపరుస్తూ మాట్లాడినపుడు అతని మాటలు ఎవరూ వినకుండా కొందరు ఎదురుతిరిగిరి. మక్కావాసులు కొందరు ఇతనిని తమ శత్రువుగా ఎంచుకొనిరి" (ఇబ్న్ ఇషాక్/హిషాం: 167).      

మహమ్మద్‌కు సమస్యలు సృష్టించవద్దని గట్టిగా చెప్పినప్పటికీ ఖాతరుచేయకుండా తన ఊరివారైన మక్కావాసులతో వ్యాజ్యాలు పెట్టుకొంటూ వారి మతాలని కించపరుస్తూ వారిని రెచ్చగొట్టి జగడాలు రేపేవాడు. 
"ఇతను (మహమ్మద్) సృష్టిస్తున్న సమస్యలు ఇంతవరకు మేమెన్నడునూ చూడలేదని మక్కావారు అనిరి. అతడు వారి జీవనవిధానం మూర్ఖమైనదనియు, వారి అచారాలు వ్యర్థమనియు, వారి పితరులను అవమానిస్తూ, సమాజంలో ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు కలుగజేస్తూ శాపనార్థాలు పెడుతూ, వారి దేవుళ్ళను కించపర్చుచుండెను" (ఇబ్న్ ఇషాక్/హిషాం: 183).

అయినప్పటికీ మక్కావారు ఇతనిపై కఠిన చర్యలు తీసుకోకుండా అప్పుడప్పుడూ హెచ్చరించి వదిలేసేవారు. ఎందుకంటే అక్కడ శాంతికి భంగం కలిగితే యాత్రికులు రావడం తగ్గి వ్యాపారాలు దెబ్బతింటాయని వారు ఆలోచించేవారు. చివరికి మహమ్మద్‌ను నిలువరించడానికి అప్పుడప్పుడూ అతనికి డబ్బు కూడా ఇచ్చేవారు.
"వారు మహమ్మద్‌తొ చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి అతనిని పిలువనంపిరి. అతడు వచ్చాక- నీకు డబ్బు కావాలని ఈ గొడవలు చేస్తుంటే నిన్ను మాలో అందరికంటే ధనవంతుడిని చేస్తాం, నీకు గొప్పవాడివి కావాలనుంటే రాకుమారునిలాగా నిన్ను గౌరవిస్తాం, ఒకవేళ అధికారం కావాలంటే మాపై రాజుగా చేస్తాం. అంతేగాని ఇలా మక్కాలో శాంతికి భంగం కలిగించకు. ఇంతవరకు నీలా మా పితరులని ఎవరూ దూషించలేదు మరియు మా విశ్వాసాల్ని అవమానించలేదు. నీకేంకావాలో చెప్పు అని అతనిని వేడుకొన్నారు" (ఇబ్న్ ఇషాక్/హిషాం: 188).   



మక్కావాసులు ఇతర మతాలతో పాటు ఇస్లాం మతం మక్కాలో ఉంటే తమకు సమస్యేమీ లేదన్నట్లుగానే వ్యవహరించారు. అయితే మహమ్మద్ యొక్క తీవ్ర పదజాలం, ఇతర మతాల సంపూర్ణనిర్మూలన అనే ఉద్దేశాలవలనే వారు ఇబ్బంది పడ్డారు. ఇస్లాంతో వారికి వైరమేమీ లేదనడానికి మరో అధారం "సైతాను వాక్యాలు" (లేక "సైతాను సందేశం' Satanic Verses)లో కనబడుతుంది. చరిత్రకారుల ప్రకారం, మక్కావాసుల విన్నపాలని, హెచ్చరికలని మహమ్మద్ కొంతకాలం వరకు (తాత్కాలికంగా) తలొగ్గి ఇతరమతాలవారి హక్కులను అంగీకరించి వారిని కించపరచడం మానేసాడు.    
"ఇది విని మక్కావాసులు సంతోషించారు. తమ దేవతాదేవుళ్ళ గురించి అతనన్న (మహమ్మద్) మాటలు వారికి సంతోషం కలిగించి అతడు చెప్పే విషయాలను కూడా విన్నారు. మహమ్మద్ మోకాళ్ళూని ఖురాన్ అధ్యాయము వల్లించి బోధించిన విష్యములయందు ముస్లింలు విశ్వాముంచి మహమ్మద్‌ను వెంబడించిరి. అక్కడకు వచ్చిన ఖురేషువారైన ముష్కరులు (అన్యమతస్తులు) కూడా మోకాళ్ళూనిరి. ఎందుకనగా మహమ్మద్ వారి దేవుళ్ళను గూర్చి అనుకూలంగా మాట్లాడనారంభించెను. ఆ మసీదంతటిలో మోకాళ్ళూనని ముస్లింగాని కాఫీర్‌గాని (అన్యమతస్తుడు గాని) ఒక్కడు కూడా లేడు. అనగా అందరూ మోకాళ్ళూనారు" (అల్ తబారి- తారిఖ్: మొదటి భాగం).    

మత విద్వేషాలు వైతొలగినందుకు మక్కావాసులు ఎంతో సంతోషించారు. వారు ముస్లింలతో పాటు కాబాలో కలిసి ప్రార్థనలు చేయుచూ నెమ్మది కలిగి సంతోషముగా జీవించసాగారు. మహమ్మద్ వారి విశ్వాసాల్ని గౌరవించినందుకు వారు ముస్లింలను గౌరవించి కాబాలో స్థానం కల్పించి అంగీకరించారు.  

అయితే దురదృష్తవశాత్తూ ఈ శాంతిసమాధానాలు, సహోదరాభావం ఎంతోకాలం నిలువలేదు. ఎందుకంటే మహమ్మద్‌ను వెంబడిస్తున్న ముసల్మాన్లు అతని పూర్వ బోధకి మరియు అతడే నిజమైన దేవుని ప్రవక్త అని ప్రకటించినదానికి ఇప్పుడు పరమతసహనమైన మాటలకి ఎటువంటి పొంతనా లేదు, ఇవి రెండూ పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి అని ప్రశ్నించారు. వారిని శాంతింపజేయడానికి మహమ్మద్ మళ్లీ ఇతరమతాల్ని దూషించడం మొదలుపెట్టాడు. ఇలా మహమ్మద్ ప్లేటు పిరాయించడంతో మక్కావాసులకి మునుపటికంటే ఎక్కువ కోపం వచ్చి తీవ్ర అసహనానికి లోనయ్యారు.        

Saturday 6 August 2011

మహమ్మద్ జీవితం: మక్కాలో తొలినాళ్ళు

మహమ్మద్ క్రీ.శ. 570 లో ఒక విధవరాలికి జన్మించాడు. తన 6వ యేటనే తల్లిని కోల్పోయాడు. మహమ్మద్ అక్కడి తెగల పెద్దలు మరియు వ్యాపారస్తుల దయాదాక్షిణ్యాలపై అనగా వారు పెట్టింది తింటూ, సమాజంపై ఆధారపడుతూ పేదరికంలో పెరిగాడు. అయన తన చిన్నాన్న అబూ తాలిబ్ దగ్గర ఒంటెల కాపరిగా పనిచేసేవాడు. అబూ తాలిబ్‌కు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానమున్నప్పటికీ మహమ్మద్ మాత్రం తన 25వ యేట వరకు అనామకుడిగానే పెరిగాడు. తన 25వ యేట తనకంటె 15 యేండ్లు పెద్దదైన ఖదీజా అనే ఒక ధనవంతురాలైన విధవరాలిని వివాహం చేసుకొన్నాక మహమ్మద్ దిశ తిరిగింది.  

తన భార్య యొక్క క్రయవిక్రయ వ్యాపారం పుణ్యమాని మహమ్మద్‌లో స్వతహగానేవున్న ఇతరులను ఒప్పించగలిగే తెలివితేటలు ఇంకా మెరుగైయ్యాయి. అంతే కాకుండా ఆమె వ్యాపారాలావాదేవిల నిమిత్తం మహమ్మద్ చేసిన అనేక ప్రయాణాలు కొత్త కొత్త సంగతులు, వివిధ జనాల ఆచారవ్యవహారాలు తెలుసుకొనుటకు వీలు కలిగింది.తను ఇలా ప్రయాణాలు చేసి క్రైస్తవ్యం మరియు యూదా మతాల గురించి సంపాదించిన మిడిమిడి జ్ఞానాన్ని తరువాతి కాలంలో అల్లాహ్ తనకు నేరుగా గాబ్రియేలు దూత ద్వారా ఇచ్చిన "పవిత్ర" సందేశంలో తెలుపబడిన విషయాలుగా చేర్చుతాడు. 



ఖదీజా ద్వారా సంక్రమించిన ఐశ్వర్యం మరియు సుఖమయమైన జీవితం మహమ్మద్‌కు ఎంతో ఖాళీ సమయాన్నిచ్చింది. కాలక్షేపం కోసం ఏం చేయాలో తోచక అప్పుడప్పుడూ రోజులు తరబడి ధ్యానం మరియు ప్రార్థనలంటూ తనకు కావల్సిన ఆహార సామాగ్రిని తీసుకొని వెళ్లిపోయేవాడు. ఒకరోజు తన 40వ యేట గాబ్రియేలు దూత తనను దర్శించాడని మహమ్మద్ తన భార్యకు చెబుతాడు. అలా మొదలైన దర్శన సందేశాలు తను మరణించేంతవరకు అనగా సుమారు 23 యేండ్లు కొనసాగాయి. అల్లాహ్ గాబ్రియేలు ద్వారా మహమ్మద్‌కు మానవాళి శ్రేయస్సు కొరకు ఇచ్చిన ఈ సందేశాల సమాహారమే ఖురాన్. ఈ సందేశాలకు సాక్షి మహమ్మద్ తప్ప ఇంకెవరూ లేరు. మహమ్మద్‌తో పాటు ఉన్నవారు ఆయన జీవితంలో చేసిన కార్యములను వివరముగా తెలుపుచూ రచించిన సంకలనమే "హడీస్". అలాగే "సిరా" అనే రచన మహమ్మద్ జీవితచరిత్రను తెలుపుతుంది. "షరియా" చట్టానికి మూలమైన "సున్నాహ్" మహమ్మద్ వలే ఉత్తమ మార్గంలో ఎలా జీవించాలో తెలిపే గ్రంథం.

మహమ్మద్ తన భార్య ప్రోత్సాహంతో ప్రభావితుడై, తాను కూడా అబ్రహాము, మోషే, యేసు వలే అదే క్రమానికి చెందిన దేవుని ప్రవక్తగా స్వయంగా ప్రకటించుకొని తనకు అల్లాహ్ ఇచ్చిన సందేశాలపై స్థాపించిన ఇస్లాంలోకి ఇతరులను మార్చుటకునారంభించాడు. తన మాటలు వింటున్నవారికి ఖురాన్ అల్లాహ్ ద్వారా తనకు తెలుపబడిన సందేశమని బోధించేవాడు. ఇందులో వింతైన విషయం ఏమిటంటే, మహమ్మద్ యొక్క ఇహలోక కోరికలనన్నిటినీ ముస్లింలు అంగీకరిస్తారనే విషయాన్ని అల్లాహ్ ముందే ఊహించి తన సందేశాన్ని మహమ్మద్ ద్వారా ప్రజలకిచ్చాడు. ఎందుకంటే, ఖురాన్‌లో సుమారు 20 చోట్ల మహమ్మద్ ఏంచేసినా (మహమ్మద్ ఏలాగు నైతికవిలువలులేని జుగుప్సాకరమైన క్రియలు చేస్తాడు కనుక) దానికి అందరూ విధేయులుగానుండాలని అదేశించబడినది. ఎంత ముందు జాగ్రత్త!

మొదట్లో సమాజంలోని పెద్దలను, ఇతరమతస్తులని నొప్పించకుండా ఉండటానికి వారికి అనుకూలమైన అనేక అంశాలను జోడించి తన కొత్త మతాన్ని 300కు పైగావున్న కాబాలోని విగ్రహాల ప్రతిరూపంగా అల్లాహ్‌ను గూర్చి బోధించేవాడు. యూదుల మరియు క్రైస్తవుల విషయాలకి తోడు అన్య మతాల మిశ్రమ సందేశాలు కొందరికి బాగానే అనిపించాయి. అంతేగాక దేవదూత ప్రతక్షత ద్వారా అల్లాహ్ ఇచ్చిన సందేశమని పదే పదే చెబుతూ తన ప్రాముఖ్యతను కూడా కాపాడుకోగలిగాడు. మహమ్మద్ బైబిల్లోని
నేక విషయాలను తన మిడి మిడి జ్ఞానంతో మార్చి చెప్పినప్పుడు కొందరు అభ్యంతపడగా: "దేవుడైన అల్లాహ్ ప్రవక్తను వ్యతిరేకిస్తారా? దేవుడు తప్పు ఎలా చెబుతాడు?" అని అసహనంతో దబాయించేవాడు.

ఈ విధంగా మహమ్మద్ తనకు సంఖ్యాబలం లేనందువల్ల ఇతరులను కలుపుకోడానికి మెత్తని మాటలు చెబుతూ మక్కాలో చాలాకాలం గడిపాడు.    

