Pages

Subscribe:

Saturday 13 August 2011

ఫిత్నా- ద మూవీ





courtesy: http://www.geertwilders.nl/index.php?option=com_frontpage&Itemid=1
 
నెథర్‌ల్యాండ్స్ పార్టీ ఫర్ ఫ్రీడం అధ్యక్షుడైన Geert Wilders ఇస్లాం మతంపై తాను తీసిన మిని డాక్యుమెంటరీ మూవీ ఫిత్నా (Fitna) ముస్లిం మనోభావాలను దెబ్బతీసిందని మరియు ఇది విద్వేషంతో కూడినదని (Hate Speech) కేసు బుక్‌చేసి విచారిస్తున్నారు. Fitnaలో Wilders చూపించిన సన్నివేశాలు మరియు వాక్యాలన్ని ఇస్లామిక్ గ్రంథాలైన ఖురాన్, హడీస్, సీరాల నుండి తీసుకొన్నవే! అప్పుడది Hate Speech ఎలా అవుతుంది? Wilders కూడా తెలివిగా తన కోర్టు విచారణలో సాక్షులుగా ముస్లిం విద్వాంసులని (Muslim Scholars), ముల్లాలని, ముఫ్టీలని ఆహ్వానించాడు. Fitnaలో ఉన్న విషయాలు వారు కాదనలేరు. సాక్షులను విచారించకుండానే చేసేది లేక Geert Wilders Trialని డిస్మిస్ చేసారు. మళ్ళీ Wildersను కోర్టు బోనెక్కించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Geert Wilders- ఇస్లామిక్ అణచివేతను వాక్‌స్వతంత్రంతో (Free Speech) ఎదుర్కొంటున్న ఒక మానవతావాది, స్వేచ్ఛని సమాధానాన్ని కోరుకొనే నిజమైన చాంపియన్! Geert Wilders తీసిన "ఫిత్నా"ని ఇక్కడ చూడండి. 

(Full screenలో చూడండి- వీడియోలో ఖురాన్, హడీస్ నుంచి సేకరించిన వాక్యాలను చదవండి)

 

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-4

మక్కా నుండి తరిమివేయబడటంతో మహమ్మద్‌కు గర్వభంగమయ్యింది. "అల్లాహ్‌చే ఎన్నుకోబడ్డ ప్రవక్త" అనే ఆధిక్యత జనాల దృష్టిలో ప్రశ్నార్థకమయ్యింది. కాబట్టి మహమ్మద్ ప్రతీకారంతో రగిలిపోయాడు. అందుకే అతను మదీనాలో ఉన్నప్పుడు అల్లాహ్‌చే అందుకొన్న సందేశం (2వ సురా) ప్రతీకార అయతులతో (వాక్యాలతో) నిండిపోయింది. మక్కావారు తమను పట్టణం నుంచి బహిష్కరించి తిరిగి రాకుండా నిలువరించడమే చిత్రహింస అని "హింస"కు కొత్త నిర్వచనం చెప్పాడు మహమ్మద్. ఈ "చిత్రహింస"కు ప్రతిగా మక్కావారిపై దండెత్తాలని అల్లాహ్ ఆజ్ఞ అంటూ తన అనుచరులైన ముసల్మాన్లను ప్రేరేపించాడు. మహమ్మద్ ఉద్దేశమేమిటంటే మక్కావారు తమను హింసించినందుకు వారిపై యుద్ధం చేయడం, తమతో పోల్చుకొంటే ఒక విధంగా వారిని తక్కువగా శిక్షించినట్లే! మక్కానుండి వెలివేయబడ్డందుకు (చిత్రహింస) మక్కావారిపై దండెత్తి వారిని చంపేయాలనడం సబబేనా? (ఖురాన్ 2: 193- ఊచకోత కంటే "చిత్రహింస" భరింపజాలనిది).       

కాని మక్కావారు మహమ్మద్‌ను తరిమేయడం ముమ్మాటికి సరైన పనే. ఎందుకంటే మహమ్మద్ తన అనుచరులైన ముసల్మాన్లతో కలిసి ఆయుధాలు సమకూర్చుకొని మక్కావారిపై బహిరంగంగా తిరిగుబాటు వ్యూహాలు పన్నాడు. తమపై కక్ష్యగట్టి భౌతిక దాడులకు బెదిరించేవారికి ఏ నగరవాసులూ ఆశ్రయమివ్వరు. (అయినప్పటికీ, కొద్దికాలం తరువాత మక్కావారు తెలివితక్కువగా మహమ్మద్‌తో సంధి చేసుకొని అతనిని మక్కాలోనికి అనుమతించారు. కొద్దికాలంలోనే మక్కా మహమ్మద్ పాదాక్రాంతమయ్యింది. వారి ఆచారాలు, విశ్వాసాలు అన్నీ నిర్దాక్షిణ్యంగా తుడిచివేయబడ్డాయి).

మక్కావారు మహమ్మద్‌ను బహిష్కరించడానికి ఇంకో కారణమేమిటంటే, సర్వమతాలకు పూజాపీఠమైన మక్కాలోని కాబాను మహమ్మద్ మతమైన ఇస్లాంకు అప్పగించి కేవలం ఇస్లాం మాత్రమే అక్కడుండాలని మహమ్మద్ మొండిగా వాదించడం. ఇస్లాంలో పరమతసహనం పూర్తిగా కొరవడింది కాబట్టి మక్కావారు మహమ్మద్‌ను బహీష్కరించారు. ముస్లింలు కాబాచుట్టూ తిరగడానికి మక్కావారికి ఏం అభ్యంతరంలేదు కాని, ముస్లింలకు మాత్రం ఇతరులెవరు అక్కడ ప్రదిక్షణాలు చేయరాదని చెప్పేవారు. క్రీ.శ.630 లో మక్కాను కైవసం చేసుకొన్నాక వారన్న మాటలు అక్షరాల నిజం చేసారు- మక్కావారందరు ఇస్లాంలోకి మారాలి లేక చావాలి అని అవకాశమిచ్చి కాబాలోని అన్నీ విగ్రహాలని ధ్యంసం చేసారు. (ఖురాన్: సురా 9:18-19).   


ఇప్పుడు 2వ సురాలోని అయతుల్ని పరిశీలిద్దాం:

"......వారు ఎక్కడ దొరికుతే అక్కడ చంపేయండి, వారు మిమ్మల్ని ఏచోట్ల నుండి తరిమివేసితిరో అచ్చటనుండి వారినీ తరిమివేయుడి, ఎందుకంటే చంపడంకంటే చిత్రహింస ఇంకా కఠినమైనది. శాంతికరమైన ప్రార్థనా స్థలాలవద్ద వారితో పోరాడకండి కాని ఒకవేళ వారు మీపై దాడి చేస్తే అప్పుడు వారిని (అక్కడే) చంపండి. ఇదే అవిశ్వాసులకు తగిన బహుమానం. వారు మనలను హింసింపకుండునట్లు అంతమగువరకు పోరాడుడి, సంపూర్ణంగా అల్లాహ్ యొక్క మతం స్థాపింపబడువరకు పోరాడుడి!" (సురా 2:191-193).    

ఈ అయతులను చూపించి ముస్లింలు కేవలం ఆత్మరక్షణ కోసమే మహమ్మద్ పోరాడేవాడు అని వివరిస్తారు కాని చారిత్రిక సందర్భాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. నిజానికి ఈ వాక్యభాగం ముస్లింల ధౌర్జన్యాన్ని మరియు ఇస్లాం యొక్క బలవంతపు వ్యాప్తిని సమర్థించుకోడానికి వ్రాయబడినట్లు గ్రహించగలము.

మక్కావారు ముస్లింలపై దాడులు చేయలేదు. నేడు ముస్లింలు ఆరోపిస్తున్నట్లు అనాడు మక్కావారు ముస్లింలను చంపలేదు. ఇందుకు ఖురానే సాక్ష్యం- తరిమివేయబడటాన్ని చిత్రహింసగా మహమ్మద్ పేర్కొన్నాడు కాని మక్కావారు ముసల్మాలని చంపినట్లు పేర్కొనలేదు. పైపెచ్చు తాను చేయబోయే మారణకాండను సమర్థించుకోడానికి మక్కావారికి మేలు చేస్తున్నట్లు చిత్రహింసకంటే (తరిమివేయబడటానికంటే) చంపడం నయమని మక్కావారిని చంపులాగున ముసల్మాన్లను ప్రేరేపించాడు. (ఖురాన్‌లోని పై అయతుల్ని జాగ్రత్తగా చదవండి).

ఇంకో విషయం ఏంటంటే, మహమ్మద్ అన్నట్లు "చిత్రహింస (బహీష్కరింపబడుట) కంటే వధ మేలు" అనుకొంటే ఆత్మరక్షణకై పోరాడే మహమ్మద్ వారికి అదే చిత్రహింసను (బహిష్కరణను) శిక్షగా విధించాలని పై అయతుల్లో ఎందుకన్నట్లు? ఇది ప్రతీకారేచ్చ కాదా? మక్కావారు ముస్లింలను చిత్రహింసలు చేసి చంపారు అనే ఆరోపణల్లో సత్యముంటే వారు మొట్టమొదట మహమ్మద్‌నే చంపేవారు. వారికి నీతివుంది కాబట్టి బహిష్కరణతో సరిపెట్టారు. మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ ప్రాణాలు తీయడానికి తిరుగుబాటు చేసి అల్లర్లురేపుతున్న మహమ్మద్‌ను బహిష్కరించడం దయతో కూడుకొన్న న్యాయవిధా? లేక ప్రతీకారంతో మక్కా కారవాన్లపై దాడులు చేసి చంపి దోచుకోవడం  దయతో కూడిన పనా?        