Friday 5 August 2011

ఇస్లాం- పుట్టుపూర్వోత్తరాలు-2

రెండవ భాగం

అరేబియన్లకు, వారున్న కఠినపరిస్థితుల్లో వారి స్వంత అవసరాలు తీర్చుకొవడమే నైతికత అనిపించేది. కొద్దోగొప్పో కేవలం వారి వారి తెగ(గుంపు) వరకే ఒకరికొకరు తప్పనిసరి విధిగా సహాయంచేసుకొనేవారు. బహుశా వారున్న ఆ ప్రాంతపు కఠోర వాతావరణం మరియు బాహ్యప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకపోవడం వారిని అంత కఠినులుగా, స్వార్థపరులనుగా చేసుండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఇతరుల పట్ల ఇస్లాం మతస్తుల దృక్పథం ఎలా ఉంటుందో అర్థంచేసుకోవడానికి ఈ ప్రాథమిక అంశాలు ఎంతో తోడ్పడతాయి. అందుకే వీరి యొక్క నైతిక విలువలు, న్యాయ సూత్రాలు ముస్లింలకు ప్రయోజనకరంగా ఉండేటట్లు రూపొందించబడ్డాయి. అంటే వీరు చిన్న తెగల నుండి ప్రపంచముతో, తోటి మనుషులతో సంబంధంలేని ఒక పెద్ద తెగగా (ఇస్లాం మతస్తులు) ఏర్పడ్డారు. కాబట్టి వారి పూర్వికుల్లాగే కేవలం వీరి స్వార్థం చూసుకొంటారు (హడీస్ మరియు ఖురాన్‌ల్లోని అనేక భాగాల్లో అన్యులతో వ్యవహారం ఎంత వివక్షతో కూడి ఉంటుందో చూడగలము. రాబోయే టపాల్లో రెఫరెన్సులతో సహా వివరిస్తాను). 

అరేబియాలో, ముఖ్యంగా మహమ్మద్ జన్మించిన మక్కా వంటి వ్యాపార ప్రాధాన్య కేంద్రాల్లో అనేక మతాలు, ఆచారాలు ఉండేవి. వివిధ మతాల యాత్రికులను ఆకర్షించడానికి వారి మతసంబంధమైన ఘనాకారంలో "కాబా" అనే నిర్మాణాలు కొన్ని పట్టణాల్లో ఉండేవి. మక్కాలోని కాబాలో అనేక
దేవతాదేవుళ్ళ ప్రతిమలు ఉండేవి. ఇప్పటికీ ఒక నల్లని ఉల్క రాయి మెక్కాలోని కాబాలో ఉన్నది.  

ఈ నల్లని ఉల్క రాతితో పాటు మహమ్మద్ యొక్క ఖురేషీ తెగవారు "అల్లాహ్" అనే ఒక చంద్ర (నెలవంక) దేవుణ్ణి మొక్కేవారు. ఇంకా అనేక దేవతాదేవుళ్ళకు మక్కాలో ప్రాధాన్యం ఉండేది. మక్కావాసులు సర్వమత సహనశీలురిగా ఉండేవారు. సుదూర ప్రాంతాలనుండి వివిధ మతవిశ్వాసులు మక్కాకు వచ్చి వారి ప్రార్థనలను, పూజలను చేసుకొనేవారు (మహమ్మద్ మక్కాను స్వాధీనపర్చుకొన్నాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది).

ఈ వివిధ మతాచారాలనుండి మరియు మహమ్మద్ క్రైస్తవ్యంలోని మరియు యూదా మతంలోని (తప్పుగా) అర్థంచేసుకొన్న అంశాలనుండి పుట్టిన మతమే ఇస్లాం (మహమ్మద్‌కు తాను విన్న, గమనించిన సిరియా, అరేబియా చుట్టు పక్కల వ్యాప్తిచెందిన బైబిల్‌కు భిన్నమైన, కలుషితమైన క్రైస్తవ్యం గురించిన జ్ఞానం ఖురాన్లో స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకు, యేసు తల్లియైన మరియా మరియు యేసుకంటే సుమారు 1400 సంవత్సరాల పూర్వమున్న మోషే సోదరియైన మిర్యాము ఒకరే అని మహమ్మద్ అనుకొన్నాడు. అంటే మొహమ్మద్‌కు వీరు ఒకేతరం వారు కాదు అన్న ఇంగితం కూడా లేదు. ఈ విషయాలన్నీ స్వయానే దేవుడైన (?) అల్లాహ్ మహమ్మద్‌కు గాబ్రియేలు దూత ద్వారా తెలిపాడు. పాపం దేవుడైన (?) అల్లాహ్‌కి కూడా వీరు సమకాలీనులు కారు అనే విషయం అర్థం కాలేదు- ఇంకా ఇట్లాంటి తప్పులు ఖురాన్లో కోకొల్లలు!). 

ఇస్లాం- పుట్టుపూర్వోత్తరాలు-1

మొదటి భాగం

మహమ్మద్‌ను, ఆయన ఆలోచనా దోరణిని అర్థం చేసుకోవాలంటె ఇస్లాంని, అది ఆవిర్భవించిన అరబ్బు సమాజ స్థితిగతులను, అప్పటి మరియు అక్కడి కఠినమైన పరిస్థితులను గూర్చి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మహమ్మద్ (క్రీ.శ.570) కాలంలో అరేబియా ద్వీపకల్పం ఎందుకూ పనికిరాని బీడుభూమి (ఎడారి)గా ఉండేది. భగభగ మండుచున్న సూర్యుడితో భరింపశక్యంకాని మండుటెండతో పగళ్ళు, యముకలు కొరికె చలితో రాత్రులు- నివసించడానికి చాలా ప్రతికూలమైన వాతావరణం కలిగి ఉండేది. ఒక్క పచ్చని మొక్క మొలిచేది కాదు. సంచారజాతుల అరేబియన్ తెగలు రాళ్ళ మధ్యలో, మారుతున్న ఇసుకతిన్నెల్లో గుడారాలు వేసుకొని నివసించేవారు.   

రోము ఆధీనంలోవున్న యూరోప్ మరియు మధ్య ప్రాశ్చంలోని అనేక ప్రాంతాలు, చక్కని రహదార్లు, నీటిపారుదల వ్యవస్థ, తాగునీటి వసతులు కలిగిన మరియు ధార్మిక, సాంస్కృతిక, శాస్త్రియ పరిణతి కలిగి, కళలు, సంగీతంతో విలసిల్లుతున్న బైజాంటియన్ సామ్రాజ్యంలోకి కలపబడుచుండగా, మరోపక్క మనుగడకోసం, తమ తెగల ఆధిపత్యం కోసం నిరంతరం ఒకరితో ఒకరు పోరాడుచు చుట్టున్న ప్రపంచంతో సంబంధం లేకుండా అర్థాయుష్కులుగా ప్రాణాలు విడుస్తూ అరేబియన్ల జీవితం సాగుతూండేది.        

ఇటువంటి కఠినమైన గడ్డుపరిస్థితుల్లో నుంచి ఇస్లాం పుట్టింది కాబట్టి, వారికి తెలియని (మరియు మనసుకు, దేహానికి ఆనందాన్ని, ఊరటని ఇచ్చే) సంగీతం, కళలు మరియు కొన్ని ఆటలు నిషిద్ధమైనవిగా పేర్కొనబడ్డాయి అని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఈ నిషేదాన్ని ఇప్పటికీ తాలిబాన్లు అమలుపరుస్తున్నారు (ఉల్లంఘించినవారికి శిక్షేమిటో వివరించనక్కర్లేదనుకొంటా! -ఇక్కడ మరియు ఇక్కడ చూడండి). ఇస్లాం ప్రకారం దానికి బాహ్యమైన జ్ఞానాన్వేషణను సమ్మతించదు. అందుకేనేమో ఒరియానా ఫల్లసి తాను రచించిన The Rage and the Pride అనే పుస్తకంలో ఇస్లాం గురించి రాస్తూ, "ఈ మతం (ఇస్లాం) మతాన్ని (ఇస్లాంని) తప్ప మరేది ఉత్పత్తి చేయలేదు." 

అరేబియన్ ద్వీపకల్పం యొక్క ప్రతికూల వాతావరణం వలన దీనిపై ఏ సామ్రాజ్యానికి ఆసక్తి కలుగలేదు. కాబట్టి అభివృద్ధిచెందిన అనాటి  ఇతర సంస్కృతుల ప్రభావం వీరిపై పడలేదు. పర్షియన్ల పుణ్యమాని తీరప్రాంతాలపై వీరి ప్రభావం వలన అరేబియన్లు లిపి కలిగిన అరబిక్‌భాషను నెమ్మదిగా అభివృద్ధి చేసుకొన్నారు. మేకలు, గొఱ్ఱెలకోసం అరేబియన్ ఎడారిపై దండయాత్రచేయడం వ్యర్థమని ఏ సైన్యం కూడా వీరిపైకి రాలేదు. కాబట్టి ఈ ప్రదేశం ప్రపంచంనుండి తెగిపోయినట్లుగా ఉండేది. గ్రీకుల తర్కంతో, భారతీయ గణిత మేధస్సుతో ప్రపంచమంతటిని తాకిన జ్ఞానోదయ ప్రభావం అరేబియన్ ప్రదేశంపై ఇసుమంతైనా పడలేదు. ఎందుకంటె వీరు అనుదినం విపత్కర వాతావరణంతోను, ఇతర తెగలతోను పోరాటాల్లో మునిగిపోయారు. 

Thursday 4 August 2011

మహమ్మద్ జీవితం: ఒక చేదు నిజం

ముఖ్య ఘట్టాలు
   క్రీ.శ. 570- మక్కాలో జననం (అప్పటికే తండ్రి చనిపోయాడు)
           576 - తల్లి కూడా మరణించడంతో అనాధగా మారాడు (చిన్నాన్న        సంరక్షణలో పెరిగాడు)
           595 - ఖదీజా అనే తనకంటే వయసెక్కువున్న ధనవంతురాలైన విదవరాలితో వివాహం 
           610 - దేవదూత ద్వారా అల్లా తనకు వాక్యోపదేశం చేసాడని మొట్టమొదటి ప్రకటన
           619 - చిన్నాన్న మృతి
           622 - మక్కా నుండి మదీనాలో స్థిరపడటానికి ప్రయాణం (హిజ్రా)
           623 - మక్కా ప్రయాణీకుల గుడారాలపై (caravans) దాడి చేయాలని తన అనుచరులకు ఆజ్ఞ.
           624 - బద్ర్ యుద్ధంలో విజయం
           624 - ఖానుఖా యూదులను మదీనా నుండి నిర్మూలించెను 
           624 - అబూ అఫక్‌ను హతమార్చమని అనుచరులకు ఆజ్ఞ
           624 - అస్మా బిన్త్ మర్వాన్‌ను హతమార్చమని ఆజ్ఞ 
           624 - కబాల్ అష్రఫ్‌ను హతమార్చమని ఆజ్ఞ 
           625 - ఉహద్ యుద్ధంలో ఓటమి
           625 - నాదిర్ యూదులను తరిమివేయుట
           627 - ట్రెంచి యుద్ధంలో విజయం (దీనినే ఖందక యుద్ధం అంటారు) 
           627 - ఖురైజా యూదుల ఊచకోత
           628 - మక్కావారితో హుదైబియా సంధి
           628 - ఖైబర్ యూదులను నాశనంచేసి మిగిలినవారిని తన నియంత్రణలోకి తెచ్చుకొనుట
           629 - మూతా యొద్ద క్రైస్తవ ప్రాంతాలపై దండయాత్రలో ఓటమి
           630 - ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఆశ్చర్యకరంగా మక్కా కైవసం
           631 - క్రైస్తవ ప్రదేశమైన తబూక్‌పై దాడి. ప్రతిఘటన లేకుండానే కైవసం
           632 - జబ్బుపడి మరణం  

"మహమ్మద్ తననుతాను పొగుడుకొని ఆనందించే స్వార్థపరుడు (narcissist), పిల్లలతో లైంగిక కలాపాలు చేసేవాడు (pedophile), సామూహిక నరహంతకుడు (mass murderer), తీవ్రవాది, స్త్రీద్వేషి (misogynist), కామాంధుడు (lecher), పిచ్చివాడు, బలాత్కారుడు, దోపిడీదారుడు, కుట్రదారుడు" అని ముస్లిం మతభ్రష్టుడైన అలీ సినా (Ali Sina) ప్రకటించాడు. ఇది తప్పు అని ఎవరైనా తమ పవిత్ర ఖురాన్ మరియు ఇస్లామిక్ గ్రంథాలనుండి నిరూపించినట్లైతే 50,000 డాలర్ల బహుమానం ఇస్తానని మరియు తన ఆరోపణలను ఉపసంహరిచుకొంటానని బహిరంగ సవాలు విసిరారు. ఈ సవాలు ఇప్పటికీ నిలిచి ఉంది.        

Wednesday 3 August 2011

"మొహమద్- అత్యంత శక్తివంతమైన, దేవునిచే నియమించబడిన ఆఖరి ప్రవక్త (?), ఖురాన్- నేరుగా అల్లానుండి గాబ్రియేలు దూత మొహమద్‌కు వల్లించిన దేవోక్తి (?), ఇస్లాం- పవిత్రమైన, శాంతికరమైన మతం (?)- విశ్లేషణ

"భారతీయ బానిస వ్యాపారం" అనే శీర్షికతో 8 టపాలు ఈ బ్లాగ్‌లో వ్రాసాను. ఐతే ఇది ఇంకా పూర్తికాలేదు. మిగిలిన విషయాలను త్వరలోనే పూర్తి చేస్తాను. రాబోయే టపాల్లో "ఇస్లాం" గురించి ముఖ్యంగా పవిత్ర(?) ఖురాన్ గురించి విస్తృతంగా చర్చించాలని అనుకొంటున్నాను. ఇప్పుడా అవసరం ఏమొచ్చింది అని చాలా మందికి అనిపించొచ్చు లేక మనకెందుకులే గొడవ అనుకోవచ్చు. ఇటువంటి మన నిర్లక్ష్యమే మన చరిత్రను రక్తసిక్తం చేసింది. అంతేగాక ఇస్లాం గురించి ఒక బహిరంగ చర్చ జరగడం చాలా అరుదు. ఒకవేళ ముస్లిం మతం గురించి ఎమైనా అపోహలు, అపార్థాలుంటె కూడా చర్చించడం ద్వారా తొలగించుకోవచ్చు. అది ఇస్లాం కే మంచిది కదా! ఖురాన్ నేరుగా అల్లా నుండి వచ్చింది అని ముస్లింలు నొక్కి చెబుతారు. అయితే ఖురాన్ని మిగిలిన మతగ్రంథాలతో పోల్చి చూసి ఇది ఎంతవరకు నిజమో సత్యానేషులు తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఖురాన్ విశ్వనీయతను నిరూపించుకొంటె మంచిది. అంతేకాని దాని గురించి మాట్లాడేవారిని చంపుతామని బెదిరించడం ఇప్పటివరకు అనేక ముస్లింలు చేస్తున్న పని. రాబోయే టపాల్లో ఖురాన్, మొహమద్ మరియు ఆయన ప్రకటించిన ఇస్లాం గురించి నేను తప్పుగా వ్రాసాను అని ఎవరైన అనుకొంటే లేక నేను అపార్థం చేసుకొన్నాను అనుకొంటే దానిని నిరూపించి జ్ఞానోదయం కలుగజేయగలరు (ఎవరైనా ఈ బ్లాగ్ చదివితే!).

Tuesday 2 August 2011

భారతీయ బానిస వ్యాపారం-8

  
మొఘల్ పరిపాలన (క్రీ.శ. 1526-1707)-2


3) జహంగీర్ (1605-1627, అక్బర్ కుమారుడు) తన చరిత్ర గ్రంథంలో, తన తండ్రియైన అక్బర్ మరియు తన స్వంత పాలనలో కలిపి సుమారు ఐదారు లక్షలమందిని హతమార్చినట్లు వ్రాసాడు (ఖాన్:200). జహంగీర్, కేవలం ఒకే (1619-29) సంవత్సరంలో సుమారు 2 లక్షల హిందువులను బానిసలుగా విక్రయించడానికి ఇరాన్‌కు తరలించాడు. ముస్లింలు పిల్లలను నపుంసకులనుగా చేసి కప్పందార్లకి బానిసలుగా ఇచ్చేవారు (ఖాన్:285).

4)షాజహాన్ (1628-1658, అక్బర్ యొక్క మనుమడు): ఈయనపాలనలో హిందూ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతుల పిల్లలను, స్త్రీలను శిస్తు కింద లెక్కించి బానిసలుగా చేసుకొనేవారు. చివరకు రైతులు కూడా తిండికి గతిలేక వారినివారు బానిసలుగా అప్పగించుకొని, చిత్రహింసలు తగ్గించుకోడానికి ఇస్లాంను స్వీకరించేవారు. ఇటువంటి షాజహాన్ పాలనను గురించి మన చరిత్ర గ్రంథాల్లో "మొఘల్ స్వర్ణయుగం"గా వర్ణిస్తారు. నిజానికి ముసల్మాన్లు హిందుస్థాన్‌ను ఆక్రమించుకొన్నప్పటినుండి వారికి స్వర్ణయుగమే, కాని హిందువులకు అది ప్రత్యక్ష నరకం. షాజహాన్ హిందూ మరియు క్రైస్తవ ఆలయాలను నాశనం చేయడంలో క్షణమైనా ఆలస్యం చేసేవాడుకాదు. ఇంకా ఇతడు ఆగ్రాలో 4,000 మందిని ఇస్లాంలోకి మారడమో లేక చావడమో తేల్చుకోమని హెచ్చరిస్తూ వారి కన్యకలని, స్త్రీలని తన హారేంనకు తరలించాడు. హూగు ప్రాంతంలో 10,000 మందిని సంహరించాడు. తన స్వంత కుమార్తెలతో జుగుప్సాకరంగా సంభోగించినట్లు రుజువులతో సహా ట్రిఫ్కోవిక్ తన పుస్తకంలో వివరించాడు (112వ పుట; K-విభాగం). షాజహాన్ తన మూడవ భార్యయైన ముంతాజ్‌తో పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితంలో పధ్నాల్గవ కాన్పు సమయంలో మరణించింది. ఆమేతో ప్రేమగా ఉండేవాడని మచ్చుకు ఒక్క అధారం కూడా లేదు. ఇక తాజ్‌మహాల్ ఆయన కట్టించాడు అనేది చాలా వివాదాస్పద అంశమని ఎందరో ఆర్కియాలజిస్ట్‌లు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. 


మొఘల్ చక్రవర్తుల పాలనలో సుదూర దేశాలనుండి అనేక బానిసల్ని హిందుస్థాన్‌కు తీసుకొచ్చేవారు. ఉదాహరణకు, ఔరంగజేబ్ తన హారేం కాపలాకు ఉజ్బెక్ మరియు తాతర్ ప్రాంత స్త్రీలను నియమించాడు. ఇంకా అనేకమంది ఐరోపా స్త్రీలని కామబానిసలుగా కలిగి యుండెను (ఖాన్:317).

5)ఔరంగజేబ్ (1658-1707, అక్బర్ మునిమనుమడు), యావత్ భారతదేశాన్ని ఆక్రమించుకొని, ప్రజలందరిని బానిసలుగా చేసుకొని, సంపూర్ణ ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని ఆకాంక్షించాడు (ఖాన్:104). కొంచెం నిస్తేజమైన ఇస్లాంని ఇతడు పునరుత్తేజపరచాడు. అంటే ఆలయాల్ని, హైందవ వేద పాఠశాలల్ని ధ్వంసం చేసి అనేకమంది పండితులని, హిందువులని విచక్షణారహితంగా చంపాడు. కక్షసాధింపుగా షరియా చెట్టాల్ని, దిమ్మీ చెట్టాల్ని ప్రయోగించేవాడు (ఖాన్:98). హిందువులు భరించలేక ఎదురుతిరిగారు. నాయకత్వం వహిస్తున్న రాజ్‌పుట్ సైన్యాన్ని సమర్థంగా ఎదురుకోలేక వారిని మానసికంగా కృంగదీయడానికి ఇష్టమొచ్చినట్లు విధ్వంసాలు చేయడం, పండ్ల చెట్లను నరకడం, హిందూ స్త్రీలను, పిల్లలను చెరపట్టడం వంటి దుశ్చర్యలు చేసారు (సుక్డీయో: 265) (ముస్లిం హడిత్‌లో నియమింపబడినట్లు అన్యులైన బాటసారులకి, ప్రయాణికులకి తీవ్ర ఇబ్బంది కలుగునట్లు పండ్ల చెట్లను నరికి, తలదాచుకోకుండా దారినున్న నివాసాల్ని ధ్వంసంచేసి వారిని దోచుకొని పిల్లలను, స్త్రీలను చెరపట్టవలెను- 09.13 మరియు 09.15 హడిత్ ఆజ్ఞలు). భారతదేశాంలోనున్న ఒక ఫ్రెంచి వైద్యుడు, చిన్నపిల్లలను శిస్తు క్రింద లెక్కగట్టి ముసల్మాన్ సుంకరులు బలవంతంగా లాక్కుపోయేవారు అని తన డైరీలో వ్రాసుకొన్నాడు (ఖాన్:284).

భారతదేశంలోకి ప్రవేశిస్తున్న బ్రిటీష్‌వారు బానిసత్వాన్ని నిరోధించినప్పటికి ముస్లింలు భారత్ లోపలా వెలుపలా విరివిగా బానిసల వ్యాపారం చేసేవారు.




Monday 1 August 2011

భారతీయ బానిస వ్యాపారం-7

మొఘల్ పరిపాలన (క్రీ.శ. 1526-1707)- 1

1) జహీరుద్దీన్ షా బాబర్ (1483-1530) లోడిని ఓడించి ఢెల్లీ పీఠాన్ని అధిష్టించాడు. ఖురాన్ నుండి తెగ సూక్తులు చెప్పే బాబర్, జీహాద్ చేయుటలోను, హిందువుల తలలు నరికి గుట్టలుగా పోయడంలోనూ, పిల్లలను, స్త్రీలను చెరపట్టి అనుభవించుటలోను అంతే ఆసక్తి ప్రదర్శించేవాడు (ఖాన్:282; లాల్:438-459). ఈయన ఏలుబడిలో నాయకత్వం కోసం తీవ్రమైన పోటీ ఉండేది.


http://www.livius.org/a/1/alexander/hindu_kush.jpg
ఒకప్పుడు ఆఫ్గానిస్థాన్ హిందూ రాజ్యంగా ఉండేది. దీనికి గాంధార
మరియు వాహిలి లేక వాహిలిక అనే పేర్లుండేవి. ఇక్కడ శైవులు,
బౌద్ధమతస్తులు అధికంగా ఉండేవారు. హిందూ రాజులచే యేలబడుచున్న
ఈ ప్రాంత ముఖ్య నగరాలైన కాబుల్ మరియు జబూల్ పై క్రీ.శ. 654
నుండి అరబ్బు ముష్కరుల దాడులు ప్రారంభమయ్యాయి. సుమారు
200 యేండ్లు గాంధార (ఆఫ్ఘాన్) పటాన్లు వారిని నిలువరించ
గలిగారు కాని ఎట్టకేలకు ఓడిపోయారు. ముస్లింలు హిందువులను
ఊచకోతకోసిన రీతి ఎంత భయానకమంటే అక్కడి పర్వతశ్రేణులకి
"హిందూఖుష్" అని నామకరణం చేసారు. "హిందూఖుష్" అనగా
"హిందువుల వధ" అని అర్థం. కొండకోనలలో హిందువుల రక్తం
ఏరులైపారింది. గత్యంతరంలేక అనేకులు ఇస్లాంను స్వీకరించారు.
ఆఫ్ఘాన్‌లో 1980 లో కమ్యూనిస్టు ప్రభుత్వం పడిపోయాక
మరియు డిసెంబర్ 6, 1992లో బాబ్రి మసీదు కూల్చివేయబడ్డాక,
కాబుల్, జలాలబాద్, మరియు కాందహార్ ప్రాంతాలలో ఉన్న
75,000 మంది హిందూ మైనారిటీలపై భయంకర దాడులు జరిగాయి.
ఎప్పటిలాగే అంతర్జాతీయ మీడియా ముస్లిం మనోభావాలకు
భంగం కలగొద్దని ఆ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు. అనేకమంది
హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఢెల్లీ వంటి నగరాలకు
పారిపోయారు. ఉదాహరణకు ఢెల్లీ పరిసరప్రాంతాల్లో ఎక్కువగావుండే
"సెహగల్"లు ఆఫ్ఘాన్ హిందువులే!
2) అక్బర్ ద గ్రేట్ (1556-1605; బాబర్ మనుమడు) : పల్లెలు, పట్టణాలపై దాడిచేసి దోచుకోవడం, స్త్రీలను చెరపట్టడం సర్వసాదారణమైపోయింది. అయితే అక్బర్ ఈ దురాగతాల్ని కొంతవరకు నిరోధించుటకు ప్రయత్నించాడు కాని సఫలీకృతుడు కాలేదు. ముస్లిం సైన్యానికి, అధికారులకి మింగుడుపడదేమొనని చివరకు చూసి చూడనట్లు వదిలేసాడు. భారతభూభాగం చాలా వరకు అక్బర్ ఆధీనంలోకి వచ్చింది. నిరక్షరాసుడైన అక్బర్ కొంత సహనశీలి కాబట్టి ఇతన్ని ఇస్లాం వ్యతిరేకిగా ముల్లాలు, అధికారులు తలంచారు. అక్బర్ తన దర్బారులో ఇతర మతస్తులకి కూడా ఉన్నత కొలువులిచ్చాడు. ఇతను దిన్-ఎ-ఇలాహి (స్వచ్ఛమైన విశ్వాసం) అనే అందరినీ కలుపుకొనిపోయే కొత్త మతాన్ని ప్రకటించాడు (ఖాన్:152). ఇతడు హిందూ మరియు జొరాస్ట్రియన్ పండుగలను అధికారికంగా ఆమోదించాడు (ట్రిఫ్‌కోవిక్:112). ఇతడు "జిజ్యా" పన్నును రద్దు చేసాడు. అయినా ఇంకా అనేక పన్నులు హిందువులపై అదనంగా ఉండేవి. అయితే ఇతడు తన ఇస్లామిక్ మతాన్ని, విశ్వాసాల్ని పూర్తిగా వదల్లేదు. కాలిఫ్ అధికారాన్ని ఇతడు తృణీకరించినప్పటికీ మక్కా, మదీనా మరియు ఇతర ముస్లిం ప్రాధాన్య ప్రాంతాలకు విలువైన బహుమతులు పంపేవాడు.  అక్బర్‌కు అనేకమంది బానిసలు, "హారెం" లో ఉపపత్నులు, స్త్రీలు బానిసలుగా నుండిరి. అతడు విగ్రహారాధనను ద్వేషించేవాడు (మొఘల్ స్మృతులుగా పేర్కొనే "బాబర్‌నామా"లో వ్రాయబడినది). హిందువులలో అత్యదికులు విగ్రహారాధికులేనని పేర్కొన్నాడు. శిస్తులు కట్టలేక సుమారు 30 వేలమంది చిత్తూరు రైతులు 6,000 మంది రాజ్‌పుట్‌లతో కలిసి ఆయుధాలు చేపట్టగా, అక్బర్ వారిని భయంకరంగా సంహరించాడు. కొందరిని చెరపట్టి చిత్రహింసలు (ఏనుగులతో తొక్కించడం, ముళ్ళ కొరడాలతో కొట్టించడం, కాళ్ళకు తాళ్ళు కట్టి గుఱ్ఱాలతో లాగించి అడ్డంగా చీల్చివేయించడం వంటి శిక్షలు విధించాడు) చేసి బ్రతికిన వారిని బానిసలుగా చేసుకొన్నాడు (ఖాన్:88, 113; ట్రిఫ్‌కోవిక్:112).
"తిరగబడిన వారిని అతికిరాతంగా చంపారు. ఒక్కపూటలోనే సుమారు 2,000 మంది తలలు నరికారు. ప్రాణాలతో బయటపడ్డా వారిని, వారి భార్యలను దాసదాసిగా చేసుకొన్నారు. వారి ఆస్తులను, యౌవ్వన స్త్రీలను ముసల్మాన్లు పంచుకొన్నారు. ఇదంతా అక్బర్ చక్రవర్తి మూడు రోజులు అక్కడేవుండి జరిపించారు" (సుఖ్‌డీయో: 252).
"అక్బర్ కామవాంఛలు తీర్చుకోడానికి తన హారేంలో 5,000 మంది అందమైన యువతులు మరియు పిల్లలని కలిగి యుండెను" (ఖాన్:102).