Friday 12 August 2011

ఇది రమదాన్! దేశమేదైనా పాటించకపోతే....పగిలిపోద్ది

టర్కీష్ జాతీయుడైన ఒక జర్మన్ M.P. రమదాన్ మాసంలో సాసేజ్ ఆర్డర్ చేస్తే...... ఎమయ్యిందో మీరే ఇక్కడ చదవండి! 

Thursday 11 August 2011

4.9 కోట్ల మంది హిందువుల ఆచూకీ?

బంగ్లాదేశ్‌లో 1949 నుండి సుమారు 4.9 కోట్ల హిందువుల అదృశ్యం గురించి మాట్లాడుతూ నియర్ ఈస్ట్ మరియు సౌత్ సెంట్రల్ ఆసియాలో మానవ హక్కులు మరియు మత స్వేచ్ఛకై హెచ్.ఆర్. 440 బిల్లును సమర్థిస్తున్న రిప్రసెంటెటివ్ డోల్డ్. బంగ్లాదేశ్‌లోని హిందువులపై దాడులు మరియు వారి బలవంతపు వలసలు, ఇరాక్‌లోని మిషాబా ప్రాంత క్రైస్తవులపై కఠిన ఆంక్షలు మరియు ఇరాన్‌లో బహాయ్ మతస్తుల నిర్బంధాలను ఖండిస్తూ ఇవి భరింపలేని హింసలని అమెరికన్ పార్లమెంట్ సభ్యుడైన డోల్డ్ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులను నివారించడానికి  హెచ్.ఆర్. 440 బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు.

ఎన్నో శాంతి సందేశాలిచ్చే ముస్లిం సమర్థకులు, ముల్లాలు ఇస్లామిక్ దేశాల్లో మైనారిటీ మతస్తులపై జరిగే ఆకృత్యాలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇస్లాం శాంతికరమైన మతమైతే వారి దేశాల్లోని మైనారిటీలు ఇళ్ళు, ఆస్తులు వదిలేసి ఎందుకు పారిపోతారో ముస్లిం అపాలజిస్ట్లు, ముల్లాలు సమాధానం చెప్పాలి. ఎటూ పారిపోలేనివారు అంత దీనావస్థలో ఎందుకుంటారో చెప్పాలి. ముస్లిం చట్టాల్లో ముస్లిమేతరులపై వివక్ష ఎందుకుంటుందో చెప్పాలి.


 

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-3

మొదట రక్తం చిందించింది మక్కావారే కాబట్టి వారినుండి రక్షించుకోడానికి మహమ్మద్ పోరాడాడు అని ముస్లింలు, ముల్లాలు సమర్థించుకొంటారు. అయితే ఇది ఎంతవరకు నిజమో చరిత్రను పరిశీలిద్దాం.

ఒకసారి ముసల్మాన్లు ప్రార్థనలు చేసుకొనుచుండగా ఒక అన్యమతస్తుడు వారికి అంతరాయం కలిగిస్తున్నాడనే నెపంతో సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ అనే ముస్లిం నాయకుడు అతన్ని ఒంటె దవడయముకతో కొట్టి చంపాడు. ఇస్లాం పరిరక్షణకై మొట్టమదటి హత్య ఇదే (ఇబ్న్ ఇషాక్/హిషాం:166). 

కొత్తగా ఇస్లాం మతం పుచ్చుకొన్నవారికి మతం పేరుతో ఎవరినన్నా హింసించినా తప్పించుకోవచ్చనుకొనేవారు. ఒకసారి అబూ జహ్ల్ (విగ్రహారాధికుడు) అనే మక్కా పెద్ద మహమ్మద్‌ను కించపరుస్తూ మాట్లాడాడనే నెపంతో హంజా అనే ఒక బలమైన ముస్లిం అతనిని తన విల్లుతో బలంగా కొట్టాడు. అబూ జహ్ల్ బలహీనుడగుటచే ఏమీచేయలేక ఇంటికి వెళ్లి తన దగ్గర పనిచేస్తున్న ముస్లిం సేవకులని ప్రతీకారంతో హింసించాడు. ఈ విధంగా ముస్లింలు జరిగించే హింసకు ప్రతిహింస కూడా పెరిగిపోయింది (ఇబ్న్ ఇషాక్/హిషాం:185).

తగినంత సంఖ్యా బలం పొందుకొన్నాక, ముస్లింలు మక్కావారిపై మొట్టమొదట యుద్ధం ప్రకటించారు. అయితే ఈ యుద్ధంలో ముస్లింలు ఓడిపోయి మక్కా నుండి తరిమివేయబడ్డారు. ముస్లింలు అక్కడనుండి మదీనాకు వలసపోయి స్థిరపడ్డారు. అయినా మహమ్మద్ తన ఓటమిని జీర్ణించుకోలేక మక్కావారి కారావాన్లపై తెగబడి దాడులు చేసి వారిని చంపుతూ దోపుడు సొమ్ము కొల్లగొట్టేవాడు. 

****************
మదీనాలో నివసించేటప్పుడు కూడా మక్కావారు ముస్లింలను హింసించేవారు అని ముస్లింలు మాటిమాటికి ఆరోపిస్తారు. ఇందులో ఎంతవరకు సత్యముందో పరిశీలిద్దాం: 

మహమ్మద్ తన అనుచరులతో మదీనాకు వలసవెళ్లాక (హిజ్రా) కొద్దికాలానికి అతనికి అల్లాహ్ గాబ్రియేలు దూత ద్వారా ఇచ్చిన సందేశమే ఖురాన్‌లోని రెండవ అధ్యాయం (2వ సురా). ఈ అధ్యాయంలో హింసాత్మక వచనాలు అధికంగా ఉంటాయి (ఎందుకో అర్థం చేసుకోవచ్చు- మహమ్మద్ మక్కానుంచి తరిమివేయబడ్డాడు కాబట్టి!). 2వ సురాలో ఉన్న రెచ్చగొట్టే విషయాలను కప్పిపుచ్చుకోడానికి లేక సమర్థించుకోడానికి ముస్లిం మత సమర్థకులు (muslim apologists) మదీనాలో కూడా ముస్లింలను మక్కావారు హింసించారని ఆరోపిస్తారు. 2వ అధ్యాయంలోని వచనాలు అవిశ్వాసులైన పాగన్లు, విగ్రహారాధికులు, క్రైస్తవులు మరియు యూదులు ముస్లింలపై చేసిన అక్రమాలకి, దౌర్జన్యాలకి మరియు హింసకు ప్రతిగా వారిని తుదముట్టించుటకు ప్రేరేపిస్తాయి.  వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి ముస్లిం విద్వాంసులు అనాడు మదీనాలోని ముస్లింలపై అనేక దాడులు జరిగి చిత్రహింసలనుభవించారని వివరిస్తారు.  

దురదృష్టమేంటంటే మహమ్మద్ "చిత్రహింస" అని దేనిగురించి అన్నాడో ముస్లిం చరిత్రకారుల వివరణలను ఇంతకుముందే చూసాము. నేడు "హింస" అంటే భౌతికంగా, మానసికంగా సరైన కారణం లేకుండా గాయపర్చడం. మహమ్మద్ ప్రకారం "చిత్రహింస" అంటే ఆయన చెప్పింది అనుసరించకపోవడం, అతను రెచ్చగొడుతున్న మతవిద్వేషాలకు హెచ్చరించడం, యుద్ధం ప్రకటిస్తే అతనిని ఓడించి సంహరించకుండా, భౌతికంగా గాయపరచకుండా మక్కా నుంచి బహిష్కరించడం. ఈ "చిత్ర హింస"లకు ప్రతిగా అవిశ్వాసులను (కాఫీర్లను) సంహరించడం సరైన న్యాయం అని మహమ్మద్‌కు అల్లాహ్ సందేశమిచ్చాడు. (మహమ్మద్ మక్కావారి చిత్రహింసలు తాలలేక తనను తన అనుచరులను రక్షించుకోడానికి మాత్రమే కత్తి పట్టాడు- ఇది ముస్లిం సమర్థకుల వాదన). నిజానికి గమనించినట్లైతే, మక్కావారు మహమ్మద్ దాడులనుంచి తమనుతాము కాపాడుకోడానికి ప్రయత్నించారు. వారికి ఇస్లాం ఒక మతంగా మక్కాలోని కాబాలో ఉండడానికి, వారి మతప్రచారం చేసుకోడానికి ఎటువంటి అభ్యంతరం లేకపోయెను కాని కాబాలో కేవలం ఇస్లామే ఉండాలి, అన్యమతాలు వ్యర్థం అని దూషణలకు దిగినప్పుడు మాత్రమే వారు అభ్యతరం తెలిపారు.

మహమ్మద్ 2వ సురా ప్రకటించినప్పుడు వారిపై దాడులు జరిగినట్లు ఏ చరిత్రకారుడూ తెలుపలేదు. వారిపై సైన్యాలు దండెత్తి రావడం కాని లేక అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లుగాని ఎటువంటి అధారాలు లేవు. మదీనాపై మక్కావారి ప్రభావం ఎంతమాత్రము లేకుండెను. ముస్లింలు ఆరోపించినట్లు ఆనాడు వారిపై మదీనాలో ఎటువంటి హింసా లేక దాడి జరుగలేదు. "సీరా (biography)"లో వివరింపబడిన ప్రకారం తమపై యుద్ధం ప్రకటించి బహీష్కరణకు గురైన మహమ్మద్‌నకు హాని చేసే ఉద్దేశం మక్కావారికి ఎంతమాత్రం లేదు. 

అసలు ముస్లింలపై నిరంతరం దాడులు జరిగినట్లైతే వారిని పదే పదే యుద్ధానికి ప్రేరేపించాల్సిన అవసరం ఎందుకు? ఉదాహరణకు, ఎవరైనా మీ ఇంట్లోకి చొరబడి మీ కుటుంబసభ్యులపై దాడిచేస్తుంటే మీ కుటుబాన్ని, మిమ్మల్ని మీరు రక్షించుకోడానికి అల్లాహ్ నుంచి ప్రేరణకై నిరీక్షిస్తారా? కాని మహమ్మద్ మాత్రం తన ముస్లిం తెగను అల్లాహ్ పేరుతో కాఫీర్లు ఒక్కడు కూడా మిగలకుండా చచ్చువరకు సంహరించాలని తెగ విస్తారంగా ప్రేరేపించాడు. ఇదంతా కూడా మక్కా నుంచి బహీష్కరింపబడినందుకు ప్రతీకారచర్య కాదా?, యుద్ధకాంక్ష అసలే కాదా? ఇది ఆత్మరక్షణ కోసమేనా? ఎవరినుంచి ఆత్మరక్షణ?  
 

Wednesday 10 August 2011

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-2

అప్పట్లో మక్కావాసులు ఎంతో సహనశీలురైయుండిరి. మక్కా యొక్క ఆర్థిక సామాజిక ప్రగతి అక్కడికి వచ్చే యాత్రీకులపై అధారపడి ఉన్నప్పటికీ, ఆ యాత్రీకులను, మక్కావారిని అపహాస్యం చేస్తూ, వారి విశ్వాసాల్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ మహమ్మద్ 13 సంవత్సరాలు తన కొత్తమతమైన ఇస్లాంని ప్రకటించసాగాడు. దీనినిబట్టి మక్కావారు ఎంత ఓర్పుతో వ్యవహరించారో స్పష్టంగా తెలుస్తుంది.

మొదట్లో మహమ్మద్ మాటల్ని ఆయన స్నేహితులు మరియు కుటుంబసభ్యులు మాత్రమే అంగీకరించారు. పదమూడేండ్ల మతప్రచారం తరువాత మహమ్మద్ సంపాదించుకొన్న అనుచరగణం కేవలం ఒక వందమంది. వీరు ముసల్మాలనబడిరి. మహమ్మద్ భార్య (ఆమె పరివారం మరియు పనివారు) కాకుండా ఇస్లాంని స్వీకరించిన మొట్టమొదటి  వ్యక్తి అలీ (ఇతను మహమ్మద్‌కు అల్లుడవుతాడు మరియు తరువాత నాల్గవ ఖలీఫాగా ఎంచబడతాడు). ఇస్లాంను స్వీకరించిన ఇంకో ముఖ్యమైన వ్యక్తి ధనవంతుడైన అబు బాకర్ అనే వర్తకుడు. ఇతని పుణ్యమాని ముస్లిం తెగ ప్రభలింది.   

మహమ్మద్, అల్లాహ్‌తోపాటు మక్కావారి దేవుళ్ళను కూడా అంగీకరించే"సైతాను సందేశం"(Satanic Verses) అనే సంఘటన తరువాత జరిగిన కొన్ని పరిణామాలాతో మహమ్మద్‌కు మక్కావారితో సంబంధాలు చెడాయి. (సైతాను సందేశం Satanic Verses అనగా- మహమ్మద్ తమ దేవతాదేవుళ్ళను అంగీకరించాడని తెలిసి మక్కావారు సంతోషించి మహమ్మద్‌ను ఆదరించిరి. దీవివల్ల మహమ్మద్ అనుచరులు ఆయన చెప్పిన మాటల విశ్వసనీయతను ప్రశ్నించిరి. తనవారు తనపై నమ్మకం కోల్పోతున్నారని మహమ్మద్ గ్రహించి తనతో ఆ మాటలు, అనగా పాగన్లతో, ఇతరమతస్తులతో కలిసుండాలనే మాటలు సైతాను ప్రేరేపించి చెప్పించాడని వారికి సంజాయిషీ ఇచ్చి మళ్లీ మక్కావారి మతాల్ని, ఆచారాల్ని ద్వేషించడం మొదలుపెట్టాడు- తబారీ:1192; ఖురాన్ 22:52; 53:19-26; అంటే మహమ్మద్ సైతానుచే ప్రేరేపింపబడి పరమతసహనం గురించి మాట్లాడుటను Satanic Verses అందురు).    

ఈ పరిణామంతో నివ్వేరపోయిన మక్కావారు ఇంతకుమునుపుకంటె కోపోద్రికులై ముస్లింలను ఇంకెక్కువగా అవమానించారు. మక్కావారు చేసిన ఈ అవమానాలనే ముస్లింలు "భయంకరమైన చిత్రహింసలు"గా పేర్కొంటారు. అయితే ఈ "చిత్రహింసల"ను గురించి ముస్లిం చరిత్రకారులైన ఇబ్న్ ఇషాక్ మరియు అల్ తబారీ వ్రాసిన వివరాలలో కేవలం ఒక్క ముస్లిం చనిపోయినట్లుగా ఉంది. అది కూడా ఒక వృద్ధ మహిళ- ఈమె ముస్లింలకు జరుగుతున్న అవమానాలకు, అశాంతికి కలతచెంది మనోవేదనతో మృతిచెందింది (ఎవరూ భౌతికంగా గాయపరిచి చంపలేదు).    

ముస్లింమత ఆధునిక పరిరక్షకులకు (modern apologists) ఇది మింగుడుపడని విషయం. ఎందుకంటే వీరు ఎంతసేపూ మక్కావారు చిత్రహింసలకు గురిచేయబట్టే మహమ్మద్ వీరిపై దాడులు చేసాడు అని పదే పదే వాదించి తెలియనివారిని నమ్మించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. అయితే సత్యమేంటో ముస్లిం చరిత్రకారులు వ్రాసిన చరిత్రపాఠాలను చూసి గ్రహించవచ్చు.  

{మక్కావారే మొదట కత్తిదూసారు అనేది పచ్చి అబద్ధం. ఇది ముస్లిం ప్రచారం (muslim propaganda). చెప్పాలంటే మహమ్మద్ అసలు ఏ కారణం లేకుండానే దాడిచేసిన సందర్భాలున్నాయి. వీటి గురించి తదుపరి టపాలో వివరిస్తాను.}  

Sunday 7 August 2011

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-1

ముస్లిం చరిత్రకారులు వివరించిన ప్రకారం మక్కావాసులకు మహమ్మద్ ఇస్లాం అనే కొత్తమతాన్ని పాటించడం మరియు బోధించడం వలన ఎటువంటు అభ్యంతరం కలుగలేదు. ఎప్పుడైతే మహమ్మద్ తాను మాత్రమే దేవుడైన అల్లాహ్‌చే మానవాళికి పంపబడిన నిజమైన ఆఖరి ప్రవక్తగా ప్రకటించుకొనుచూ, ఇతర మతాలను, వారి విశ్వాసాలను కించపరుస్తూ, వారి పూర్వీకులను దూషించడం, అవహేళన చేయడం మొదలుపెట్టాడో అప్పుడు మక్కా ప్రజలు అభ్యంతరపడి మహమ్మద్‌ను మందలించారు (ఇబ్న్ ఇషాక్: 167). మక్కాలోని పెద్దలు వారి ఆచారాలపై మహమ్మద్ చేస్తున్న తీవ్రమైన ఆరోపణలు, దూషణలు విని కోపోద్రికులై మహమ్మద్‌కు ఆయన పూర్వస్థితిని గుర్తుచేస్తూ గద్దించి, హేళనచేసి పిచ్చివాగుడుగా కొట్టిపారేసారు. ఎందుకంటే ఆయన స్థితికి, దేవుని ప్రవక్త అని ఇంకా ఆయన చెప్పుకొంటున్న అనేక ప్రగల్భాలకి అసలు పొంతనలేకుండా పోయింది.

"మక్కావాసులు మహమ్మద్‌ను మానసికంగా, శారీరికంగా చిత్రహింసలు పెట్టి అనేకమార్లు చంపడానికి ప్రయత్నించడం వల్లే ఆయన అక్కడనుండి మదీనాకు పారిపోయాడు" అని ముస్లింలు మహమ్మద్ మక్కావాసులు మరియు వర్తకులు ప్రయాణించేటపుడు జరిగించిన హింసాత్మక దోపిడీలు మరియు హత్యలను సమర్థించడానికి పదే పదే వక్కానించి చెబుతారు. కాని అసలు మక్కాలో మహమ్మద్ ఎంత చిత్రహింసకు గురైయ్యాడో ముస్లిం మత గ్రంథాలనుండి ముస్లిం చరిత్రకారుల వివరణల నుండి నిజం తెలుసుకొందాం: 

ముస్లిం చరిత్రకారుల ప్రకారం మక్కావాసులు మహమ్మద్ ప్రచారంచేస్తున్న ఇస్లాం అనే నూతనమతం విషయమే ఎంతో సహనంతో వ్యవహరించారు. స్వతహగా, అనేక మతాల యాత్రికులకు కేంద్రబిందువైన మక్కా ఎంతో సహనం కలిగిన ప్రాంతంగా అనాడు ప్రసిద్ధిచెందిది. క్రైస్తవులు, యూదులు, బహుదేవతారాధికులు ఇలా అనేకులు తమతమ పవిత్ర మాసాల్లో "కాబా"లో పూజలుచేయడానికి సుదూరప్రాంతాలనుండి మక్కాకి వచ్చేవారు. వీరందరు ఎంతో పరమతసహనంతో పక్కపక్కనే వారివారి ప్రార్థనలు చేసుకొనేవారు. స్థానికంగ ఉండేవారు కూడా వీరికి మంచి ఆతిథ్యమిచ్చేవారు. ఎందుకంటే యాత్రీకుల వల్ల మక్కాలో బాగా వ్యాపారం జరిగేది. ఇది వర్తకులకి కూడా ప్రథాన కేంద్రంగా ఉండేది.   