అక్బర్ సామూహిక బానిసత్వానికి స్వస్తి పలకాలని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అతని సైన్యాధిపతులు, అధికారులు అనేకమంది బానిసల్ని కలిగియుండిరని చరిత్రకారుల గణాంకాలు సూచిస్తున్నాయి. ఎంత ఎక్కువమంది బానిసలుంటే అంత గొప్ప అనే భావం ముస్లిం అధికారుల్లో, ప్రథానుల్లో ఉండేది కాబట్టి ఏ కారణం లేకుండానే వారు అప్పుడప్పుడూ హిందువులపై విరుచుకుపడేవారు (ఖాన్:282). ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో నపుంసకుల వ్యాపారం బాగా జరిగేది కాబట్టి మగపిల్లలను, పురుషులను చెరపట్టి వారిని కొజ్జాలుగా మార్చి వ్యాపారం చేసేవారు. అబ్దుల్లా ఖాన్ ఉజ్బేగ్ అనే అక్బర్ యొక్క ఒక సైన్యాధికారి, ఇలా ప్రగల్భాలు పలికాడు;
"నేను 5,00,000 మంది స్త్రీలను, పురుషులను, పిల్లలను చెరపట్టి బానిసలుగా అమ్మేసాను. వారు మహమ్మదీయులుగా మారి వారు ఇక్కడ అల్లా "తీర్పు దినం" నాటికి కొన్ని కోట్ల జనాంగంగా తయారవుతారు" (ఖాన్: 103). 

అక్బర్ పాలనలో ప్రతీ ముస్లిం దెగ్గర అనేకమంది సేవకులు, బానిసలు ఉండిరి. అసలు ముస్లింలు కష్టపడే అవసరం లేకుండా పోయింది. (ఖాన్:283).

అక్బర్ కుమారుడైన జహంగీర్ మరియు మనుమడైన షాజహాన్ అక్బర్‌వలె కాక పూర్తిగా ఇస్లాంను పాటించారు.  


భారతీయ బానిస వ్యాపారం-6

ఢెల్లీ సుల్తాన్ పీఠాన్ని కూల్చివేసిన తిమూర్ (తామర్లిన్) (1398/99)

సూఫి ఇస్లామిక్ భక్తిపరుడైన (మధ్యాసియాకి చెందిన తుర్క/మొఘల్) అమీర్ తిమూర్ 1398/99 లో ఢెల్లీపై దండెత్తి 1,00,000 బానిసల్ని ఊచకోత కోసి సుమారు 2,00,000-2,50,000 మంది బానిసలను మరియు నేర్పుగల పనివారిని (skilled workers and craftsmen) మధ్యాసీలోని సామర్ఖండ్‌నకు చెరపట్టుకొనిపోయాడు (ఖాన్:282; లాల్:544). తిమూర్, తన "స్మృతుల గ్రంథం"లో ఢెల్లీ దండయాత్రను గూర్చి ఇలా వ్రాయించాడు:
"దండెత్తి వెళ్లిన 15,000 మంది తుర్క సైనికులొక్కొక్కరికి 50-100 బంధీల చొప్పున చిక్కిరి. ఇది కేవలం 17వ రోజు జరిగిన దాడిలో చిక్కిన బానిసల సంఖ్య. స్త్రీలు మరియు ఇతర దోపిడీ సొమ్ముల లెక్కకు అంతేలేదు. ముసల్మాన్‌ల ఆధీనంలోనున్న ప్రదేశాలపై మేము దాడిచేయలేదు కాని వారిని సూఫి ఇస్లాంను స్వీకరించమని హెచ్చరించాము. తిరిగి సామర్ఖండ్‌కు వెళ్లే దారిపొడవునా దోచుకొంటూ, అందమైన స్త్రీలను, పిల్లలను చెరపడుతూ వెళ్లాము."("తిమూర్ యొక్క స్మృతులు"- బోస్టం: 648).  

ఢెల్లీ సుల్తాన్ పీఠాన్ని తిరిగి స్థాపించిన సయ్యద్ మరియు లోడి వంశస్తులు (1400-1525)

తిమూర్ ఢెల్లీలో టర్కిష్ పాలనను విచ్చిన్నం చేసాక తనకు కప్పం కట్టేవారికి 1506 వరకు అధికారమిచ్చాడు.
ఈ సయ్యద్ సుల్తాన్లు కతెహార్ (1422), మాల్వా (1423) మరియు అల్వార్ (1425) ప్రాంతాలపై దండెత్తి ఎందరినో నరికి, బానిసల్ని దోపుడు సొమ్ముని కొల్లగొట్టారు. వీరి తరువాత లోడి సుల్తాన్లు ఢెల్లీ గద్దెనెక్కారు (1451-1526). ఎందరు మారినా హిందువుల స్థితి మాత్రం మారలేదు. అది అంతకంతకు దిగజారింది. సుల్తాన్ బహ్‌లూల్ చేసిన ఆకృత్యాలకు నిస్సార్ అనే ప్రదేశం నిర్మానుష్యమైంది. సికిందర్ లోడి రేవా మరియు గ్వాలియర్ పట్టణాల్లో ఇంతకంటే ఎక్కువ ఆకృత్యాలు చేస్తూ చెలరేగిపోయాడు (ఖాన్:282). 

సూఫీలైనా, సున్నీలైనా, షియాలైనా, ఇస్లాంలో ఏ తెగైనా సరే పర్యావసానం మాత్రం ఒక్కటే! అది అన్యమతస్తులు, విగ్రహారాధికుల ఊచకోత, వారి స్త్రీలను, పిల్లలను చెరచడం, వారి కష్టార్జితాన్ని దోచుకోవడం. హిందుస్థాన్ యొక్క రక్తసిక్త చరిత్రను కొందరు స్వార్థ రాజకీయనాయకులు వారి సొంతప్రయోజనాలకోసం అణచివేసారు. 

("మొఘల్ పాలన"- తరువాతి టపాలో)

Sunday 31 July 2011

భారతీయ బానిస వ్యాపారం-5

ఘోరిల దండయాత్ర: వాయువ్య భారతదేశాన్ని, గంగానది దిగువ ప్రాంతాల్ని జయించిన డెల్లీ పీఠ తుర్కలు (1206-1526).

1) ఘోరి పాలకులు, అనగా మొహమద్ ఘోరి మరియు ఆయన సైన్యాధిపతియైన కుతుబూద్దీన్ ఐబక్ (1206-1210) అద్వర్యంలో ఢెల్లీ సుల్తాన్ పీఠం స్థాపింపబడినది. అయితే వీరి పాలనలోకూడా సామూహిక శిరచ్ఛేదనాలు, బానిసలుగా మార్చుకోవడం, బలవంతపు మతమార్పిడులు, దోపిడీలు, అత్యాచారాలు, హిందూ ప్రార్థనా స్థలాల విధ్వంసాలు మాత్రం తగ్గలేదు. ఒక్కొక్క ముస్లింకి లెక్కకుమించి బానిసలుండిరి. ఉదాహరణకు 1195లో రాజా భీం నుండి ఐబక్ 20,000మంది బానిసల్ని తెచ్చుకొన్నాడు మరియు కళింగర్ దగ్గర 50,000 మంది బానిసల్ని తెచ్చుకొన్నాడు(1202) (లాల్:536).

"చివరికి పేద ముస్లిం దెగ్గర కూడా అనేకమంది బానిస సేవకులుండిరి (ఖాన్:103; లాల్:537)."



డెల్లీ సుల్తాన్‌పీఠావిర్భావం తరువాత ఢెల్లీ కేంద్రంగా దాడులు, బానిసల్ని చెరపట్టడం పెచ్చురిల్లాయి. హిందూస్థాన్ అంతట సామాన్య ముస్లింలకు కూడా లభ్యమయ్యేలా బానిసవిక్రయ కేంద్రాలు వెలిసాయి. ఈ బానిసలు వారికి ఒక వస్తువుతో సమానం. వీరిని ఎటుబడితే అటు తీసుకువెళ్లెవారు. కాలిఫ్(ముస్లిం మత ప్రథాన ఏలిక)కు ఐదవవంతు దోపిడిసొమ్ము మరియు బానిసలను పంపే సాంప్రదాయం ఆగిపోయింది. అయితే అప్పుడప్పుడు గౌరవసూచకంగా లేక బహుమానాలగా బానిసల్ని కాలిఫ్‌లకు, ధనిక ముస్లింలకు, ఇంకా చైనాకు కూడా పంపేవారు.

ముస్లిం సైన్యాలు విధ్వంసంచేసిన హోసలేశ్వర
దేవాలయంలో చేతులు తెగిపోయిన ఒక విగ్రహం

2) సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్ (క్రీ.శ.1236) ఇతడు కూడా భారతీయుల్ని బానిసలుగా చేసుకోవడం వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం చేసేవాడు. బానిసలపై ప్రభువుగా నియమింపబడిన ఉలగ్ ఖాన్ బల్బాన్ (1250లు-60లలో) లెక్కింపలేనంతమందిని బంధించాడు అని ఒక చరిత్రకారుడు వ్రాసాడు:
"ఆ అంధవిశ్వాసుల (హిందువుల) భార్యలు, పిల్లలు, ఆస్తులు వారిని జయించిన ముస్లిం సైనికుల     వశమయ్యాయి (లాల్:538)."

కతెహార్ అనే ప్రాంతంలో, 8 సంవత్సరాల వయసును మించిన మగవారినందరిని చంపేసి స్త్రీలను, పిల్లలను చెరపట్టమని బల్బాన్ తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు (లాల్:539).

హిందుస్థాన్లోని అనేక పల్లెలు, పట్టణాలపై సుల్తాన్ సైన్యం దాడులు జరిపి మందలు మందలుగా బానిసల్ని చెరపట్టుకుపోయారు. తప్పించుకొన్న హిందువులు కాలి బూడిదైన వారి గ్రామాలకు తిరిగి వచ్చేవారు. సుల్తాన్ సై
న్యం బంధించినవారు మాత్రం ఎన్నటికీ తిరిగిరాలేదు (లాల్:539).

3) ఖిల్జిల (1290-1320) మరియు తుగ్లగ్‌ల (1320-1413) పాలన

13, 14వ శతాబ్దాల ఖిల్జీలు మరియు తుగ్లగ్‌ల పాలనలో బానిసత్వం పెరిగింది, అలాగే ఇస్లాం కూడా వ్యాప్తిచెందింది. ప్రతిరోజు వేలమంది బానిసల్ని ఎంతో చౌకగా అమ్ముతుండేవారు (ఖాన్:258). అల్లావుద్దిన్ ఖిల్జి (1296-1316) విస్తారమైన బానిసల్ని చెరపట్టి, వారిని గొలుసులతో బంధించి, చిత్రహింసలు పెడుతూ ఘోరంగా అవమానించేవాడు. కేవలం ఒక్క సోమ్నాథ్‌పై దాడిలోనే, "20,000 మంది అందమైన స్త్రీలను, లెక్కింపలేనంతమంది పిల్లలను మహ్మదీయ సైన్యం చెరపట్టించి. వారి నివాసాల్ని, పట్టణాలని నేలమట్టంచేసి వారికి కలిగినదంతయు దోచుకొన్నారు. (బోస్టం: 641; లాల్:540)."

కొన్నివేలమంది వధింపబడ్డారు. అల్లవుద్దిన్ ఖిల్జి తన స్వంత సేవకే 50,000 మంది స్త్రీలను, పిల్లలను, అందమైన పురుషులను వినియోగించుకొనేవాడు. తన మందిరాల్లో మొత్తం 70,000 మంది బానిసలు నిత్యం పనిచేసేవారు. (లాల్:541).

ఆడవారు "జౌహార్" లేక "సతి" గావించేవారు. అంటే  ముస్లింలనుండి బానిసత్వం మరియు మానభంగాల్ని తప్పించుకోడానికి  నిప్పంటిచుకొని లేక మరోవిధంగా ఆత్మహత్య చేసుకొనేవారు. (తరువాత కాలంలో కొందరు స్వార్థ హిందూ ఛాందసవాదుల మూలంగా ఈ "సతి" భర్త చనిపోయిన స్త్రీలకు జరిగించుట ఆచారమైంది).

"తుర్కలు వారికి కావల్సినప్పుడెల్ల హిందువులను బంధించి, వారిష్టమొచ్చినట్లు చేసి, బానిసలుగా అమ్మేవారు" అని సూఫియుడైన అమీర్ ఖుస్రూ వ్రాసారు.   