మహమ్మద్ తన కొత్తమతాన్ని 13 సంవత్సరాలపాటు ఎంత ప్రచారంచేసినా కనీసం పదుల సంఖ్యలోనైనా అందులో చేరకపోవడంతో అసహనంతో ఇతరమతాలవారిని తీవ్రపదజాలంతో దూషిస్తూ అవమానకరమైన వ్యాఖ్యలు చేసేవాడు. దీవివల్ల స్థానికులకి, ప్రయాణీకులకి అందరికి విసుగుకలిగి కోపోద్రికులై అతన్ని అదుపు చేయడానికి మందలించేవారు.
"మహమ్మద్ అల్లాహ్ తనకు కనబర్చిన ఇస్లాం గురించి ప్రచారంచేసినప్పుడు మక్కావారెవరూ ఇతనిని వ్యతిరేకించలేదుకాని వారి దేవతాదేవుళ్ళను కించపరుస్తూ మాట్లాడినపుడు అతని మాటలు ఎవరూ వినకుండా కొందరు ఎదురుతిరిగిరి. మక్కావాసులు కొందరు ఇతనిని తమ శత్రువుగా ఎంచుకొనిరి" (ఇబ్న్ ఇషాక్/హిషాం: 167).      

మహమ్మద్‌కు సమస్యలు సృష్టించవద్దని గట్టిగా చెప్పినప్పటికీ ఖాతరుచేయకుండా తన ఊరివారైన మక్కావాసులతో వ్యాజ్యాలు పెట్టుకొంటూ వారి మతాలని కించపరుస్తూ వారిని రెచ్చగొట్టి జగడాలు రేపేవాడు. 
"ఇతను (మహమ్మద్) సృష్టిస్తున్న సమస్యలు ఇంతవరకు మేమెన్నడునూ చూడలేదని మక్కావారు అనిరి. అతడు వారి జీవనవిధానం మూర్ఖమైనదనియు, వారి అచారాలు వ్యర్థమనియు, వారి పితరులను అవమానిస్తూ, సమాజంలో ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు కలుగజేస్తూ శాపనార్థాలు పెడుతూ, వారి దేవుళ్ళను కించపర్చుచుండెను" (ఇబ్న్ ఇషాక్/హిషాం: 183).

అయినప్పటికీ మక్కావారు ఇతనిపై కఠిన చర్యలు తీసుకోకుండా అప్పుడప్పుడూ హెచ్చరించి వదిలేసేవారు. ఎందుకంటే అక్కడ శాంతికి భంగం కలిగితే యాత్రికులు రావడం తగ్గి వ్యాపారాలు దెబ్బతింటాయని వారు ఆలోచించేవారు. చివరికి మహమ్మద్‌ను నిలువరించడానికి అప్పుడప్పుడూ అతనికి డబ్బు కూడా ఇచ్చేవారు.
"వారు మహమ్మద్‌తొ చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి అతనిని పిలువనంపిరి. అతడు వచ్చాక- నీకు డబ్బు కావాలని ఈ గొడవలు చేస్తుంటే నిన్ను మాలో అందరికంటే ధనవంతుడిని చేస్తాం, నీకు గొప్పవాడివి కావాలనుంటే రాకుమారునిలాగా నిన్ను గౌరవిస్తాం, ఒకవేళ అధికారం కావాలంటే మాపై రాజుగా చేస్తాం. అంతేగాని ఇలా మక్కాలో శాంతికి భంగం కలిగించకు. ఇంతవరకు నీలా మా పితరులని ఎవరూ దూషించలేదు మరియు మా విశ్వాసాల్ని అవమానించలేదు. నీకేంకావాలో చెప్పు అని అతనిని వేడుకొన్నారు" (ఇబ్న్ ఇషాక్/హిషాం: 188).   



మక్కావాసులు ఇతర మతాలతో పాటు ఇస్లాం మతం మక్కాలో ఉంటే తమకు సమస్యేమీ లేదన్నట్లుగానే వ్యవహరించారు. అయితే మహమ్మద్ యొక్క తీవ్ర పదజాలం, ఇతర మతాల సంపూర్ణనిర్మూలన అనే ఉద్దేశాలవలనే వారు ఇబ్బంది పడ్డారు. ఇస్లాంతో వారికి వైరమేమీ లేదనడానికి మరో అధారం "సైతాను వాక్యాలు" (లేక "సైతాను సందేశం' Satanic Verses)లో కనబడుతుంది. చరిత్రకారుల ప్రకారం, మక్కావాసుల విన్నపాలని, హెచ్చరికలని మహమ్మద్ కొంతకాలం వరకు (తాత్కాలికంగా) తలొగ్గి ఇతరమతాలవారి హక్కులను అంగీకరించి వారిని కించపరచడం మానేసాడు.    
"ఇది విని మక్కావాసులు సంతోషించారు. తమ దేవతాదేవుళ్ళ గురించి అతనన్న (మహమ్మద్) మాటలు వారికి సంతోషం కలిగించి అతడు చెప్పే విషయాలను కూడా విన్నారు. మహమ్మద్ మోకాళ్ళూని ఖురాన్ అధ్యాయము వల్లించి బోధించిన విష్యములయందు ముస్లింలు విశ్వాముంచి మహమ్మద్‌ను వెంబడించిరి. అక్కడకు వచ్చిన ఖురేషువారైన ముష్కరులు (అన్యమతస్తులు) కూడా మోకాళ్ళూనిరి. ఎందుకనగా మహమ్మద్ వారి దేవుళ్ళను గూర్చి అనుకూలంగా మాట్లాడనారంభించెను. ఆ మసీదంతటిలో మోకాళ్ళూనని ముస్లింగాని కాఫీర్‌గాని (అన్యమతస్తుడు గాని) ఒక్కడు కూడా లేడు. అనగా అందరూ మోకాళ్ళూనారు" (అల్ తబారి- తారిఖ్: మొదటి భాగం).    

మత విద్వేషాలు వైతొలగినందుకు మక్కావాసులు ఎంతో సంతోషించారు. వారు ముస్లింలతో పాటు కాబాలో కలిసి ప్రార్థనలు చేయుచూ నెమ్మది కలిగి సంతోషముగా జీవించసాగారు. మహమ్మద్ వారి విశ్వాసాల్ని గౌరవించినందుకు వారు ముస్లింలను గౌరవించి కాబాలో స్థానం కల్పించి అంగీకరించారు.  

అయితే దురదృష్తవశాత్తూ ఈ శాంతిసమాధానాలు, సహోదరాభావం ఎంతోకాలం నిలువలేదు. ఎందుకంటే మహమ్మద్‌ను వెంబడిస్తున్న ముసల్మాన్లు అతని పూర్వ బోధకి మరియు అతడే నిజమైన దేవుని ప్రవక్త అని ప్రకటించినదానికి ఇప్పుడు పరమతసహనమైన మాటలకి ఎటువంటి పొంతనా లేదు, ఇవి రెండూ పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి అని ప్రశ్నించారు. వారిని శాంతింపజేయడానికి మహమ్మద్ మళ్లీ ఇతరమతాల్ని దూషించడం మొదలుపెట్టాడు. ఇలా మహమ్మద్ ప్లేటు పిరాయించడంతో మక్కావాసులకి మునుపటికంటే ఎక్కువ కోపం వచ్చి తీవ్ర అసహనానికి లోనయ్యారు.        

Saturday 6 August 2011

మహమ్మద్ జీవితం: మక్కాలో తొలినాళ్ళు

మహమ్మద్ క్రీ.శ. 570 లో ఒక విధవరాలికి జన్మించాడు. తన 6వ యేటనే తల్లిని కోల్పోయాడు. మహమ్మద్ అక్కడి తెగల పెద్దలు మరియు వ్యాపారస్తుల దయాదాక్షిణ్యాలపై అనగా వారు పెట్టింది తింటూ, సమాజంపై ఆధారపడుతూ పేదరికంలో పెరిగాడు. అయన తన చిన్నాన్న అబూ తాలిబ్ దగ్గర ఒంటెల కాపరిగా పనిచేసేవాడు. అబూ తాలిబ్‌కు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానమున్నప్పటికీ మహమ్మద్ మాత్రం తన 25వ యేట వరకు అనామకుడిగానే పెరిగాడు. తన 25వ యేట తనకంటె 15 యేండ్లు పెద్దదైన ఖదీజా అనే ఒక ధనవంతురాలైన విధవరాలిని వివాహం చేసుకొన్నాక మహమ్మద్ దిశ తిరిగింది.  

తన భార్య యొక్క క్రయవిక్రయ వ్యాపారం పుణ్యమాని మహమ్మద్‌లో స్వతహగానేవున్న ఇతరులను ఒప్పించగలిగే తెలివితేటలు ఇంకా మెరుగైయ్యాయి. అంతే కాకుండా ఆమె వ్యాపారాలావాదేవిల నిమిత్తం మహమ్మద్ చేసిన అనేక ప్రయాణాలు కొత్త కొత్త సంగతులు, వివిధ జనాల ఆచారవ్యవహారాలు తెలుసుకొనుటకు వీలు కలిగింది.తను ఇలా ప్రయాణాలు చేసి క్రైస్తవ్యం మరియు యూదా మతాల గురించి సంపాదించిన మిడిమిడి జ్ఞానాన్ని తరువాతి కాలంలో అల్లాహ్ తనకు నేరుగా గాబ్రియేలు దూత ద్వారా ఇచ్చిన "పవిత్ర" సందేశంలో తెలుపబడిన విషయాలుగా చేర్చుతాడు. 