13, 14వ శతాబ్దాలను గురించి ఒక హిందు చరిత్రకారుడు ఇలా వ్రాసాడు: " ఎక్కడచూసిన బానిసవిక్రయ
కేంద్రాలు ఉండేవి. అవెప్పుడూ హిందూబానిసలతో నింది ఉండేవి. ముస్లిం సైన్యాలు జరిపిన అనేక దాడుల్లో లక్షలమంది హిందువులు మృతిచెందారు. ఘోరి మాలిక్ అనే ముస్లిం ఆక్రమనదారునికి హిందువుల్ని నిర్దాక్షిణ్యంగా హతమార్చి, బ్రాహ్మణులను వారి గోవులను సమ్హరించి వారిని భయభ్రాంతులకు గురిచేయమని సందేశం పంపబడినది. దానిని నెరవేరుస్తూ ఈ తుర్కలు విధ్వంసం చేస్తూ, విచ్చలవిడిగా దోచుకొంటు, స్త్రీలను పిల్లలను చెరుస్తూ హత్యాకాండ గావించారు (లాల్: 634)."   

మొహమ్మద్ తుగ్లగ్ (1325-1351) అల్లావుద్దీన్ ఖిల్జీని తలదన్నేలా అనేకమంది హిందువులని బానిసలుగా చెరపట్టాడు.
"సుల్తాన్ విగ్రహారాధికులైన హిందువులను సంహరించుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఈయన హయాంలో, ఎందరో హిందువులు బానిసలుగా చెరపట్టబడటం వలన బానిసల్ని అత్యంత చౌకగా కొనుగోలు చేసేవారు" అని ఒక చరిత్రకారుడు వివరించారు.   

సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లగ్ (1351-1388) ఈయన దెగ్గర 1,80,000 మంది అందమైన దృడమైన యువకులు బానిసలుగా ఉండిరి. 40,000ని అంగరక్షకులుగా కలిగి యుండెను. సుల్తాన్, తన సామంతుల్ని, అధికారుల్ని- యుద్ధాలు చేసినప్పుదెల్లా శ్రేష్ఠమైన బానిసల్ని తనకు పంపమని" ఆదేశించాడు (సూక్ధెయో: 165-167; లాల్:542).

ఈయన హయాంలో భారతదేశం వెలుపల కూడా అనేక బానిసవిక్రయ కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. కాందహార్, గజిని, ఖురాసన్, సామర్ఖండ్ మొదలగు పట్టణాలకి సుదూరప్రాంతాలనుండి వర్తకులు, వ్యాపారులు భారతీయ బానిసలని కొనుగోలు చేయడానికి వచ్చేవారు. హిందువుల మధ్య నివసించే భారతీయ ముస్లింలు హిందువులను నొప్పించకుండా ఇతర (ఐరోపా, ఆఫ్రికా మొదలగు) జాతుల బానిసల్ని కొని తెచ్చుకొనేవారు. ఎందుకంటే చెట్టాలు ముస్లింలకు అనుకూలంగా ఉండటం వలన హిందు ఇరుగుపొరుగువారితో వ్యాపారలాలాదేవీలు ముస్లింలకు లాభదాయకంగా ఉండేవి కాబట్టి హిందు బానిసలను కలిగి ఉంటే వ్యాపారం సరిగా సాగదని వారు ఇతరజాతులను బానిసలుగా కలిగి ఉండేవారు(ఖాన్:318).  


Saturday 30 July 2011

భారతీయ బానిస వ్యాపారం-4

ఫంజాబ్‌ను ఆక్రమించుకొన్న ఆఫ్గానిస్తాన్‌లోని గజినీ ప్రాంతవాసులైన గజినివిద్ తుర్కలు (Ghaznivid-Turks) (క్రీ.శ. 997-1206)

మొహమద్ గజినీ (997-1030) 17సార్లు హిందూస్థాన్‌పై దండెత్తి ఎంతో దోపుడు సొమ్ము తీసుకుపోయాడు అంతేగాక ఆయన చంపినవారు మరియు బంధిపబడి ఆఫ్గానిస్థాన్‌లోని గజినీ పట్టణానికి బానిసలుగా తీసుకుపోబడినవారు సుమారు 20లక్షలమంది (ఖాన్:315వ పుట). ఉదాహరణకు సుల్తాన్‌యొక్క కార్యదర్శి మరియు గణాంకుడైన ఉత్బీ,
సుల్తాన్ చరిత్ర గ్రంథంలో వ్రాసిన లెక్కలు-......తానేసర్‌నుండి ముస్లిం సైన్యాలు 2,00,000 మందిని గజినీ పట్టణానికి చెరపట్టుకొచ్చారు.......1019లో 53,000 మంది బానిసల్ని కొత్తగా బంధించి తెచ్చారు........ఇంకోసారి కాలిఫ్ కు దక్కవలసిన ఐదవవంతు బానిసలు 1,50,000 మంది (అంటే మొత్తం బానిసల సంఖ్య 7,50,000 మంది)....... తూర్పునుండి 5,00,000 బానిసలను ముస్లిం సైన్యం తీసుకువొచ్చింది..... 
ఇంకా మొహమద్ గజినీ కార్యదర్శియైన అల్-ఉత్బీ ఇలా వివరించాడు:
"దేవుని సైన్యమైన ముసల్‌మాన్‌లు 15,000 మందిని ఊచకోత కోసారు. వారి ఖడ్గాలు కారుమేఘాల్నుంచి వెలువడుతున్న మెరుపులవలే కదలసాగాయి, నేలరాలిన తోకచుక్కలా విగ్రహారాదికుల రక్తం ఏరులైపారింది. అంతేగాక అనంతమైన సంపద, 5,00,000 మంది అందమైన స్త్రీలు, పురుషులు బానిసలుగా ముస్లిం సైన్యానికి చిక్కారు (ఖాన్: 191)."

గజినివిద్‌లు ఇస్లాం సుల్తాన్ రాజపీఠమైన పంజాబ్‌లో 1186 వరకు ఏలారు. కాశ్మీర్, హన్సి మరియు పంజాబ్‌లో అనేక ప్రాంతాల్లో వీరు భయంకర నరమేదాలు చేసారు. ఎంతోమందిని బానిసలుగా చేసుకొన్నారు. ఉదాహరణకు 1079లో జరిగిన ఒక్క దాడిలోనే సుమారు 1,00,000 మందిని చెరపట్టి బానిసలుగా చేసారు (తారీక్-ఈ-అల్ఫీ, "ఖాన్" 276వ పేజీలో).   

Thursday 28 July 2011

భారతీయ బానిస వ్యాపారం-3

బానిసత్వం:ఇప్పటి పాకిస్తాన్ (సింధ్), బంగ్లాదేశ్, మరియు కాష్మీర్లలో కొన్ని ప్రాంతాలు పూర్వం ఇండియాలో అంతర్భాగంగా ఉండేవి. ఇస్లాం దండెత్తకమునుపు (7వ శతాబ్దానికి మునుపు) ఆఫ్గనిస్తాన్లో బౌద్ధమతం మరియు హిందుత్వం ఉండేవి. 16వ శతాబ్దంలో ఆఫ్గనిస్తాన్ని భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ సామ్రాజ్యం మరియు పర్షియా యొక్క సఫావిద్ సామ్రాజ్యం పంచుకొన్నారు. 

మతఛాందసవాదులు కానటువంటి ఉమయద్ రాజులు హిందువులకు "దిమ్మీ" హోదా కలిపించారు. "దిమ్మీ" హోదా మాములుగా యూదలకి మరియు క్రైస్తవులకై కలిపించాలని ఖురాన్ సూచిస్తుంది. "దిమ్మీ" హోదా అనగా, ముస్లిం ఏలుబడిలో ఉన్న అన్య మతస్తులు (ఖురాన్ ప్రకారం కేవలం యూదులు, క్రైస్తవులు) వారి వారి మతాలలోనే కొనసాగొచ్చు కాని షరియా చట్టంలో ద్వితియశ్రేణి పౌరులుగా ఉంటారు. అంటే తోటి ముస్లింలకంటే అధిక శిస్తులు చెల్లించాలి, ఇంకా అనేక కట్టుబాట్లు ఉంటాయి. దిమ్మీలను సమాజంలో అధములుగా ఉంచుతారు. అయితే విగ్రహారాధికులైన హిందువులను ఖురాన్లో సూచించిన ప్రకారం హతమార్చాలి లేక ఇస్లాం స్వీకరించేటట్లు చేయాలి. అంటే ముస్లింల పాలనలో హిందువుల స్థితి యూదులు, క్రైస్తవలుకంటే ఇంకా దయనీయమైనది- వారికి రెండే మార్గాలు: చావాలి లేక ఇస్లాంలోకి మారాలి. ఉమయద్ లు ఖురాన్ కు వ్యతిరేకంగా హిందువులకు "దిమ్మీ" హోదా ఇవ్వడంలో వారి స్వార్థం ఎంతో ఉంది- ఒకటి, హిందువుల సంఖ్య చాలా విస్తారంగా ఉంది కాబట్టి షరియా ప్రకారం వీరికి దిమ్మి హోదా ఇస్తే అధిక శిస్తులు వసులుచేసి ఎంతో ధనం సమకూర్చుకోవచ్చు. రెండు, మతమార్పిడులు, సంహారాలు చేయకపోవడం వలన హిందువుల దృష్టిలో ఇతర ముస్లిం పాలకులకంటె మంచివారిగా పేరు సంపాదించుకోవచ్చు. అయితే కొందరు ముస్లిం పెద్దలు, హిందువులను ఎందుకు సంహరించడం లేక మతం మార్చుకొనేట్లు చేయడంలేదని హుమయూన్ రాజును (సం. 1236) అడుగగా, అతడిట్లన్నాడు:
"హిందువులకు దిమ్మీ హోదా ఎందుకిచ్చామంటే ప్రస్తుతం ఈ దేశంలో ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ఇంకొన్నేండ్లలలో పట్టాణాల్లో, పల్లెల్లో ముస్లిం జనాభా బాగా పెరిగిన తరువాత హిందువులను చావు లేక ఇస్లాంలోకి మారడం మధ్య ఎదోఒకటి ఎన్నుకోమని శాసించవచ్చు" అని నచ్చజెప్పాడు (లాల్: 538వ పుట).   


పేరుకి దిమ్మీ హోదా పొందినప్పటికీ హిందువుల మీద దాడులు, హత్యాకాండలు, మతమార్పిడులు, బానిస  వ్యాపారం వంటివి చురుగ్గా సాగుతూనే ఉందేవి. తిరగబడ్డవారిని నిర్దాక్షిణ్యంగా చంపడం, అందమైన బాలురలను నపుంసకులనుగా చేసి బానిసలుగా చేసుకోవడం మరియు కామవాంఛలు తీర్చుకోవడానికి వారిని వాడుకోవడం సర్వసాదారణమైపోయింది. ఈ విథంగా హింసింపబడ్డవారు మరియు చంపబడ్డవారు ఎంతమందో వాస్తవ సంఖ్య తెలియనప్పటికి ఊహింపలేనటువంటి స్థాయిలో అత్యదికులు ముస్లిముల బారిన పడ్డారని వారి చరిత్రకారుల రాతలనుబట్టి తెలుసుకోవచ్చు. హిందువుల ఆత్మగౌరవానికి, మానప్రాణాలకు కలిగే ముప్పుగాక వారి ఆస్తిపాస్తులు, నగనట్ర అన్నీ ముస్లింలు దోచుకొనేవారు. 

ముస్లిం పాలకులు స్థానికులు కాదు, మధ్యప్రాచ్యం నుండి దండెత్తివచ్చినవారు, కాబట్టి 13వ శతాబ్దంవరకు వారు బానిసల్ని భారతదేశంనుండి మధ్యప్రాచ్యానికి తరలిస్తూ ఉండేవారు. అయితే 1206 సం. లో ఢిల్లీ సుల్తానైట్ (సుల్తానుల పాలనకేద్రం-ఢిల్లీ. పరిపాలన ఢిల్లీ నుండి సాగేది కాబట్టి పరిపాలనాయంత్రాగం, వారి పరివారాలు ఇక్కడే నివసించుటకు వచ్చారు) స్థాపించాక భారతీయ బానిసల ఎగుమతి కొంచెం తగ్గింది. ఎందుకంటే ఢిల్లిలో వారి సేవలు అవసమైయ్యాయి. అయినప్పటికీ అవసరాలనుబట్టి బానిసల్ని వివిధప్రాంతాలకి తరలించేవారు. అంతేగాక ఇతరప్రాంతాల (యూరోప్, ఆఫ్రికా) బానిసల గుంపుల్ని ఇక్కడికి తీసుకొచ్చేవారు. ఈ విధంగా ముస్లిం సైనిక బలగాలు ముస్లిములుగా మార్చబడ్డ వివిధజాతుల ప్రజలతో, హిందువులతో, మతమార్పిడిచెందిన భారతీయ ముస్లింలతో వైవిధ్యంగా ఉండేది. ఖురాన్ ప్రకారం బానిసలు అల్లాచే వాగ్దానంచేయబడిన దోపిడిసొమ్ము, కాబట్టి ఎక్కువ బానిసలను సంపాదించుకోవడం అనేది జీహాద్ జరిగించుటకు ఒక ప్రథాన కారణమయ్యేది.


"బానిసలు ఎంత అధికమైపోయారంటే నామమాత్రపు సొమ్ముతో వారిని కొనుగోలు చేయొచ్చు. ఇదంతా అల్లా దయనే. ఆయనను నమ్ముకొన్న ఇస్లామీయులను ఆయన ఇలా బానిసలనిచ్చి హెచ్చిస్తాడు, అవిశ్వాలు, విగ్రహారాధికులను నలుగగొట్టి దిగజారుస్తాడు (క్రీ.శ. 942-997 వరకు గజినీలు చేసిన దండయాత్రలలో చెరపట్టబడి బానిసలుగా చేసుకోబడినవారిని గూర్చి వ్రాయుచు సుల్తాన్ సుబుక్తిగిన్ జరిపిన ఒక దండయాత్రను గూర్చి వివరించుచూ ముస్లిం చరిత్రకారుడైన ఉత్బీ వ్రాసిన వాక్యాలు).  