ఖదీజా ద్వారా సంక్రమించిన ఐశ్వర్యం మరియు సుఖమయమైన జీవితం మహమ్మద్‌కు ఎంతో ఖాళీ సమయాన్నిచ్చింది. కాలక్షేపం కోసం ఏం చేయాలో తోచక అప్పుడప్పుడూ రోజులు తరబడి ధ్యానం మరియు ప్రార్థనలంటూ తనకు కావల్సిన ఆహార సామాగ్రిని తీసుకొని వెళ్లిపోయేవాడు. ఒకరోజు తన 40వ యేట గాబ్రియేలు దూత తనను దర్శించాడని మహమ్మద్ తన భార్యకు చెబుతాడు. అలా మొదలైన దర్శన సందేశాలు తను మరణించేంతవరకు అనగా సుమారు 23 యేండ్లు కొనసాగాయి. అల్లాహ్ గాబ్రియేలు ద్వారా మహమ్మద్‌కు మానవాళి శ్రేయస్సు కొరకు ఇచ్చిన ఈ సందేశాల సమాహారమే ఖురాన్. ఈ సందేశాలకు సాక్షి మహమ్మద్ తప్ప ఇంకెవరూ లేరు. మహమ్మద్‌తో పాటు ఉన్నవారు ఆయన జీవితంలో చేసిన కార్యములను వివరముగా తెలుపుచూ రచించిన సంకలనమే "హడీస్". అలాగే "సిరా" అనే రచన మహమ్మద్ జీవితచరిత్రను తెలుపుతుంది. "షరియా" చట్టానికి మూలమైన "సున్నాహ్" మహమ్మద్ వలే ఉత్తమ మార్గంలో ఎలా జీవించాలో తెలిపే గ్రంథం.

మహమ్మద్ తన భార్య ప్రోత్సాహంతో ప్రభావితుడై, తాను కూడా అబ్రహాము, మోషే, యేసు వలే అదే క్రమానికి చెందిన దేవుని ప్రవక్తగా స్వయంగా ప్రకటించుకొని తనకు అల్లాహ్ ఇచ్చిన సందేశాలపై స్థాపించిన ఇస్లాంలోకి ఇతరులను మార్చుటకునారంభించాడు. తన మాటలు వింటున్నవారికి ఖురాన్ అల్లాహ్ ద్వారా తనకు తెలుపబడిన సందేశమని బోధించేవాడు. ఇందులో వింతైన విషయం ఏమిటంటే, మహమ్మద్ యొక్క ఇహలోక కోరికలనన్నిటినీ ముస్లింలు అంగీకరిస్తారనే విషయాన్ని అల్లాహ్ ముందే ఊహించి తన సందేశాన్ని మహమ్మద్ ద్వారా ప్రజలకిచ్చాడు. ఎందుకంటే, ఖురాన్‌లో సుమారు 20 చోట్ల మహమ్మద్ ఏంచేసినా (మహమ్మద్ ఏలాగు నైతికవిలువలులేని జుగుప్సాకరమైన క్రియలు చేస్తాడు కనుక) దానికి అందరూ విధేయులుగానుండాలని అదేశించబడినది. ఎంత ముందు జాగ్రత్త!

మొదట్లో సమాజంలోని పెద్దలను, ఇతరమతస్తులని నొప్పించకుండా ఉండటానికి వారికి అనుకూలమైన అనేక అంశాలను జోడించి తన కొత్త మతాన్ని 300కు పైగావున్న కాబాలోని విగ్రహాల ప్రతిరూపంగా అల్లాహ్‌ను గూర్చి బోధించేవాడు. యూదుల మరియు క్రైస్తవుల విషయాలకి తోడు అన్య మతాల మిశ్రమ సందేశాలు కొందరికి బాగానే అనిపించాయి. అంతేగాక దేవదూత ప్రతక్షత ద్వారా అల్లాహ్ ఇచ్చిన సందేశమని పదే పదే చెబుతూ తన ప్రాముఖ్యతను కూడా కాపాడుకోగలిగాడు. మహమ్మద్ బైబిల్లోని
నేక విషయాలను తన మిడి మిడి జ్ఞానంతో మార్చి చెప్పినప్పుడు కొందరు అభ్యంతపడగా: "దేవుడైన అల్లాహ్ ప్రవక్తను వ్యతిరేకిస్తారా? దేవుడు తప్పు ఎలా చెబుతాడు?" అని అసహనంతో దబాయించేవాడు.

ఈ విధంగా మహమ్మద్ తనకు సంఖ్యాబలం లేనందువల్ల ఇతరులను కలుపుకోడానికి మెత్తని మాటలు చెబుతూ మక్కాలో చాలాకాలం గడిపాడు.    

Friday 5 August 2011

ఇస్లాం- పుట్టుపూర్వోత్తరాలు-2

రెండవ భాగం

అరేబియన్లకు, వారున్న కఠినపరిస్థితుల్లో వారి స్వంత అవసరాలు తీర్చుకొవడమే నైతికత అనిపించేది. కొద్దోగొప్పో కేవలం వారి వారి తెగ(గుంపు) వరకే ఒకరికొకరు తప్పనిసరి విధిగా సహాయంచేసుకొనేవారు. బహుశా వారున్న ఆ ప్రాంతపు కఠోర వాతావరణం మరియు బాహ్యప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకపోవడం వారిని అంత కఠినులుగా, స్వార్థపరులనుగా చేసుండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఇతరుల పట్ల ఇస్లాం మతస్తుల దృక్పథం ఎలా ఉంటుందో అర్థంచేసుకోవడానికి ఈ ప్రాథమిక అంశాలు ఎంతో తోడ్పడతాయి. అందుకే వీరి యొక్క నైతిక విలువలు, న్యాయ సూత్రాలు ముస్లింలకు ప్రయోజనకరంగా ఉండేటట్లు రూపొందించబడ్డాయి. అంటే వీరు చిన్న తెగల నుండి ప్రపంచముతో, తోటి మనుషులతో సంబంధంలేని ఒక పెద్ద తెగగా (ఇస్లాం మతస్తులు) ఏర్పడ్డారు. కాబట్టి వారి పూర్వికుల్లాగే కేవలం వీరి స్వార్థం చూసుకొంటారు (హడీస్ మరియు ఖురాన్‌ల్లోని అనేక భాగాల్లో అన్యులతో వ్యవహారం ఎంత వివక్షతో కూడి ఉంటుందో చూడగలము. రాబోయే టపాల్లో రెఫరెన్సులతో సహా వివరిస్తాను). 

అరేబియాలో, ముఖ్యంగా మహమ్మద్ జన్మించిన మక్కా వంటి వ్యాపార ప్రాధాన్య కేంద్రాల్లో అనేక మతాలు, ఆచారాలు ఉండేవి. వివిధ మతాల యాత్రికులను ఆకర్షించడానికి వారి మతసంబంధమైన ఘనాకారంలో "కాబా" అనే నిర్మాణాలు కొన్ని పట్టణాల్లో ఉండేవి. మక్కాలోని కాబాలో అనేక
దేవతాదేవుళ్ళ ప్రతిమలు ఉండేవి. ఇప్పటికీ ఒక నల్లని ఉల్క రాయి మెక్కాలోని కాబాలో ఉన్నది.  

ఈ నల్లని ఉల్క రాతితో పాటు మహమ్మద్ యొక్క ఖురేషీ తెగవారు "అల్లాహ్" అనే ఒక చంద్ర (నెలవంక) దేవుణ్ణి మొక్కేవారు. ఇంకా అనేక దేవతాదేవుళ్ళకు మక్కాలో ప్రాధాన్యం ఉండేది. మక్కావాసులు సర్వమత సహనశీలురిగా ఉండేవారు. సుదూర ప్రాంతాలనుండి వివిధ మతవిశ్వాసులు మక్కాకు వచ్చి వారి ప్రార్థనలను, పూజలను చేసుకొనేవారు (మహమ్మద్ మక్కాను స్వాధీనపర్చుకొన్నాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది).

ఈ వివిధ మతాచారాలనుండి మరియు మహమ్మద్ క్రైస్తవ్యంలోని మరియు యూదా మతంలోని (తప్పుగా) అర్థంచేసుకొన్న అంశాలనుండి పుట్టిన మతమే ఇస్లాం (మహమ్మద్‌కు తాను విన్న, గమనించిన సిరియా, అరేబియా చుట్టు పక్కల వ్యాప్తిచెందిన బైబిల్‌కు భిన్నమైన, కలుషితమైన క్రైస్తవ్యం గురించిన జ్ఞానం ఖురాన్లో స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకు, యేసు తల్లియైన మరియా మరియు యేసుకంటే సుమారు 1400 సంవత్సరాల పూర్వమున్న మోషే సోదరియైన మిర్యాము ఒకరే అని మహమ్మద్ అనుకొన్నాడు. అంటే మొహమ్మద్‌కు వీరు ఒకేతరం వారు కాదు అన్న ఇంగితం కూడా లేదు. ఈ విషయాలన్నీ స్వయానే దేవుడైన (?) అల్లాహ్ మహమ్మద్‌కు గాబ్రియేలు దూత ద్వారా తెలిపాడు. పాపం దేవుడైన (?) అల్లాహ్‌కి కూడా వీరు సమకాలీనులు కారు అనే విషయం అర్థం కాలేదు- ఇంకా ఇట్లాంటి తప్పులు ఖురాన్లో కోకొల్లలు!). 

ఇస్లాం- పుట్టుపూర్వోత్తరాలు-1

మొదటి భాగం

మహమ్మద్‌ను, ఆయన ఆలోచనా దోరణిని అర్థం చేసుకోవాలంటె ఇస్లాంని, అది ఆవిర్భవించిన అరబ్బు సమాజ స్థితిగతులను, అప్పటి మరియు అక్కడి కఠినమైన పరిస్థితులను గూర్చి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మహమ్మద్ (క్రీ.శ.570) కాలంలో అరేబియా ద్వీపకల్పం ఎందుకూ పనికిరాని బీడుభూమి (ఎడారి)గా ఉండేది. భగభగ మండుచున్న సూర్యుడితో భరింపశక్యంకాని మండుటెండతో పగళ్ళు, యముకలు కొరికె చలితో రాత్రులు- నివసించడానికి చాలా ప్రతికూలమైన వాతావరణం కలిగి ఉండేది. ఒక్క పచ్చని మొక్క మొలిచేది కాదు. సంచారజాతుల అరేబియన్ తెగలు రాళ్ళ మధ్యలో, మారుతున్న ఇసుకతిన్నెల్లో గుడారాలు వేసుకొని నివసించేవారు.   

రోము ఆధీనంలోవున్న యూరోప్ మరియు మధ్య ప్రాశ్చంలోని అనేక ప్రాంతాలు, చక్కని రహదార్లు, నీటిపారుదల వ్యవస్థ, తాగునీటి వసతులు కలిగిన మరియు ధార్మిక, సాంస్కృతిక, శాస్త్రియ పరిణతి కలిగి, కళలు, సంగీతంతో విలసిల్లుతున్న బైజాంటియన్ సామ్రాజ్యంలోకి కలపబడుచుండగా, మరోపక్క మనుగడకోసం, తమ తెగల ఆధిపత్యం కోసం నిరంతరం ఒకరితో ఒకరు పోరాడుచు చుట్టున్న ప్రపంచంతో సంబంధం లేకుండా అర్థాయుష్కులుగా ప్రాణాలు విడుస్తూ అరేబియన్ల జీవితం సాగుతూండేది.        

ఇటువంటి కఠినమైన గడ్డుపరిస్థితుల్లో నుంచి ఇస్లాం పుట్టింది కాబట్టి, వారికి తెలియని (మరియు మనసుకు, దేహానికి ఆనందాన్ని, ఊరటని ఇచ్చే) సంగీతం, కళలు మరియు కొన్ని ఆటలు నిషిద్ధమైనవిగా పేర్కొనబడ్డాయి అని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఈ నిషేదాన్ని ఇప్పటికీ తాలిబాన్లు అమలుపరుస్తున్నారు (ఉల్లంఘించినవారికి శిక్షేమిటో వివరించనక్కర్లేదనుకొంటా! -ఇక్కడ మరియు ఇక్కడ చూడండి). ఇస్లాం ప్రకారం దానికి బాహ్యమైన జ్ఞానాన్వేషణను సమ్మతించదు. అందుకేనేమో ఒరియానా ఫల్లసి తాను రచించిన The Rage and the Pride అనే పుస్తకంలో ఇస్లాం గురించి రాస్తూ, "ఈ మతం (ఇస్లాం) మతాన్ని (ఇస్లాంని) తప్ప మరేది ఉత్పత్తి చేయలేదు." 

అరేబియన్ ద్వీపకల్పం యొక్క ప్రతికూల వాతావరణం వలన దీనిపై ఏ సామ్రాజ్యానికి ఆసక్తి కలుగలేదు. కాబట్టి అభివృద్ధిచెందిన అనాటి  ఇతర సంస్కృతుల ప్రభావం వీరిపై పడలేదు. పర్షియన్ల పుణ్యమాని తీరప్రాంతాలపై వీరి ప్రభావం వలన అరేబియన్లు లిపి కలిగిన అరబిక్‌భాషను నెమ్మదిగా అభివృద్ధి చేసుకొన్నారు. మేకలు, గొఱ్ఱెలకోసం అరేబియన్ ఎడారిపై దండయాత్రచేయడం వ్యర్థమని ఏ సైన్యం కూడా వీరిపైకి రాలేదు. కాబట్టి ఈ ప్రదేశం ప్రపంచంనుండి తెగిపోయినట్లుగా ఉండేది. గ్రీకుల తర్కంతో, భారతీయ గణిత మేధస్సుతో ప్రపంచమంతటిని తాకిన జ్ఞానోదయ ప్రభావం అరేబియన్ ప్రదేశంపై ఇసుమంతైనా పడలేదు. ఎందుకంటె వీరు అనుదినం విపత్కర వాతావరణంతోను, ఇతర తెగలతోను పోరాటాల్లో మునిగిపోయారు. 

Thursday 4 August 2011

మహమ్మద్ జీవితం: ఒక చేదు నిజం

ముఖ్య ఘట్టాలు
   క్రీ.శ. 570- మక్కాలో జననం (అప్పటికే తండ్రి చనిపోయాడు)
           576 - తల్లి కూడా మరణించడంతో అనాధగా మారాడు (చిన్నాన్న        సంరక్షణలో పెరిగాడు)
           595 - ఖదీజా అనే తనకంటే వయసెక్కువున్న ధనవంతురాలైన విదవరాలితో వివాహం 
           610 - దేవదూత ద్వారా అల్లా తనకు వాక్యోపదేశం చేసాడని మొట్టమొదటి ప్రకటన
           619 - చిన్నాన్న మృతి
           622 - మక్కా నుండి మదీనాలో స్థిరపడటానికి ప్రయాణం (హిజ్రా)
           623 - మక్కా ప్రయాణీకుల గుడారాలపై (caravans) దాడి చేయాలని తన అనుచరులకు ఆజ్ఞ.
           624 - బద్ర్ యుద్ధంలో విజయం
           624 - ఖానుఖా యూదులను మదీనా నుండి నిర్మూలించెను 
           624 - అబూ అఫక్‌ను హతమార్చమని అనుచరులకు ఆజ్ఞ
           624 - అస్మా బిన్త్ మర్వాన్‌ను హతమార్చమని ఆజ్ఞ 
           624 - కబాల్ అష్రఫ్‌ను హతమార్చమని ఆజ్ఞ 
           625 - ఉహద్ యుద్ధంలో ఓటమి
           625 - నాదిర్ యూదులను తరిమివేయుట
           627 - ట్రెంచి యుద్ధంలో విజయం (దీనినే ఖందక యుద్ధం అంటారు) 
           627 - ఖురైజా యూదుల ఊచకోత
           628 - మక్కావారితో హుదైబియా సంధి
           628 - ఖైబర్ యూదులను నాశనంచేసి మిగిలినవారిని తన నియంత్రణలోకి తెచ్చుకొనుట
           629 - మూతా యొద్ద క్రైస్తవ ప్రాంతాలపై దండయాత్రలో ఓటమి
           630 - ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఆశ్చర్యకరంగా మక్కా కైవసం
           631 - క్రైస్తవ ప్రదేశమైన తబూక్‌పై దాడి. ప్రతిఘటన లేకుండానే కైవసం
           632 - జబ్బుపడి మరణం  

"మహమ్మద్ తననుతాను పొగుడుకొని ఆనందించే స్వార్థపరుడు (narcissist), పిల్లలతో లైంగిక కలాపాలు చేసేవాడు (pedophile), సామూహిక నరహంతకుడు (mass murderer), తీవ్రవాది, స్త్రీద్వేషి (misogynist), కామాంధుడు (lecher), పిచ్చివాడు, బలాత్కారుడు, దోపిడీదారుడు, కుట్రదారుడు" అని ముస్లిం మతభ్రష్టుడైన అలీ సినా (Ali Sina) ప్రకటించాడు. ఇది తప్పు అని ఎవరైనా తమ పవిత్ర ఖురాన్ మరియు ఇస్లామిక్ గ్రంథాలనుండి నిరూపించినట్లైతే 50,000 డాలర్ల బహుమానం ఇస్తానని మరియు తన ఆరోపణలను ఉపసంహరిచుకొంటానని బహిరంగ సవాలు విసిరారు. ఈ సవాలు ఇప్పటికీ నిలిచి ఉంది.        

Wednesday 3 August 2011

"మొహమద్- అత్యంత శక్తివంతమైన, దేవునిచే నియమించబడిన ఆఖరి ప్రవక్త (?), ఖురాన్- నేరుగా అల్లానుండి గాబ్రియేలు దూత మొహమద్‌కు వల్లించిన దేవోక్తి (?), ఇస్లాం- పవిత్రమైన, శాంతికరమైన మతం (?)- విశ్లేషణ

"భారతీయ బానిస వ్యాపారం" అనే శీర్షికతో 8 టపాలు ఈ బ్లాగ్‌లో వ్రాసాను. ఐతే ఇది ఇంకా పూర్తికాలేదు. మిగిలిన విషయాలను త్వరలోనే పూర్తి చేస్తాను. రాబోయే టపాల్లో "ఇస్లాం" గురించి ముఖ్యంగా పవిత్ర(?) ఖురాన్ గురించి విస్తృతంగా చర్చించాలని అనుకొంటున్నాను. ఇప్పుడా అవసరం ఏమొచ్చింది అని చాలా మందికి అనిపించొచ్చు లేక మనకెందుకులే గొడవ అనుకోవచ్చు. ఇటువంటి మన నిర్లక్ష్యమే మన చరిత్రను రక్తసిక్తం చేసింది. అంతేగాక ఇస్లాం గురించి ఒక బహిరంగ చర్చ జరగడం చాలా అరుదు. ఒకవేళ ముస్లిం మతం గురించి ఎమైనా అపోహలు, అపార్థాలుంటె కూడా చర్చించడం ద్వారా తొలగించుకోవచ్చు. అది ఇస్లాం కే మంచిది కదా! ఖురాన్ నేరుగా అల్లా నుండి వచ్చింది అని ముస్లింలు నొక్కి చెబుతారు. అయితే ఖురాన్ని మిగిలిన మతగ్రంథాలతో పోల్చి చూసి ఇది ఎంతవరకు నిజమో సత్యానేషులు తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఖురాన్ విశ్వనీయతను నిరూపించుకొంటె మంచిది. అంతేకాని దాని గురించి మాట్లాడేవారిని చంపుతామని బెదిరించడం ఇప్పటివరకు అనేక ముస్లింలు చేస్తున్న పని. రాబోయే టపాల్లో ఖురాన్, మొహమద్ మరియు ఆయన ప్రకటించిన ఇస్లాం గురించి నేను తప్పుగా వ్రాసాను అని ఎవరైన అనుకొంటే లేక నేను అపార్థం చేసుకొన్నాను అనుకొంటే దానిని నిరూపించి జ్ఞానోదయం కలుగజేయగలరు (ఎవరైనా ఈ బ్లాగ్ చదివితే!).

Tuesday 2 August 2011

భారతీయ బానిస వ్యాపారం-8

  
మొఘల్ పరిపాలన (క్రీ.శ. 1526-1707)-2


3) జహంగీర్ (1605-1627, అక్బర్ కుమారుడు) తన చరిత్ర గ్రంథంలో, తన తండ్రియైన అక్బర్ మరియు తన స్వంత పాలనలో కలిపి సుమారు ఐదారు లక్షలమందిని హతమార్చినట్లు వ్రాసాడు (ఖాన్:200). జహంగీర్, కేవలం ఒకే (1619-29) సంవత్సరంలో సుమారు 2 లక్షల హిందువులను బానిసలుగా విక్రయించడానికి ఇరాన్‌కు తరలించాడు. ముస్లింలు పిల్లలను నపుంసకులనుగా చేసి కప్పందార్లకి బానిసలుగా ఇచ్చేవారు (ఖాన్:285).

4)షాజహాన్ (1628-1658, అక్బర్ యొక్క మనుమడు): ఈయనపాలనలో హిందూ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతుల పిల్లలను, స్త్రీలను శిస్తు కింద లెక్కించి బానిసలుగా చేసుకొనేవారు. చివరకు రైతులు కూడా తిండికి గతిలేక వారినివారు బానిసలుగా అప్పగించుకొని, చిత్రహింసలు తగ్గించుకోడానికి ఇస్లాంను స్వీకరించేవారు. ఇటువంటి షాజహాన్ పాలనను గురించి మన చరిత్ర గ్రంథాల్లో "మొఘల్ స్వర్ణయుగం"గా వర్ణిస్తారు. నిజానికి ముసల్మాన్లు హిందుస్థాన్‌ను ఆక్రమించుకొన్నప్పటినుండి వారికి స్వర్ణయుగమే, కాని హిందువులకు అది ప్రత్యక్ష నరకం. షాజహాన్ హిందూ మరియు క్రైస్తవ ఆలయాలను నాశనం చేయడంలో క్షణమైనా ఆలస్యం చేసేవాడుకాదు. ఇంకా ఇతడు ఆగ్రాలో 4,000 మందిని ఇస్లాంలోకి మారడమో లేక చావడమో తేల్చుకోమని హెచ్చరిస్తూ వారి కన్యకలని, స్త్రీలని తన హారేంనకు తరలించాడు. హూగు ప్రాంతంలో 10,000 మందిని సంహరించాడు. తన స్వంత కుమార్తెలతో జుగుప్సాకరంగా సంభోగించినట్లు రుజువులతో సహా ట్రిఫ్కోవిక్ తన పుస్తకంలో వివరించాడు (112వ పుట; K-విభాగం). షాజహాన్ తన మూడవ భార్యయైన ముంతాజ్‌తో పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితంలో పధ్నాల్గవ కాన్పు సమయంలో మరణించింది. ఆమేతో ప్రేమగా ఉండేవాడని మచ్చుకు ఒక్క అధారం కూడా లేదు. ఇక తాజ్‌మహాల్ ఆయన కట్టించాడు అనేది చాలా వివాదాస్పద అంశమని ఎందరో ఆర్కియాలజిస్ట్‌లు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. 


మొఘల్ చక్రవర్తుల పాలనలో సుదూర దేశాలనుండి అనేక బానిసల్ని హిందుస్థాన్‌కు తీసుకొచ్చేవారు. ఉదాహరణకు, ఔరంగజేబ్ తన హారేం కాపలాకు ఉజ్బెక్ మరియు తాతర్ ప్రాంత స్త్రీలను నియమించాడు. ఇంకా అనేకమంది ఐరోపా స్త్రీలని కామబానిసలుగా కలిగి యుండెను (ఖాన్:317).

5)ఔరంగజేబ్ (1658-1707, అక్బర్ మునిమనుమడు), యావత్ భారతదేశాన్ని ఆక్రమించుకొని, ప్రజలందరిని బానిసలుగా చేసుకొని, సంపూర్ణ ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని ఆకాంక్షించాడు (ఖాన్:104). కొంచెం నిస్తేజమైన ఇస్లాంని ఇతడు పునరుత్తేజపరచాడు. అంటే ఆలయాల్ని, హైందవ వేద పాఠశాలల్ని ధ్వంసం చేసి అనేకమంది పండితులని, హిందువులని విచక్షణారహితంగా చంపాడు. కక్షసాధింపుగా షరియా చెట్టాల్ని, దిమ్మీ చెట్టాల్ని ప్రయోగించేవాడు (ఖాన్:98). హిందువులు భరించలేక ఎదురుతిరిగారు. నాయకత్వం వహిస్తున్న రాజ్‌పుట్ సైన్యాన్ని సమర్థంగా ఎదురుకోలేక వారిని మానసికంగా కృంగదీయడానికి ఇష్టమొచ్చినట్లు విధ్వంసాలు చేయడం, పండ్ల చెట్లను నరకడం, హిందూ స్త్రీలను, పిల్లలను చెరపట్టడం వంటి దుశ్చర్యలు చేసారు (సుక్డీయో: 265) (ముస్లిం హడిత్‌లో నియమింపబడినట్లు అన్యులైన బాటసారులకి, ప్రయాణికులకి తీవ్ర ఇబ్బంది కలుగునట్లు పండ్ల చెట్లను నరికి, తలదాచుకోకుండా దారినున్న నివాసాల్ని ధ్వంసంచేసి వారిని దోచుకొని పిల్లలను, స్త్రీలను చెరపట్టవలెను- 09.13 మరియు 09.15 హడిత్ ఆజ్ఞలు). భారతదేశాంలోనున్న ఒక ఫ్రెంచి వైద్యుడు, చిన్నపిల్లలను శిస్తు క్రింద లెక్కగట్టి ముసల్మాన్ సుంకరులు బలవంతంగా లాక్కుపోయేవారు అని తన డైరీలో వ్రాసుకొన్నాడు (ఖాన్:284).

భారతదేశంలోకి ప్రవేశిస్తున్న బ్రిటీష్‌వారు బానిసత్వాన్ని నిరోధించినప్పటికి ముస్లింలు భారత్ లోపలా వెలుపలా విరివిగా బానిసల వ్యాపారం చేసేవారు.




Monday 1 August 2011

భారతీయ బానిస వ్యాపారం-7

మొఘల్ పరిపాలన (క్రీ.శ. 1526-1707)- 1

1) జహీరుద్దీన్ షా బాబర్ (1483-1530) లోడిని ఓడించి ఢెల్లీ పీఠాన్ని అధిష్టించాడు. ఖురాన్ నుండి తెగ సూక్తులు చెప్పే బాబర్, జీహాద్ చేయుటలోను, హిందువుల తలలు నరికి గుట్టలుగా పోయడంలోనూ, పిల్లలను, స్త్రీలను చెరపట్టి అనుభవించుటలోను అంతే ఆసక్తి ప్రదర్శించేవాడు (ఖాన్:282; లాల్:438-459). ఈయన ఏలుబడిలో నాయకత్వం కోసం తీవ్రమైన పోటీ ఉండేది.