ముస్లిం పాలకులచే మొట్టమొదట కైవసం చేసుకొబడిన సింధ్ ప్రాంతంలో అత్యదికులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడిన బానిసలు మరియు వారి యజమానులైన కొందరు అరబ్బు ప్రభువులుండేవారు (ఖాన్:299). మొదట్లో బానిసల్ని భారత భూభాగంనుండి బలవంతంగా వెలుపలకు తరలించేవారు. ఉదాహరణకు, మొదటి వాలీద్ కాలీఫ్ సంస్థానపు ప్రభువైన హజ్జజ్ బిన్ యూసుఫ్ చే పంపబడిన ఖాసీం అనే సైన్యాధిపతి క్రీ.శ.712 నుండి 715 వరకు మూడేండ్లలో జరిపిన దండయాత్రల్లో 3,00,000 మందిని బంధించి బానిసలుగా తరలించుకుపోయాడు (ఖాన్ 299వపుట; ట్రిఫ్కోవిక్ పీ 109వ పుట). ఈ జీహాద్ లో వివిధ ప్రాంతలనుండి వచ్చిన అనేక ముస్లిం యోధులు పాల్గొనేవారు. ఒకసారి అనుకోకుండా ఖాసీం ను వెనక్కు పిలిపించి బహుశా జంతుచర్మాలలో కుట్టించబడి చచ్చునట్లుగా మరణశిక్ష విధింపబడెను, ఎందుకంటే కాలిఫ్ (ప్రభువు) యొక్క ఉపపత్నులశాలకు తరలింపబడుటకు సిద్ధపరచబడిన ఇద్దరు సింధీ యువరాణులతో కాసీం సంభోగించినట్లు అభియోగం మోపబడెను(లాల్: 439వ పుట). 

వివిధ కాలీఫ్ ల హయాంలో 8వ మరియు 9వ శతాబ్దాల్లో బానిసలకొరకు అనేక దండయాత్రలు జరిగేవి.     
 

Tuesday 26 July 2011

భారతీయ బానిస వ్యాపారం-2

ముస్లింల దండయాత్రల వలన అపారమైన ప్రాణ, ధన నష్టాలు మరియు సంస్కృతి వినాశనం జరిగాయి. చారిత్రిక గణాంకాల ప్రకారం క్రీ.శ. 1000 నుండి 1525వ సంవత్సరం వరకు సుమారు 10 కోట్లమంది ఊచకోతకోయబడ్డారు. అంటే 500 యేండ్లపాటు జనాభా అబివృద్ధి చెందాల్సిందిపోయి క్షీణించింది (లాల్ గారు  ఎం.ఏ.ఖాన్ రచించిన Islamic Jihad: A Legacy of Forced Conversion, Imperialism, and Slavery అనే పుస్తకంలోని 216వ పుటలో సూచించిన గణాంకం). నమ్మశక్యంగా లేదా? ఐతే ఈ లెక్కలు గమనించండి: 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం కేవలం 9 నెలల్లో సుమారు 30 లక్షలమంది బంగ్లాదేశి ముస్లిం మరియు హిందువులను, కొందరు భారతీయులను వధించింది (ఖాన్ 216 పుటలో). ముస్లింలు జరిగించే హింసాకాండను ప్రతీసారి చూసిచూడనట్లు విస్మరించే అంతర్జాతీయ సమాజం, ఈ ఊచకోతనూ పెద్దగా పట్టించుకోలేదు. 


అధారాలను మరియు గణాంకాలను పరిశీలిస్తే విస్మయకరమైన పెద్ద సంఖ్యలో భారతీయులను ఇస్లామిక్ క్రూర రాజ్యాలు బానిసలుగా చేసుకొన్నాయి. భారతభూభాగాలపై ముస్లింలు జరిపిన దండయాత్రలు బహుశా ప్రపంచచరిత్రలో అత్యంత రక్తసిక్తమైనవేమో! ఖాన్:201వ పుటలో చరిత్రకారుడైన డ్యురంట్ ఇలా అన్నాడు:
"హిందువుల ఊచకోత, బలవంతపు మతమార్పిడులు, హిందూ దేవాలయాల కూల్చివేత, బానిస సంతల్లో వేలంవేయడానికి చెరపట్టుకుపోబడిన హిందూ స్త్రీలు, పిల్లలను గూర్చిన విషయాలను, ముస్లిం రాజులు క్రీ. శ. 800-1700 వరకు జరిగించిన భయంకరమైన రాక్షస కార్యాలని గొప్ప విజయాలుగా గర్వంతో అత్యుత్సాహంతో ముస్లిం చరిత్రకారులు ఇస్లామిక్ రాజుల గ్రంథాలలో వర్ణశోభితంగా వ్రాసారు." 

అరబ్బు ఆక్రమణదార్లు అసలేంచేసారో తెలుపుతు రిజ్వాన్ సలీం ఇలా వ్రాసారు:
"నాగరికతలో అత్యంత హేయమైన క్రూరులుగా పిలవబడుటకు ఏ సంస్కృతీ ఇష్టపడని ముష్కరులు అరేబియా మరియు పశ్చిమాసియా నుండి 7వ శతాబ్దంలో భారతభూమిలోకి రాసాగిరి. ఈ ఇస్లామిక్ ఆక్రమణదార్లు దండెత్తి వచ్చి మగవారినందరిని తెగనరికి, అనేక హైందవ దేవాలయాల్ని, విగ్రహాలని, శిల్పాలని తుత్తినియలుచేసి, కోటలను రాజమందిరాలని కొల్లగొట్టి విస్తారమైన దోపుడు సొమ్మును, స్త్రీలను పట్టుకొనిపోయిరి.....కానీ చాలామంది భారతీయులు, ఎంతో పరిణతిచెందిన, అన్ని నాగరికతలకంటె విజ్ఞానంలో, వైద్యంలో ఇంకా అనేక శాస్త్రాలలో ముందున్న నాగరికత, ఎంతో సృజనాత్మకత కలిగిన, శాంతికరమైన సంస్కృతిని ఈ ముస్లిం ముష్కరులు నాశనం చేసారన్న విషయం గ్రహింపకున్నారు (ఖాన్:179వ పుటలో)." 

ఇస్లాం ఇండియాలో ప్రవేశింపకమునుపు కూడా యుద్ధాలు జరిగాయికాని, అవి ఒక జాతి లేక రాజ్య వినాశనానికి, అసంఖ్యాకమైన బానిసలకోసం, స్త్రీలకు, పిల్లలకు చివరకు పసికందులకు కనీస విలువ ఇవ్వకుండా, కొంచెమైనా కనికరం చూపకుండా కామతృప్తికొరకైన వస్తువులునగా వాడుటకు, దేవాలయాల్ని నాశనం చేయుటకు, చేలను పాడుచేసి రైతులను జంతువులనుగా పనిచేయించుటకు ఈ యుద్ధాలు జరుగలేదు మరియు ఈ యుద్ధాలు ఇరు సైన్యాల మధ్య జరిగేవి, రాజ్యాధికారం మారుతూ ఉండేది కాని సామాన్యుని ప్రాణానికి మానానికి ఇంటికి ఆస్తికి ముప్పువాటిల్లేదికాదు. దోపిడీలు ఊచకోతలు ఈ యుద్ధాలలో జరిగేవికాదు. కాబట్టి ఇస్లామిక్ దండయాత్రల పర్యవసానాలను భారతప్రజలు గ్రహింపలేకపోయారు. రాజు, ప్రజా తేడాలేకుండా ముస్లిం పాలకుల చేతుల్లో అందరూ విలవిలలాడారు. వీరి సమాజం, ఇస్లాం పాలకులయొక్క అధిక శిస్తులతో, శిక్షలతో చిన్నాభిన్నమైపోయింది. గత్యంతరంలేక కొందరు మతం మారారు, ఇంకొందరు అడవులకు, కొండలలోకి పారిపోయి బలహీనులై రోగాలతో, క్రూరమృగాలబారిన పడి తనువులు చాలించారు. ముస్లింలు, హిందూస్త్రీల భర్తలను వారి కళ్ళముందే చంపి, భర్తల నెత్తురు చల్లారకముందే వారి భార్యలతో బలవంతంగా శయనించేవారు. భారత సమాజాన్ని ఘోరంగా కీంచపరచి, సంస్కృతిని పాడుచేసి, తిరగబడినవారిని కిరాతకంగా చంపుతూ, అన్యాయంగా నేరారోపణలు చేస్తూ భారతావనిని దయనీయస్థితిలోకి చేర్చారు. అప్పుడప్పుడూ ముస్లిం రాజుల మధ్య జరిగే యుద్ధాల్లోను హిందువులే అధికంగా బలైయ్యేవారు, ఎందుకంటే హిందువులను ముందు  కవచంగా (battlefield front line) ఉపయోగించుకొనేవారు (ఖాన్ 205-207 పుటల్లో).   

భారతీయ బానిస వ్యాపారం-1

భారతదేశానికి ఎంతో ఉన్నతమైన, ప్రాచీన సాంస్కృతిక చరిత్ర ఉన్నది. క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితం హైందవమతం, క్రీ.పూ. 600 సంవత్సరాలక్రితం బౌద్ధమతం ప్రారంభమైయ్యాయి. భారతసంస్కృతి శాస్త్రాలలో, కళలలో, మతంలో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. భారతీయ విద్వాంసులు సైన్స్ లో, గణితంలో ఎంతో ప్రగతిని సాధించారు (సున్నా, భీజగణితం, రేఖాగణితం, దశాంశ విధానం మొదలగు అరబిక్ గణితావిష్కరణలు వాస్తవంగా "హిందూ ప్రజల ఆవిష్కరణలు! ఇవి ముమ్మాటికి భారతీయ విజ్ఞానుల విజ్ఞతే!). భారతీయ విద్వాంసులు ఈ గణిత విజ్ఞానాన్నే గాక, వైద్యశాస్త్రం, తర్కశాస్త్రంలోని అనేక ప్రావీణ్యతలను, ఉన్నత ప్రమాణాలను ఇతర రాజ్యములలోకి తీసుకువెళ్లిరి (ముస్లిం రాజ్యాలకు కూడా! ఉదా: బాగ్దాద్).

ఎక్కడెక్కడినుంచో ఇతరులు భారతీయ విశ్వవిద్యాలయాలలో చదువునభ్యసించుటకు వచ్చేవారు (నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అతిపురాతనమైనది). భారతీయ విద్యార్థులు విస్తారమైన అంశములలో, అనగా సైన్స్, గణితం, తర్కశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలగువాటిని అభ్యసించేవారు. భారతీయ కళలు, కట్టడాలు అద్భుతంగా ఉండేవి. భారతతీయులు పరిణతిచెందిన ప్రగతిశీలురైయుండిరి. ఇటువంటి సమయంలో క్రీ.శ. 7వ శతాబ్దంలో భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. వెంటనే భోగభాగ్యాలు పోయి, ఊచకోతలు, అత్యాచారాలు, హింస, దోపిడీలు, సాంస్కృతిక, హైదవ కట్టడాలను, పట్టణాలను, కళలను, క్షేత్రాలను వినాశనం చేయడం ఆరంభమైనది. కొన్నిచోట్ల వాటి స్థానంలోనే ఇస్లామిక్ కట్టడాలు వెలిసాయి. జనాలలో వైజ్ఞానిక తృష్ణ కుంచించుకుపోయింది, హింసాప్రవృత్తి, స్వార్థం పెరిగిపోయింది. హింస, కరువులు, దోపిడీలు, మానభంగాల భయంతో బలవన్మరణాలు, మతమార్పిడులు విస్తారంగా జరిగాయి. ఇస్లాం ప్రకారం ఏదైనా విషయం ఇస్లాంలో అపరిచితమైతే లేక ఇస్లామునకు పూర్వమైనదైతే అదివారికి మూఢమైన కాలానికి (అజ్ఞానాంధకార చరిత్రకి) చెందినదిగా (jahiliyya- time of ignorance) భావిస్తారు మరియు ఇస్లాం ప్రకారం దానిని నాశనం చేయాల్సిందే (ఉదా: ఆఫ్గాన్ లో హిందూ మరియు బౌద్ధ ఆలయాలు, విగ్రహాలు స్థూపాలు). ఒకవేళ అది విలువైనది, లాభకరమైనదైతే దానిని ఇస్లాం పరం చేసుకోవాల్సిందే (ఈజిప్ట్ పిరమిడ్లు- సందర్శకుల వలన చాలా లాభం!). ఈ నిరంతర ఊచకోత జనాల్ని అస్థిరులుగా, సంచారకులుగా (gypsies) చేసింది, హైందవ ఆఫ్గానిస్తాన్ని నాశనం గావించి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లను పుట్టించింది!             

Sunday 24 July 2011

"దేవుడున్నాడా?"- ఇంకొన్ని తర్కవాదాలు.

దేవుడున్నాడా? అనే శీర్షికతో దేవుని ఉనికిని తార్కికంగా, హేతుబద్ధంగా, శాస్త్రీయంగా నిరూపించడానికి కారణకార్యములు- విశ్వశాస్త్ర తర్కాన్ని 6 భాగాలలో వివరించాను. అయితే దేవుడున్నాడు అనడానికి సృష్టిలో సృజనాత్మక రూపక తర్కం (Teleological Argument) మరియు ఇంకొన్ని వాదనలనుకూడా ఈ బ్లాగులో వివరిస్తాను.

ఈ బ్లాగులో ఇంకా జీవపరిణామం evolution, పురావస్తుశాస్త్రం archaeology, జీవశాస్త్రం Life sciences, భౌతికశాస్త్రం physics, చరిత్ర history మొదలగు అంశాలపై విస్తృతమైన వ్యాసాలు, చదువుటకు అనుగుణంగా చిన్న చిన్న భాగాలుగా ప్రచురించాలని యోచిస్తున్నాను. 

దేవుడున్నాడా?-6

3. విశ్వం సృజింపబడిందా?

విశ్వానికి ఒక ఆరంభమైనా ఉండాలి లేక అది ఆదిసంభువైయుండాలి. మనకున్న అధారాలనుబట్టి విశ్వానికి ఒక పుట్టుక (ఆరంభం) ఉన్నది అని స్పష్టమవుతుంది. "ఆరంభం" అనేది ఒక కార్యం కాబట్టి దానికి ఒక కారణం ఉండాలి (Law of Cause and Effect). అంటే విశ్వాన్ని ఏదైనా లేక ఎవరైనా సృష్టించి ఉండాలి. కారణం లేక కర్త లేనిది ఏ కార్యం జరుగదు.

విశ్వం ఆదిసంభువు మరియు విశ్వం స్వీయోత్పత్తి గావించుకొన్నది అనే ప్రతిపాదనలు వ్యర్థమైనవని గత భాగాల్లో వివరించబడింది. ఇక మిగిలింది విశ్వం సృజింపబడుట అనే ప్రత్యామ్నాయం. కాబట్టి విశ్వం తనకంటే బలమైన ఒక శక్తిచే సృజింపబడినది.

ఇంకో విషయం ఏమిటంటే, ఒకప్పుడు అంతా శూన్యముంటే, ఇప్పుడూ ఇంకెప్పుడూ శూన్యమే ఉండాలి. సైన్స్ ప్రకారం శూన్యం శూన్యాన్నే ఇవ్వగలదు కాని పదార్థాన్ని కాదు. ఈ కారణంగా ఇప్పుడు పదార్థం (విశ్వం) ఉంది గనుక నిత్యత్వం కలిగిన, స్వయంభువైన రాశి లేక శక్తి ఉండియుండాలి. ఆ శక్తి సృజన గావించాలంటే జీవముగలదై లేక గలవాడైయుండాలి (Nothing produces nothing and something produces something; And that something which is capable of producing or creating ought to be superior and eternal).    

ఇప్పటివరకు గమనించిన విషయాలను పరిగణలోకి తీసుకొంటె, ఒక ఆస్తికుని వాదం ఇలా ఉంటుంది:
1) ఉనికి కలిగియున్న సర్వం పదార్థం మరియు సృజన శక్తి కలిగిన జీవమైయుండాలి.
2)ఇప్పుడు పదార్థ లేక వస్తువు ఉనికి ఉంది గనుక అనాదిగా ఉనికికలిగియున్నదేదైనా ఉండియుండాలి.
3)కాబట్టి పదార్థం లేక సృజన శక్తి అను రెంటిలో ఒకటి ఆదిసంభువైయుండాలి.
4)పదార్థం (విశ్వం) తననుతాను సృజించుకొనలేదు కాబట్టి అది ఆదిసంభువు కాదని మనము తెలుసుకొన్నాం.
5)కాబట్టి సృజన శక్తి కలిగినదే లేక కలిగినవాడే ఆదిసంభువు లేక నిత్యుడు.

ఆస్తికుడు కానటువంటి రాబర్ట్ జస్త్రో ఇలా అన్నాడు: "మనకున్న ఆధారలనుబట్టి విజ్ఞానానికందని ఒక అద్వితీయమైన శక్తి ఉన్నది అనునది సైన్స్ కూడా తప్పక చెప్పే సత్యం! (1982)."

దీనంతటినీ ఒక సామాన్యభాషలో చెప్పాలంటే:

ఉదాహరణకు, ఒకచోట కొన్ని సిమెంట్ బస్తాలు, ఇసుక, నీరు, ఇటుకలు, రాళ్ళు ఉన్నాయనుకోండి. తాపిపనివాడు లేకుండా వాటంతటవే ఒక నిర్మాణంగా రూపుదిద్దుకొంటాయా?
"రూపుదిద్దుకొంటాయి" అని మన పిల్లలను పంపే స్కూల్లలో గొప్ప scientific factsగా బోధించుచున్నారు! రూపుదిద్దుకొంటే దిద్దుకొన్నాయి, అసలు ఈ ముడి పదార్థాలు ఎక్కడివి? "అవీ వాటంతట అవే శూన్యం నుండి వచ్చాయి!"- ఇది మన సైన్స్!
సత్యమేదో మీరే గ్రహించండి. ఎందుకంటే సత్యం మనలను స్వంతంత్రులనుగా చేస్తుంది!

సత్యమేవ జయతే!!

NOTE: I'm not against science, but some 'madness' is proclaimed as science and an exhaustive propaganda campaign has been launched just out of resentment and anger against the idea of God! I absolutely uphold, accept, and follow true science, and true science always reflects true God which is unfortunately a buried and lost truth! 

------------------END------------------------

Saturday 23 July 2011

దేవుడున్నాడా?-5

యెస్లింగ్ వ్యాసాన్ని చదివి అనేకులు Skeptical Inquirer పత్రికకు ఉత్తరాలు వ్రాసారు. వాటికి యెస్లింగ్ సమాధానాలిచ్చారు. ఈ ఉత్తరప్రత్యుత్తరాల్ని 1995లో ఆ పత్రికలో ప్రచురించారు. యెస్లింగ్ ఒకచోట ఇలా వ్రాసారు: "సైన్స్ కూడా ఒక ఊహతోనే మొదలవుతుంది. మనం ఊహించిన ఆలోచన నిజమా కాదా అని నిర్ధారించుకోడానికి అనుభవపూర్వకమైన సాక్ష్యం కావాలి. నేటి వరకు మన కంటికి కనిపించే మరియు దృష్టికి అతీతంగా విశాలంగా ఉన్న విశ్వం శూన్యం లోనుండి జన్మించినట్లు కనీస సాక్షాధారాలు లేవు. కాబట్టి రాతిలో దేవుడున్నాడు అనేది ఎంత మూఢనమ్మకమో ఇదీ అంతేకాని ఏమాత్రం విజ్ఞానం కాదు (1995)".

యెస్లింగ్ చెప్పింది నేటి (2011) వరకు నిజమే. పదార్థం శూన్యంలో నుండి ఉత్పన్నమవడం అసాధ్యం. ఏ ప్రయోగశాలలోనూ ఇది నిరూపించబడలేదు, నిరూపించబడనేరదు కూడా! ఇది 1st & 2nd Law of Thermodynamicsకి పూర్తి విరుద్ధమైన సిద్ధాంతం.  

ఏదైనా విషయం గమనించబడగలిగి తిరిగి రూపొందించగలిగినదైతే అది నికార్సైన విజ్ఞామవుతుంది. అంతేగాని ఏదో ఊహించి దాన్ని రుజువుచేయకుండానే ప్రామాణికంగా పరిగణించి దానిని అబివృద్ధి చేస్తే అది ఎంత బావున్నా విజ్ఞానం కానేరదు. ప్రయోగాత్మకంగా నిరూపించబడగలిగినదే సైన్స్.

సుప్రసిద్ధ ఖగోళ-భౌతిక శాస్త్రవేత్తైన స్టీఫెన్ హాకింగ్ ఇలా అన్నాడు: విశ్వం తనంతటతాను శూన్యంలోనుండి ఉత్పత్తిగావించుకొన్నది అని చెప్పే The new inflationary model విఫలమైనది. ఇది వైజ్ఞానికంగా తాత్వికంగా నిజంకాదు. అయినా ఇదే నిజమనే భ్రమలో కొందరు ఇంకా దీనిపై వ్యాసాలు వ్రాస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు.  

దేవుడున్నాడా?-4

2. విశ్వం శూన్యంలోనుండి తననుతాను సృష్టించుకుందా?

విశ్వం స్వయంసృష్టి చేసుకుంది అని చెప్పే శాస్త్రఙులు ఇంతకుమునుపు లేరు. భౌతికశాస్త్రవేత్తైన జార్జ్ డేవీస్, "మనకున్న పరిజ్ఞానాన్నిబట్టి ఏ పదార్థం స్వయంసృష్టి చేసుకోజాలదు అనే విషయం స్పష్టమగుచున్నది" (1958) అని చెప్పారు. కాబట్టి విశ్వం సృష్టింపబడినదేకాని సృష్టికర్త కాదు.

అయినప్పటికీ, ఆశ్చర్యకరంగా కొందరు విఙానులు మరియు తత్వవేత్తలు విశ్వం స్వయంసృజన చేసుకోగలదనే వాదనను బలపర్చడానికి ముందుకొచ్చారు. ఉదాహరణకు, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో భౌతికశాస్త్రంలో ప్రొఫెస్సరైన Edward, P. Tryonగారు,"భౌతికశాస్త్ర నియమాలకు లోబడి విశ్వం స్వయంసృష్టి గావించుకుంది అని నేను 1973లో ప్రకటించాను. అయితే ఇది జనానికి ప్రకృతివిరుద్ధమైన, విస్మయకరమైన ప్రకటనగా తోచింది (1984). అయితే మే 1984లో "సైంటిఫిక్ అమెరికన్" అనే వైఙానిక పత్రికలో ప్రచురించిన "The Inflationary Universe"అనే వ్యాసం అనేకులు విశ్వం స్వయముత్పత్తి గావించుకొన్నది అని ఒప్పుకొనుటకు దోహదపడింది. జీవపరిణామవాదులైన (Evolutionists) అలెన్ గుత్ మరియు పాల్ స్టైన్-హర్డ్ ఇలా వ్రాసారు:



"చారిత్రిక నేపధ్యంలో సంచలనాత్మకమైన విషయం ఏమిటంటే విశ్వం ఒక నిగూఢమైన, అతిసూక్ష్మమైన మర్మ ప్రదేశంలోని శూన్యం నుండి ఒక్కసారిగా దానికదే స్వీయోత్పత్తి చెంది కాంతికంటే వేగంగా శూన్యంలోకి విస్తరించుటనారంభించింది. విశ్వావిర్భవానికి ఇంతకంటే మెరుగైన వైజ్ఞానిక వివరణలేదు (1984)." 


అయితే ట్రైయాన్, గుత్, స్టైన్-హర్డ్ మరియు ఇంకొందరి ఇలాంటి ప్రకటనలు, వైజ్ఞానిక రచనలు సైంటిఫిక్ కమ్యూనిటీలో వివాదాస్పదమైన చర్చకు దారితీసాయి. ప్రముఖ సైన్స్ పత్రికలలో, వేదికలపై విశ్వం స్వీయోత్పత్తి చేసుకొందనే దృక్పథానికి బాగా ప్రాచుర్యం కల్పించారు. కొందరు ఈ సిద్ధాంతాన్ని బలంగా వ్యతిరేకించారు. ఉదాహరణకు, 1994 సమ్మర్ ఎడిషన్ Skeptical Enquirerలో బ్రిటీషువాడైన రాల్ఫ్ యెస్లింగ్ విశ్వం యొక్క స్వీయోత్పత్తి అనే అంశాన్ని విమర్శిస్తూ ఇలా చురకలంటించాడు: 

"సైంటిస్టులు సైన్స్ మాట్లాడితే బాగుంటుంది. కాని కొందరు భూతం ఆవహించినట్లు ఒక్కసారిగా అపారజ్ఞానసంపన్నులైన తత్వవేత్తలుగా మారి గొప్పమర్మాన్ని ఛేదించినట్లు ఒక చౌకబారు సిద్ధాంతాన్ని లేక విషయాన్ని ప్రకటించి దాన్ని నికార్సైన విజ్ఞానమంటారు. గుడ్డెద్దు చేలో పడినట్లు వీరు అనాలోచితంగా స్వార్థంతో వారి సిద్ధాంతానికి విపరీతమైన ప్రాచుర్యం కల్పిస్తారు. తానా అంటే తందానా అన్నట్లు, కాస్మాలజిస్ట్లు, క్వాంటం థియరిస్ట్లు ఈ సిద్ధాంతాలకి తమదైన ధోరణిలో మసాలా జోడించి, ఈ వ్యర్థసిద్ధాంతాలకి ఇంకా బలం చేకూరుస్తారు. శూన్యలోనుండి పదార్థోత్పత్తి వైజ్ఞానికంగా అసంభవమనే విషయం మరుగైపోతుంది. అసలు ఈ కాస్మాలజిస్టకి, క్వాంటం థీరిస్ట్లకి సైన్స్ తో ఏంపని? ప్రతిపాదనలై అధారపడి వారి పనిని కొనసాగించేవీరు, అసలు ఆ ప్రతిపాదన అంగీకారయోగ్యమైనదా లేదా అని గమనించలేనత బుద్ధిమాంద్యంతో ఉన్నారా? (1994)"     



Wednesday 20 July 2011

దేవుడున్నాడా?-3

1. విశ్వం ఆద్యంతరహితమైనదా?  (విశ్వం స్వయంభువా?)