http://www.livius.org/a/1/alexander/hindu_kush.jpg
ఒకప్పుడు ఆఫ్గానిస్థాన్ హిందూ రాజ్యంగా ఉండేది. దీనికి గాంధార
మరియు వాహిలి లేక వాహిలిక అనే పేర్లుండేవి. ఇక్కడ శైవులు,
బౌద్ధమతస్తులు అధికంగా ఉండేవారు. హిందూ రాజులచే యేలబడుచున్న
ఈ ప్రాంత ముఖ్య నగరాలైన కాబుల్ మరియు జబూల్ పై క్రీ.శ. 654
నుండి అరబ్బు ముష్కరుల దాడులు ప్రారంభమయ్యాయి. సుమారు
200 యేండ్లు గాంధార (ఆఫ్ఘాన్) పటాన్లు వారిని నిలువరించ
గలిగారు కాని ఎట్టకేలకు ఓడిపోయారు. ముస్లింలు హిందువులను
ఊచకోతకోసిన రీతి ఎంత భయానకమంటే అక్కడి పర్వతశ్రేణులకి
"హిందూఖుష్" అని నామకరణం చేసారు. "హిందూఖుష్" అనగా
"హిందువుల వధ" అని అర్థం. కొండకోనలలో హిందువుల రక్తం
ఏరులైపారింది. గత్యంతరంలేక అనేకులు ఇస్లాంను స్వీకరించారు.
ఆఫ్ఘాన్‌లో 1980 లో కమ్యూనిస్టు ప్రభుత్వం పడిపోయాక
మరియు డిసెంబర్ 6, 1992లో బాబ్రి మసీదు కూల్చివేయబడ్డాక,
కాబుల్, జలాలబాద్, మరియు కాందహార్ ప్రాంతాలలో ఉన్న
75,000 మంది హిందూ మైనారిటీలపై భయంకర దాడులు జరిగాయి.
ఎప్పటిలాగే అంతర్జాతీయ మీడియా ముస్లిం మనోభావాలకు
భంగం కలగొద్దని ఆ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు. అనేకమంది
హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఢెల్లీ వంటి నగరాలకు
పారిపోయారు. ఉదాహరణకు ఢెల్లీ పరిసరప్రాంతాల్లో ఎక్కువగావుండే
"సెహగల్"లు ఆఫ్ఘాన్ హిందువులే!
2) అక్బర్ ద గ్రేట్ (1556-1605; బాబర్ మనుమడు) : పల్లెలు, పట్టణాలపై దాడిచేసి దోచుకోవడం, స్త్రీలను చెరపట్టడం సర్వసాదారణమైపోయింది. అయితే అక్బర్ ఈ దురాగతాల్ని కొంతవరకు నిరోధించుటకు ప్రయత్నించాడు కాని సఫలీకృతుడు కాలేదు. ముస్లిం సైన్యానికి, అధికారులకి మింగుడుపడదేమొనని చివరకు చూసి చూడనట్లు వదిలేసాడు. భారతభూభాగం చాలా వరకు అక్బర్ ఆధీనంలోకి వచ్చింది. నిరక్షరాసుడైన అక్బర్ కొంత సహనశీలి కాబట్టి ఇతన్ని ఇస్లాం వ్యతిరేకిగా ముల్లాలు, అధికారులు తలంచారు. అక్బర్ తన దర్బారులో ఇతర మతస్తులకి కూడా ఉన్నత కొలువులిచ్చాడు. ఇతను దిన్-ఎ-ఇలాహి (స్వచ్ఛమైన విశ్వాసం) అనే అందరినీ కలుపుకొనిపోయే కొత్త మతాన్ని ప్రకటించాడు (ఖాన్:152). ఇతడు హిందూ మరియు జొరాస్ట్రియన్ పండుగలను అధికారికంగా ఆమోదించాడు (ట్రిఫ్‌కోవిక్:112). ఇతడు "జిజ్యా" పన్నును రద్దు చేసాడు. అయినా ఇంకా అనేక పన్నులు హిందువులపై అదనంగా ఉండేవి. అయితే ఇతడు తన ఇస్లామిక్ మతాన్ని, విశ్వాసాల్ని పూర్తిగా వదల్లేదు. కాలిఫ్ అధికారాన్ని ఇతడు తృణీకరించినప్పటికీ మక్కా, మదీనా మరియు ఇతర ముస్లిం ప్రాధాన్య ప్రాంతాలకు విలువైన బహుమతులు పంపేవాడు.  అక్బర్‌కు అనేకమంది బానిసలు, "హారెం" లో ఉపపత్నులు, స్త్రీలు బానిసలుగా నుండిరి. అతడు విగ్రహారాధనను ద్వేషించేవాడు (మొఘల్ స్మృతులుగా పేర్కొనే "బాబర్‌నామా"లో వ్రాయబడినది). హిందువులలో అత్యదికులు విగ్రహారాధికులేనని పేర్కొన్నాడు. శిస్తులు కట్టలేక సుమారు 30 వేలమంది చిత్తూరు రైతులు 6,000 మంది రాజ్‌పుట్‌లతో కలిసి ఆయుధాలు చేపట్టగా, అక్బర్ వారిని భయంకరంగా సంహరించాడు. కొందరిని చెరపట్టి చిత్రహింసలు (ఏనుగులతో తొక్కించడం, ముళ్ళ కొరడాలతో కొట్టించడం, కాళ్ళకు తాళ్ళు కట్టి గుఱ్ఱాలతో లాగించి అడ్డంగా చీల్చివేయించడం వంటి శిక్షలు విధించాడు) చేసి బ్రతికిన వారిని బానిసలుగా చేసుకొన్నాడు (ఖాన్:88, 113; ట్రిఫ్‌కోవిక్:112).
"తిరగబడిన వారిని అతికిరాతంగా చంపారు. ఒక్కపూటలోనే సుమారు 2,000 మంది తలలు నరికారు. ప్రాణాలతో బయటపడ్డా వారిని, వారి భార్యలను దాసదాసిగా చేసుకొన్నారు. వారి ఆస్తులను, యౌవ్వన స్త్రీలను ముసల్మాన్లు పంచుకొన్నారు. ఇదంతా అక్బర్ చక్రవర్తి మూడు రోజులు అక్కడేవుండి జరిపించారు" (సుఖ్‌డీయో: 252).
"అక్బర్ కామవాంఛలు తీర్చుకోడానికి తన హారేంలో 5,000 మంది అందమైన యువతులు మరియు పిల్లలని కలిగి యుండెను" (ఖాన్:102).

అక్బర్ సామూహిక బానిసత్వానికి స్వస్తి పలకాలని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అతని సైన్యాధిపతులు, అధికారులు అనేకమంది బానిసల్ని కలిగియుండిరని చరిత్రకారుల గణాంకాలు సూచిస్తున్నాయి. ఎంత ఎక్కువమంది బానిసలుంటే అంత గొప్ప అనే భావం ముస్లిం అధికారుల్లో, ప్రథానుల్లో ఉండేది కాబట్టి ఏ కారణం లేకుండానే వారు అప్పుడప్పుడూ హిందువులపై విరుచుకుపడేవారు (ఖాన్:282). ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో నపుంసకుల వ్యాపారం బాగా జరిగేది కాబట్టి మగపిల్లలను, పురుషులను చెరపట్టి వారిని కొజ్జాలుగా మార్చి వ్యాపారం చేసేవారు. అబ్దుల్లా ఖాన్ ఉజ్బేగ్ అనే అక్బర్ యొక్క ఒక సైన్యాధికారి, ఇలా ప్రగల్భాలు పలికాడు;
"నేను 5,00,000 మంది స్త్రీలను, పురుషులను, పిల్లలను చెరపట్టి బానిసలుగా అమ్మేసాను. వారు మహమ్మదీయులుగా మారి వారు ఇక్కడ అల్లా "తీర్పు దినం" నాటికి కొన్ని కోట్ల జనాంగంగా తయారవుతారు" (ఖాన్: 103). 

అక్బర్ పాలనలో ప్రతీ ముస్లిం దెగ్గర అనేకమంది సేవకులు, బానిసలు ఉండిరి. అసలు ముస్లింలు కష్టపడే అవసరం లేకుండా పోయింది. (ఖాన్:283).

అక్బర్ కుమారుడైన జహంగీర్ మరియు మనుమడైన షాజహాన్ అక్బర్‌వలె కాక పూర్తిగా ఇస్లాంను పాటించారు.  


భారతీయ బానిస వ్యాపారం-6

ఢెల్లీ సుల్తాన్ పీఠాన్ని కూల్చివేసిన తిమూర్ (తామర్లిన్) (1398/99)

సూఫి ఇస్లామిక్ భక్తిపరుడైన (మధ్యాసియాకి చెందిన తుర్క/మొఘల్) అమీర్ తిమూర్ 1398/99 లో ఢెల్లీపై దండెత్తి 1,00,000 బానిసల్ని ఊచకోత కోసి సుమారు 2,00,000-2,50,000 మంది బానిసలను మరియు నేర్పుగల పనివారిని (skilled workers and craftsmen) మధ్యాసీలోని సామర్ఖండ్‌నకు చెరపట్టుకొనిపోయాడు (ఖాన్:282; లాల్:544). తిమూర్, తన "స్మృతుల గ్రంథం"లో ఢెల్లీ దండయాత్రను గూర్చి ఇలా వ్రాయించాడు:
"దండెత్తి వెళ్లిన 15,000 మంది తుర్క సైనికులొక్కొక్కరికి 50-100 బంధీల చొప్పున చిక్కిరి. ఇది కేవలం 17వ రోజు జరిగిన దాడిలో చిక్కిన బానిసల సంఖ్య. స్త్రీలు మరియు ఇతర దోపిడీ సొమ్ముల లెక్కకు అంతేలేదు. ముసల్మాన్‌ల ఆధీనంలోనున్న ప్రదేశాలపై మేము దాడిచేయలేదు కాని వారిని సూఫి ఇస్లాంను స్వీకరించమని హెచ్చరించాము. తిరిగి సామర్ఖండ్‌కు వెళ్లే దారిపొడవునా దోచుకొంటూ, అందమైన స్త్రీలను, పిల్లలను చెరపడుతూ వెళ్లాము."("తిమూర్ యొక్క స్మృతులు"- బోస్టం: 648).  

ఢెల్లీ సుల్తాన్ పీఠాన్ని తిరిగి స్థాపించిన సయ్యద్ మరియు లోడి వంశస్తులు (1400-1525)

తిమూర్ ఢెల్లీలో టర్కిష్ పాలనను విచ్చిన్నం చేసాక తనకు కప్పం కట్టేవారికి 1506 వరకు అధికారమిచ్చాడు.
ఈ సయ్యద్ సుల్తాన్లు కతెహార్ (1422), మాల్వా (1423) మరియు అల్వార్ (1425) ప్రాంతాలపై దండెత్తి ఎందరినో నరికి, బానిసల్ని దోపుడు సొమ్ముని కొల్లగొట్టారు. వీరి తరువాత లోడి సుల్తాన్లు ఢెల్లీ గద్దెనెక్కారు (1451-1526). ఎందరు మారినా హిందువుల స్థితి మాత్రం మారలేదు. అది అంతకంతకు దిగజారింది. సుల్తాన్ బహ్‌లూల్ చేసిన ఆకృత్యాలకు నిస్సార్ అనే ప్రదేశం నిర్మానుష్యమైంది. సికిందర్ లోడి రేవా మరియు గ్వాలియర్ పట్టణాల్లో ఇంతకంటే ఎక్కువ ఆకృత్యాలు చేస్తూ చెలరేగిపోయాడు (ఖాన్:282). 

సూఫీలైనా, సున్నీలైనా, షియాలైనా, ఇస్లాంలో ఏ తెగైనా సరే పర్యావసానం మాత్రం ఒక్కటే! అది అన్యమతస్తులు, విగ్రహారాధికుల ఊచకోత, వారి స్త్రీలను, పిల్లలను చెరచడం, వారి కష్టార్జితాన్ని దోచుకోవడం. హిందుస్థాన్ యొక్క రక్తసిక్త చరిత్రను కొందరు స్వార్థ రాజకీయనాయకులు వారి సొంతప్రయోజనాలకోసం అణచివేసారు. 

("మొఘల్ పాలన"- తరువాతి టపాలో)