దేవుడు లేడని వాదించే నాస్తికుడికి "విశ్వం ఆద్యంతరహితమైనది" అనే దృక్పదం కలిగి ఉండటం ఇష్టం, ఎందుకంటే విశ్వానికి ఆరంభం-ముగింపు అనే ప్రస్తావనే లేదు కాబట్టి ఎవరు ఆరంభించారనే ప్రశ్నే తలెత్తదు. దేవుడులేడని చెప్పడానికే జీవపరిణామవాదులైన (evolutionists) Thomas Gold, Hermann Bondi, మరియు Fred Hoyle అనువారు Steady State Theoryని అబివృద్ధి చేసిరి. విశ్వం రోజు రోజుకి వ్యాప్తి చెందుతొంది. దీనికి కారణం విశ్వ విశాలంలో irtrons అనే కేంద్రాలలో శూన్యములోనుండి బయటకు వస్తున్న హైడ్రోజన్ అణువులు విస్తరించడం వలననే అని ఈ శాస్త్రఙులు ప్రతిపాదించిరి. ఈ హైడ్రోజన్ అణువులు ప్రాథమిక మేఘాలుగా మారి అందులో నూతన పాలపుంతలు, నక్షత్రాలు రూపుదిద్దుకొంటాయని Dr. Hoyle ప్రతిపాదించారు. 

అయితే ఈ Steady State Theory, శక్తిని నూతనంగా సృష్తించడం లేక నాశనంచేయడం అసంభవం అని సూచించే First law of Thermodynamicsకి విరుద్ధంగా ఉండటంతో చాలా వరకు విఫలమైనది. ఖగోలశాస్త్రఙుడైన Robert Jastrow పరిశీలించినదేమనగా:

"పదార్థాన్ని శక్తిగా లేక శక్తిని పదార్థంగా మార్చవచ్చుగాని, శూన్యం నుండి పదార్థాన్ని సృష్టించడం అసాధ్యం. విశ్వంలో ఉన్న పదార్థం మరియు శక్తి ఎప్పటికి స్థిరం. ఈ నియమాన్ని పాటించని ఏ సిద్ధాంతాన్ని ఒప్పుకొనలేము."

కాబట్టి చరిత్రలో Steady State Theory పనికిరాని చెత్తలా అయ్యింది. అయినప్పటికీ ఎదో ప్రత్యామ్నాయం దొరక్కపోతుందా అని, విశ్వం నిత్యమైనది అని భావించేవారికి అది 2nd Law of Thermodynamicsకి కూడా విరుద్ధమే అగుటవలన ఇంకా సమస్యలు పెరిగాయి. 2nd Law ప్రకారం శక్తిని ఖర్చుచేసినప్పుడు లేక వాడినప్పుడు అది వాడుటకు వీలులేని స్థితిలోకి మారుతుంది. వాస్తవానికి విశ్వం విస్తరించడం క్షీణించుతోంది, ఎందుకంటే శక్తి ఖర్చవడం వలన, విస్తరించడానికి కావల్సిన శక్తి తగ్గిపోతూ ఉంది. అంటే విశ్వం విస్తరించే వేగం నానాటికీ తగ్గిపోతూంది. మున్ముందు ఇక విస్తరించడం ఆగిపోవొచ్చు (శక్తి అంతా ఖర్చైపోతుంది కాబట్టి).

ఇప్పుడున్న ఆధారాలను బట్టి విశ్వం నిత్యమైనది అనటం సమంజసంకాదు. విశ్వానికి తప్పకుండా ఒక ప్రారంభ గడియ ఉన్నది అని Jastrow అభిప్రాయం. ఇది సరైన అభిప్రాయమే! ఎందుకంటే నిత్యత్వంగలవి క్షీణించుకుపోవు, కాని విశ్వం క్షీణిస్తోంది. Henry Morisగారన్నట్లు, 2nd Law of Thermodynamics ప్రకారం విశ్వానికి ఒక ఆరంభం తప్పక ఉన్నది, అంతేకాని శాస్తవేత్తల ప్రతిపాదనైన- విశ్వం నిత్యత్వం గలది- అనునది ఆ విజ్ఞాన శాస్త్రం ప్రకారమే తప్పు!   

Monday 18 July 2011

దేవుడున్నాడా?-2

కారణకార్యములు- విశ్వశాస్త్ర తర్కం

ఈ విశ్వం, అనగా మనము ఉన్న ఈ లోకం, జీవరాశి, అనంత ఆకాశం మనముందున్నవి. ఇవి ఏలాగు సంభవించినవో తెలుసుకోవాలి- మానవ చరిత్రలో అనాదిగానున్న తర్కమిది. R. C. Sproul తన NOT A CHANCE అనే పుస్తకంలో ఇట్లు విశదపరచారు.
"కారణం లేకుండా ఏదీ సంభవించదు కాబట్టి దేవుడున్నాడు అనేది సాంప్రదాయ ఆస్తిక వాదన. అనగా, ఈ విశ్వం సంభవించినది కాబట్టి సంభవింపజేసినవాడు ఉండాలి, అతడే కర్త లేక దేవుడైయున్నాడు. శూన్యము గాక ఎదోఒకటి ఉన్నది గనుక దానికి సరైన సమాధానం కర్తయే అనునది సాంప్రదాయ వాదం."

విశ్వం యొక్క ఉనికి సత్యం- విశ్వం ఉనికి కలిగి ఉండటమేకాదు అది బ్రహ్మండమైన వైవిధ్యంతో కూడికొనియున్నదని నాస్తికులు, ప్రత్యక్షవాదులు అంగీకరిస్తారు. ఒక పదార్థం తన అస్తిత్వాన్ని వివరింపలేక పోయిన యెడల అది అనిశ్చితమైన పదార్థంగా పరిగణించబడును. కాబట్టి విశ్వం కూడా ఒక అనిశ్చితమైన పదార్థమే- ఎందుకంటే అది తనని తాను సృష్టించుకోలేదు లేక దాని అస్తిత్వానికి సరైన కారణములను సూచింపలేదు. (NOTE: Big Bang Theory is just a theory which does not have any experimental proof yet. It is an assumption and is not any better or superior idea than a mere belief. Desperate attempts made by so-called scientists to prove Big Bang Theory have been utter failures). తన ఉనికిని నిర్వచింపలేని పదార్థం సంభవించడానికి కారణం తప్పక ఉండాలి. కాబట్టి ఈ విశ్వం సంభవించిన కార్యమునకు కారణం ఏమిటి లేక ఎవరు అనేది మనముందున్న ప్రశ్న!

దీని మూలంగానే కారణకార్య సింద్ధాంతం (Law of Cause and Effect) విశ్వశాస్త్ర తర్కంతో ముడిపడియున్నది. ఒక పదార్థం సంభవించుటకు మునుపు దాని అస్తిత్వం ఏర్పడుటకు ఒక కారణం ఉంటుంది అనేది Law of Cause and Effect. ఇంతకుమునుపు Law of Excluded Middle ఏలాగు రూఢియైయున్నదో ఇదీ ఆలాగే సత్యమైయున్నది. ఉదాహరణకు, ఒక ప్రాచీన కోట ఉన్నదనుకోండి. అది మనము గమనించగలిగిన విషయం కనుక దానిని కట్టినవానిని చూడకపోయినను ఉండెనని కోట ఉనికినిబట్టి రూఢిగా మనకు తెలుసు. అంతేకాని కోట మరేదో రీతిగా సంభవించింది అని అనుకోము. Sproul దీనిని గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు.

"కారణము, కార్యము రెండూ వేరైనప్పటికీ తార్కిక విశ్లేషణలో ఇవి విడదీయజాలనివి. ఒక త్రిభుజానికి మూడు కోణాలున్నట్లు, లేక బ్రహ్మచారి అంటే పెండ్లి కానివాడు అను వాక్యములు ఎంత సత్యమో, కార్యమునకు కారణము అంతే సత్యం. అకారణముగా కార్యము సంభవించుట లేక కార్యము దాల్చలేని కారణముండుట అనునవి నిరర్థకమైనవి, ఏ తర్కానికి సరిపోనివి. కార్యము సంభవించుటకు కారణమవశ్యము మరియు కారణముంటే కార్యము తప్పక జరుగును!

సరిపడని కారణం లేకుండా సంభవించిన కార్యములు లేవు. అలాగే కారణమనునది కార్యము తరువాత వచ్చుట అసంబద్ధం. కార్యము కారణముకంటే ఎన్నడును శ్రేష్ఠమైనది కాదు. కారణకార్య సిద్ధాంతమునకు (Law of cause and effect) ఈ ప్రమాణాలు అవశ్యం. ఉదాహరణకు, కప్ప గెంతటం వల్ల నది బురదమయం కాదు; ఈగ వాలడం వలన పుస్తకం టేబుల్ పైనుండి కిందపడిపోదు- ఇవి సరైన కారణాలు కాదు. కాబట్టి ఒక కార్యమునకు సరియైన కారణము తెలుసుకోవాలి. ఇది మన ప్రశ్నను పునరావృత్తం చేస్తోంది- ఈ విశ్వం సంభవించుటకు కారణమేమిటి లేక ఎవరు?

దీనికి మూడు సమాధానాలు సాధ్యముగానున్నవి. 1) విశ్వం నిత్యమైనది లేక ఆద్యంతరహితమైనది; దాని ఉనికి ఎన్నటినుంచో ఉండెను, ఇకను ఎన్నటికీ ఉండును. 2) విశ్వం నిత్యమైనది కాదు; అది తననుతానే శూన్యమునుండి సృష్టించుకొన్నది. 3) విశ్వం నిత్యమైనది కాదు మరియు తనని తాను శూన్యమునుండి సృష్టించుకోలేదు; కానీ, దానికి బాహ్యంగానున్న, దానికంటే శ్రేష్ఠమైన దానిచే (లేక వానిచే) సృజింపబడినది. తప్పకుండా ఈ మూడింట్లో ఏదో ఒకటి మన సమాధానమైయున్నది. వీటిని జాగ్రత్తగా పరిశీలిద్దాం.

దేవుడున్నాడా?-1

"దేవుడున్నాడా?"- అనేకుల మనసులో మెదులుతున్న ప్రశ్న ఇది. తర్క శాస్త్రం ప్రకారం ఎదైనా విషయం విశ్లేషనాత్మకంగా వివరింపబడితే దానిని అంగీకరించవచ్చు.  ఈ తర్క శాస్త్రంలో Law of Excluded Middle ఏమి చెబుతుందంటే- ఒక వస్తువు ఒకే సమయంలో ఒక గుణం కలిగి మరియు అదే గుణం లేకుండా వుండజాలదు.  ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదనలకు అన్వయించినపుడు, ఎదైన ప్రతిపాదన నిజం లేక అబద్ధం అవునుగాని ఒకే సమయంలో ఒకే రీతిగా అది రెండూ (నిజం మరియు అబద్ధం) కానేరదు.

"దేవుడున్నాడు" అనే వాక్యం ఒక కచ్చితమైన ప్రతిపాదన కాబట్టి ఇది సత్యం లేక అసత్యం అయ్యుండాలి కాని రెండూ కానేరదు. దేవుడున్నాడు లేక లేడు- ఈ రెండిటిలో ఒకటే నిజం, రెండు పరిణామాలు సాధ్యం కాదు, మధ్యేమార్గం లేదు! నాస్తికుడేమో దేవుడు లేడని కుండబద్దలు కొట్టినట్లు చెబుతాడు; ఆస్తికుడు దేవుడున్నాడని అంతే రూఢిగా చెబుతాడు; ప్రత్యక్షవాదేమో (agnostic) దేవుడున్నాడని రుజువు చేయడానికి సరైన లేక సరిపోయినన్ని ఆధారాల్లేవు అంటాడు; చార్వాకుడేమో (skeptic) దేవుడున్నాడని రుజువు చేయడం అసాధ్యం అంటాడు. ఎవరిని నమ్మాలి? ఏది నిజం? దేవుడున్నాడా లేడా? 

ఈ ప్రశ్నకు సమాధానం- మనం అధారాలను పరిశీలించాల్సిందే. దేవుడున్నట్లైతే, ఆయన ఉనికికి సంబంధించిన అధారాల్ని మనకు అందుబాటులో కచ్చితంగా ఉంచివుండాలి. అటువంటి ఆధారం ఒక్కటైనా వుందా? వుంటే అసలు అదేమిటి? దాని స్వభావమేమిటి? 

ఆస్తికుడు, దేవుడున్నాడు అనడానికి బలమైన అధారాలున్నాయి అని వాదిస్తాడు. దేవుని ఉనికిని గూర్చి ఎటువంటి సందేహం లేదని చెబుతాడు. అయితే, ఒక సంచిలో ఒక కిలో కూరగాయలున్నాయి అని కొలిచి లేక గుండెలో నాలుగు గదులున్నాయి అని శాస్త్రీయంగా ఎలా రుజువు చేయగలమో అలా దేవుడున్నాడని రుజువు చేయడం సాధ్యమేనా? ఇది సాధ్యం కాక పోవచ్చేమో1 ఎందుకంటే కూరగాయల బరువు, గుండెలో గదులు వంటివి మన పంచేద్రియాల ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగిన విషయాలు. అయితే ఒక విషయాన్ని అనుభవపూర్వకంగా రుజువు చేయడం నిస్సందేహంగా సరైనా విధానం కాని ఇదొక్కటే మార్గం మాత్రం కాదు. ఉదాహరణకు, ఒక విషయానికి రుజువుగా న్యాయవిభాగంలో ప్రాథమిక సాక్షాన్ని (prima facie) పరిగణలోకి తీసుకొంటారు. కాబట్టి ఒక ఆస్తికుడు కూడా దేవుడున్నాడనడానికి ప్రాథమిక అధారాలను (prima facie case) రుజువుగా తెలుపుచున్నాడు. అయితే వీటితో ఏకిభవించకపోతే దానికి తగిన వాదాన్ని నాస్తికులు లేక వ్యతిరేకులు వినిపించాలి. ఇక్కడ ఈ ఆస్తిక వాదం మీముందుచబడును. దానిని పరిశీలించి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు.