Pages

Subscribe:

Sunday 31 July 2011

భారతీయ బానిస వ్యాపారం-5

ఘోరిల దండయాత్ర: వాయువ్య భారతదేశాన్ని, గంగానది దిగువ ప్రాంతాల్ని జయించిన డెల్లీ పీఠ తుర్కలు (1206-1526).

1) ఘోరి పాలకులు, అనగా మొహమద్ ఘోరి మరియు ఆయన సైన్యాధిపతియైన కుతుబూద్దీన్ ఐబక్ (1206-1210) అద్వర్యంలో ఢెల్లీ సుల్తాన్ పీఠం స్థాపింపబడినది. అయితే వీరి పాలనలోకూడా సామూహిక శిరచ్ఛేదనాలు, బానిసలుగా మార్చుకోవడం, బలవంతపు మతమార్పిడులు, దోపిడీలు, అత్యాచారాలు, హిందూ ప్రార్థనా స్థలాల విధ్వంసాలు మాత్రం తగ్గలేదు. ఒక్కొక్క ముస్లింకి లెక్కకుమించి బానిసలుండిరి. ఉదాహరణకు 1195లో రాజా భీం నుండి ఐబక్ 20,000మంది బానిసల్ని తెచ్చుకొన్నాడు మరియు కళింగర్ దగ్గర 50,000 మంది బానిసల్ని తెచ్చుకొన్నాడు(1202) (లాల్:536).

"చివరికి పేద ముస్లిం దెగ్గర కూడా అనేకమంది బానిస సేవకులుండిరి (ఖాన్:103; లాల్:537)."



డెల్లీ సుల్తాన్‌పీఠావిర్భావం తరువాత ఢెల్లీ కేంద్రంగా దాడులు, బానిసల్ని చెరపట్టడం పెచ్చురిల్లాయి. హిందూస్థాన్ అంతట సామాన్య ముస్లింలకు కూడా లభ్యమయ్యేలా బానిసవిక్రయ కేంద్రాలు వెలిసాయి. ఈ బానిసలు వారికి ఒక వస్తువుతో సమానం. వీరిని ఎటుబడితే అటు తీసుకువెళ్లెవారు. కాలిఫ్(ముస్లిం మత ప్రథాన ఏలిక)కు ఐదవవంతు దోపిడిసొమ్ము మరియు బానిసలను పంపే సాంప్రదాయం ఆగిపోయింది. అయితే అప్పుడప్పుడు గౌరవసూచకంగా లేక బహుమానాలగా బానిసల్ని కాలిఫ్‌లకు, ధనిక ముస్లింలకు, ఇంకా చైనాకు కూడా పంపేవారు.

ముస్లిం సైన్యాలు విధ్వంసంచేసిన హోసలేశ్వర
దేవాలయంలో చేతులు తెగిపోయిన ఒక విగ్రహం

2) సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్ (క్రీ.శ.1236) ఇతడు కూడా భారతీయుల్ని బానిసలుగా చేసుకోవడం వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం చేసేవాడు. బానిసలపై ప్రభువుగా నియమింపబడిన ఉలగ్ ఖాన్ బల్బాన్ (1250లు-60లలో) లెక్కింపలేనంతమందిని బంధించాడు అని ఒక చరిత్రకారుడు వ్రాసాడు:
"ఆ అంధవిశ్వాసుల (హిందువుల) భార్యలు, పిల్లలు, ఆస్తులు వారిని జయించిన ముస్లిం సైనికుల     వశమయ్యాయి (లాల్:538)."

కతెహార్ అనే ప్రాంతంలో, 8 సంవత్సరాల వయసును మించిన మగవారినందరిని చంపేసి స్త్రీలను, పిల్లలను చెరపట్టమని బల్బాన్ తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు (లాల్:539).

హిందుస్థాన్లోని అనేక పల్లెలు, పట్టణాలపై సుల్తాన్ సైన్యం దాడులు జరిపి మందలు మందలుగా బానిసల్ని చెరపట్టుకుపోయారు. తప్పించుకొన్న హిందువులు కాలి బూడిదైన వారి గ్రామాలకు తిరిగి వచ్చేవారు. సుల్తాన్ సై
న్యం బంధించినవారు మాత్రం ఎన్నటికీ తిరిగిరాలేదు (లాల్:539).

3) ఖిల్జిల (1290-1320) మరియు తుగ్లగ్‌ల (1320-1413) పాలన

13, 14వ శతాబ్దాల ఖిల్జీలు మరియు తుగ్లగ్‌ల పాలనలో బానిసత్వం పెరిగింది, అలాగే ఇస్లాం కూడా వ్యాప్తిచెందింది. ప్రతిరోజు వేలమంది బానిసల్ని ఎంతో చౌకగా అమ్ముతుండేవారు (ఖాన్:258). అల్లావుద్దిన్ ఖిల్జి (1296-1316) విస్తారమైన బానిసల్ని చెరపట్టి, వారిని గొలుసులతో బంధించి, చిత్రహింసలు పెడుతూ ఘోరంగా అవమానించేవాడు. కేవలం ఒక్క సోమ్నాథ్‌పై దాడిలోనే, "20,000 మంది అందమైన స్త్రీలను, లెక్కింపలేనంతమంది పిల్లలను మహ్మదీయ సైన్యం చెరపట్టించి. వారి నివాసాల్ని, పట్టణాలని నేలమట్టంచేసి వారికి కలిగినదంతయు దోచుకొన్నారు. (బోస్టం: 641; లాల్:540)."

కొన్నివేలమంది వధింపబడ్డారు. అల్లవుద్దిన్ ఖిల్జి తన స్వంత సేవకే 50,000 మంది స్త్రీలను, పిల్లలను, అందమైన పురుషులను వినియోగించుకొనేవాడు. తన మందిరాల్లో మొత్తం 70,000 మంది బానిసలు నిత్యం పనిచేసేవారు. (లాల్:541).

ఆడవారు "జౌహార్" లేక "సతి" గావించేవారు. అంటే  ముస్లింలనుండి బానిసత్వం మరియు మానభంగాల్ని తప్పించుకోడానికి  నిప్పంటిచుకొని లేక మరోవిధంగా ఆత్మహత్య చేసుకొనేవారు. (తరువాత కాలంలో కొందరు స్వార్థ హిందూ ఛాందసవాదుల మూలంగా ఈ "సతి" భర్త చనిపోయిన స్త్రీలకు జరిగించుట ఆచారమైంది).

"తుర్కలు వారికి కావల్సినప్పుడెల్ల హిందువులను బంధించి, వారిష్టమొచ్చినట్లు చేసి, బానిసలుగా అమ్మేవారు" అని సూఫియుడైన అమీర్ ఖుస్రూ వ్రాసారు.   

13, 14వ శతాబ్దాలను గురించి ఒక హిందు చరిత్రకారుడు ఇలా వ్రాసాడు: " ఎక్కడచూసిన బానిసవిక్రయ
కేంద్రాలు ఉండేవి. అవెప్పుడూ హిందూబానిసలతో నింది ఉండేవి. ముస్లిం సైన్యాలు జరిపిన అనేక దాడుల్లో లక్షలమంది హిందువులు మృతిచెందారు. ఘోరి మాలిక్ అనే ముస్లిం ఆక్రమనదారునికి హిందువుల్ని నిర్దాక్షిణ్యంగా హతమార్చి, బ్రాహ్మణులను వారి గోవులను సమ్హరించి వారిని భయభ్రాంతులకు గురిచేయమని సందేశం పంపబడినది. దానిని నెరవేరుస్తూ ఈ తుర్కలు విధ్వంసం చేస్తూ, విచ్చలవిడిగా దోచుకొంటు, స్త్రీలను పిల్లలను చెరుస్తూ హత్యాకాండ గావించారు (లాల్: 634)."   

మొహమ్మద్ తుగ్లగ్ (1325-1351) అల్లావుద్దీన్ ఖిల్జీని తలదన్నేలా అనేకమంది హిందువులని బానిసలుగా చెరపట్టాడు.
"సుల్తాన్ విగ్రహారాధికులైన హిందువులను సంహరించుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఈయన హయాంలో, ఎందరో హిందువులు బానిసలుగా చెరపట్టబడటం వలన బానిసల్ని అత్యంత చౌకగా కొనుగోలు చేసేవారు" అని ఒక చరిత్రకారుడు వివరించారు.   

సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లగ్ (1351-1388) ఈయన దెగ్గర 1,80,000 మంది అందమైన దృడమైన యువకులు బానిసలుగా ఉండిరి. 40,000ని అంగరక్షకులుగా కలిగి యుండెను. సుల్తాన్, తన సామంతుల్ని, అధికారుల్ని- యుద్ధాలు చేసినప్పుదెల్లా శ్రేష్ఠమైన బానిసల్ని తనకు పంపమని" ఆదేశించాడు (సూక్ధెయో: 165-167; లాల్:542).

ఈయన హయాంలో భారతదేశం వెలుపల కూడా అనేక బానిసవిక్రయ కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. కాందహార్, గజిని, ఖురాసన్, సామర్ఖండ్ మొదలగు పట్టణాలకి సుదూరప్రాంతాలనుండి వర్తకులు, వ్యాపారులు భారతీయ బానిసలని కొనుగోలు చేయడానికి వచ్చేవారు. హిందువుల మధ్య నివసించే భారతీయ ముస్లింలు హిందువులను నొప్పించకుండా ఇతర (ఐరోపా, ఆఫ్రికా మొదలగు) జాతుల బానిసల్ని కొని తెచ్చుకొనేవారు. ఎందుకంటే చెట్టాలు ముస్లింలకు అనుకూలంగా ఉండటం వలన హిందు ఇరుగుపొరుగువారితో వ్యాపారలాలాదేవీలు ముస్లింలకు లాభదాయకంగా ఉండేవి కాబట్టి హిందు బానిసలను కలిగి ఉంటే వ్యాపారం సరిగా సాగదని వారు ఇతరజాతులను బానిసలుగా కలిగి ఉండేవారు(ఖాన్:318).  


Saturday 30 July 2011

భారతీయ బానిస వ్యాపారం-4

ఫంజాబ్‌ను ఆక్రమించుకొన్న ఆఫ్గానిస్తాన్‌లోని గజినీ ప్రాంతవాసులైన గజినివిద్ తుర్కలు (Ghaznivid-Turks) (క్రీ.శ. 997-1206)

మొహమద్ గజినీ (997-1030) 17సార్లు హిందూస్థాన్‌పై దండెత్తి ఎంతో దోపుడు సొమ్ము తీసుకుపోయాడు అంతేగాక ఆయన చంపినవారు మరియు బంధిపబడి ఆఫ్గానిస్థాన్‌లోని గజినీ పట్టణానికి బానిసలుగా తీసుకుపోబడినవారు సుమారు 20లక్షలమంది (ఖాన్:315వ పుట). ఉదాహరణకు సుల్తాన్‌యొక్క కార్యదర్శి మరియు గణాంకుడైన ఉత్బీ,
సుల్తాన్ చరిత్ర గ్రంథంలో వ్రాసిన లెక్కలు-......తానేసర్‌నుండి ముస్లిం సైన్యాలు 2,00,000 మందిని గజినీ పట్టణానికి చెరపట్టుకొచ్చారు.......1019లో 53,000 మంది బానిసల్ని కొత్తగా బంధించి తెచ్చారు........ఇంకోసారి కాలిఫ్ కు దక్కవలసిన ఐదవవంతు బానిసలు 1,50,000 మంది (అంటే మొత్తం బానిసల సంఖ్య 7,50,000 మంది)....... తూర్పునుండి 5,00,000 బానిసలను ముస్లిం సైన్యం తీసుకువొచ్చింది..... 
ఇంకా మొహమద్ గజినీ కార్యదర్శియైన అల్-ఉత్బీ ఇలా వివరించాడు:
"దేవుని సైన్యమైన ముసల్‌మాన్‌లు 15,000 మందిని ఊచకోత కోసారు. వారి ఖడ్గాలు కారుమేఘాల్నుంచి వెలువడుతున్న మెరుపులవలే కదలసాగాయి, నేలరాలిన తోకచుక్కలా విగ్రహారాదికుల రక్తం ఏరులైపారింది. అంతేగాక అనంతమైన సంపద, 5,00,000 మంది అందమైన స్త్రీలు, పురుషులు బానిసలుగా ముస్లిం సైన్యానికి చిక్కారు (ఖాన్: 191)."

గజినివిద్‌లు ఇస్లాం సుల్తాన్ రాజపీఠమైన పంజాబ్‌లో 1186 వరకు ఏలారు. కాశ్మీర్, హన్సి మరియు పంజాబ్‌లో అనేక ప్రాంతాల్లో వీరు భయంకర నరమేదాలు చేసారు. ఎంతోమందిని బానిసలుగా చేసుకొన్నారు. ఉదాహరణకు 1079లో జరిగిన ఒక్క దాడిలోనే సుమారు 1,00,000 మందిని చెరపట్టి బానిసలుగా చేసారు (తారీక్-ఈ-అల్ఫీ, "ఖాన్" 276వ పేజీలో).   

Thursday 28 July 2011

భారతీయ బానిస వ్యాపారం-3

బానిసత్వం:ఇప్పటి పాకిస్తాన్ (సింధ్), బంగ్లాదేశ్, మరియు కాష్మీర్లలో కొన్ని ప్రాంతాలు పూర్వం ఇండియాలో అంతర్భాగంగా ఉండేవి. ఇస్లాం దండెత్తకమునుపు (7వ శతాబ్దానికి మునుపు) ఆఫ్గనిస్తాన్లో బౌద్ధమతం మరియు హిందుత్వం ఉండేవి. 16వ శతాబ్దంలో ఆఫ్గనిస్తాన్ని భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ సామ్రాజ్యం మరియు పర్షియా యొక్క సఫావిద్ సామ్రాజ్యం పంచుకొన్నారు. 

మతఛాందసవాదులు కానటువంటి ఉమయద్ రాజులు హిందువులకు "దిమ్మీ" హోదా కలిపించారు. "దిమ్మీ" హోదా మాములుగా యూదలకి మరియు క్రైస్తవులకై కలిపించాలని ఖురాన్ సూచిస్తుంది. "దిమ్మీ" హోదా అనగా, ముస్లిం ఏలుబడిలో ఉన్న అన్య మతస్తులు (ఖురాన్ ప్రకారం కేవలం యూదులు, క్రైస్తవులు) వారి వారి మతాలలోనే కొనసాగొచ్చు కాని షరియా చట్టంలో ద్వితియశ్రేణి పౌరులుగా ఉంటారు. అంటే తోటి ముస్లింలకంటే అధిక శిస్తులు చెల్లించాలి, ఇంకా అనేక కట్టుబాట్లు ఉంటాయి. దిమ్మీలను సమాజంలో అధములుగా ఉంచుతారు. అయితే విగ్రహారాధికులైన హిందువులను ఖురాన్లో సూచించిన ప్రకారం హతమార్చాలి లేక ఇస్లాం స్వీకరించేటట్లు చేయాలి. అంటే ముస్లింల పాలనలో హిందువుల స్థితి యూదులు, క్రైస్తవలుకంటే ఇంకా దయనీయమైనది- వారికి రెండే మార్గాలు: చావాలి లేక ఇస్లాంలోకి మారాలి. ఉమయద్ లు ఖురాన్ కు వ్యతిరేకంగా హిందువులకు "దిమ్మీ" హోదా ఇవ్వడంలో వారి స్వార్థం ఎంతో ఉంది- ఒకటి, హిందువుల సంఖ్య చాలా విస్తారంగా ఉంది కాబట్టి షరియా ప్రకారం వీరికి దిమ్మి హోదా ఇస్తే అధిక శిస్తులు వసులుచేసి ఎంతో ధనం సమకూర్చుకోవచ్చు. రెండు, మతమార్పిడులు, సంహారాలు చేయకపోవడం వలన హిందువుల దృష్టిలో ఇతర ముస్లిం పాలకులకంటె మంచివారిగా పేరు సంపాదించుకోవచ్చు. అయితే కొందరు ముస్లిం పెద్దలు, హిందువులను ఎందుకు సంహరించడం లేక మతం మార్చుకొనేట్లు చేయడంలేదని హుమయూన్ రాజును (సం. 1236) అడుగగా, అతడిట్లన్నాడు:
"హిందువులకు దిమ్మీ హోదా ఎందుకిచ్చామంటే ప్రస్తుతం ఈ దేశంలో ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ఇంకొన్నేండ్లలలో పట్టాణాల్లో, పల్లెల్లో ముస్లిం జనాభా బాగా పెరిగిన తరువాత హిందువులను చావు లేక ఇస్లాంలోకి మారడం మధ్య ఎదోఒకటి ఎన్నుకోమని శాసించవచ్చు" అని నచ్చజెప్పాడు (లాల్: 538వ పుట).   


పేరుకి దిమ్మీ హోదా పొందినప్పటికీ హిందువుల మీద దాడులు, హత్యాకాండలు, మతమార్పిడులు, బానిస  వ్యాపారం వంటివి చురుగ్గా సాగుతూనే ఉందేవి. తిరగబడ్డవారిని నిర్దాక్షిణ్యంగా చంపడం, అందమైన బాలురలను నపుంసకులనుగా చేసి బానిసలుగా చేసుకోవడం మరియు కామవాంఛలు తీర్చుకోవడానికి వారిని వాడుకోవడం సర్వసాదారణమైపోయింది. ఈ విథంగా హింసింపబడ్డవారు మరియు చంపబడ్డవారు ఎంతమందో వాస్తవ సంఖ్య తెలియనప్పటికి ఊహింపలేనటువంటి స్థాయిలో అత్యదికులు ముస్లిముల బారిన పడ్డారని వారి చరిత్రకారుల రాతలనుబట్టి తెలుసుకోవచ్చు. హిందువుల ఆత్మగౌరవానికి, మానప్రాణాలకు కలిగే ముప్పుగాక వారి ఆస్తిపాస్తులు, నగనట్ర అన్నీ ముస్లింలు దోచుకొనేవారు. 

ముస్లిం పాలకులు స్థానికులు కాదు, మధ్యప్రాచ్యం నుండి దండెత్తివచ్చినవారు, కాబట్టి 13వ శతాబ్దంవరకు వారు బానిసల్ని భారతదేశంనుండి మధ్యప్రాచ్యానికి తరలిస్తూ ఉండేవారు. అయితే 1206 సం. లో ఢిల్లీ సుల్తానైట్ (సుల్తానుల పాలనకేద్రం-ఢిల్లీ. పరిపాలన ఢిల్లీ నుండి సాగేది కాబట్టి పరిపాలనాయంత్రాగం, వారి పరివారాలు ఇక్కడే నివసించుటకు వచ్చారు) స్థాపించాక భారతీయ బానిసల ఎగుమతి కొంచెం తగ్గింది. ఎందుకంటే ఢిల్లిలో వారి సేవలు అవసమైయ్యాయి. అయినప్పటికీ అవసరాలనుబట్టి బానిసల్ని వివిధప్రాంతాలకి తరలించేవారు. అంతేగాక ఇతరప్రాంతాల (యూరోప్, ఆఫ్రికా) బానిసల గుంపుల్ని ఇక్కడికి తీసుకొచ్చేవారు. ఈ విధంగా ముస్లిం సైనిక బలగాలు ముస్లిములుగా మార్చబడ్డ వివిధజాతుల ప్రజలతో, హిందువులతో, మతమార్పిడిచెందిన భారతీయ ముస్లింలతో వైవిధ్యంగా ఉండేది. ఖురాన్ ప్రకారం బానిసలు అల్లాచే వాగ్దానంచేయబడిన దోపిడిసొమ్ము, కాబట్టి ఎక్కువ బానిసలను సంపాదించుకోవడం అనేది జీహాద్ జరిగించుటకు ఒక ప్రథాన కారణమయ్యేది.


"బానిసలు ఎంత అధికమైపోయారంటే నామమాత్రపు సొమ్ముతో వారిని కొనుగోలు చేయొచ్చు. ఇదంతా అల్లా దయనే. ఆయనను నమ్ముకొన్న ఇస్లామీయులను ఆయన ఇలా బానిసలనిచ్చి హెచ్చిస్తాడు, అవిశ్వాలు, విగ్రహారాధికులను నలుగగొట్టి దిగజారుస్తాడు (క్రీ.శ. 942-997 వరకు గజినీలు చేసిన దండయాత్రలలో చెరపట్టబడి బానిసలుగా చేసుకోబడినవారిని గూర్చి వ్రాయుచు సుల్తాన్ సుబుక్తిగిన్ జరిపిన ఒక దండయాత్రను గూర్చి వివరించుచూ ముస్లిం చరిత్రకారుడైన ఉత్బీ వ్రాసిన వాక్యాలు).  

ముస్లిం పాలకులచే మొట్టమొదట కైవసం చేసుకొబడిన సింధ్ ప్రాంతంలో అత్యదికులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడిన బానిసలు మరియు వారి యజమానులైన కొందరు అరబ్బు ప్రభువులుండేవారు (ఖాన్:299). మొదట్లో బానిసల్ని భారత భూభాగంనుండి బలవంతంగా వెలుపలకు తరలించేవారు. ఉదాహరణకు, మొదటి వాలీద్ కాలీఫ్ సంస్థానపు ప్రభువైన హజ్జజ్ బిన్ యూసుఫ్ చే పంపబడిన ఖాసీం అనే సైన్యాధిపతి క్రీ.శ.712 నుండి 715 వరకు మూడేండ్లలో జరిపిన దండయాత్రల్లో 3,00,000 మందిని బంధించి బానిసలుగా తరలించుకుపోయాడు (ఖాన్ 299వపుట; ట్రిఫ్కోవిక్ పీ 109వ పుట). ఈ జీహాద్ లో వివిధ ప్రాంతలనుండి వచ్చిన అనేక ముస్లిం యోధులు పాల్గొనేవారు. ఒకసారి అనుకోకుండా ఖాసీం ను వెనక్కు పిలిపించి బహుశా జంతుచర్మాలలో కుట్టించబడి చచ్చునట్లుగా మరణశిక్ష విధింపబడెను, ఎందుకంటే కాలిఫ్ (ప్రభువు) యొక్క ఉపపత్నులశాలకు తరలింపబడుటకు సిద్ధపరచబడిన ఇద్దరు సింధీ యువరాణులతో కాసీం సంభోగించినట్లు అభియోగం మోపబడెను(లాల్: 439వ పుట). 

వివిధ కాలీఫ్ ల హయాంలో 8వ మరియు 9వ శతాబ్దాల్లో బానిసలకొరకు అనేక దండయాత్రలు జరిగేవి.     
 

Tuesday 26 July 2011

భారతీయ బానిస వ్యాపారం-2

ముస్లింల దండయాత్రల వలన అపారమైన ప్రాణ, ధన నష్టాలు మరియు సంస్కృతి వినాశనం జరిగాయి. చారిత్రిక గణాంకాల ప్రకారం క్రీ.శ. 1000 నుండి 1525వ సంవత్సరం వరకు సుమారు 10 కోట్లమంది ఊచకోతకోయబడ్డారు. అంటే 500 యేండ్లపాటు జనాభా అబివృద్ధి చెందాల్సిందిపోయి క్షీణించింది (లాల్ గారు  ఎం.ఏ.ఖాన్ రచించిన Islamic Jihad: A Legacy of Forced Conversion, Imperialism, and Slavery అనే పుస్తకంలోని 216వ పుటలో సూచించిన గణాంకం). నమ్మశక్యంగా లేదా? ఐతే ఈ లెక్కలు గమనించండి: 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం కేవలం 9 నెలల్లో సుమారు 30 లక్షలమంది బంగ్లాదేశి ముస్లిం మరియు హిందువులను, కొందరు భారతీయులను వధించింది (ఖాన్ 216 పుటలో). ముస్లింలు జరిగించే హింసాకాండను ప్రతీసారి చూసిచూడనట్లు విస్మరించే అంతర్జాతీయ సమాజం, ఈ ఊచకోతనూ పెద్దగా పట్టించుకోలేదు. 


అధారాలను మరియు గణాంకాలను పరిశీలిస్తే విస్మయకరమైన పెద్ద సంఖ్యలో భారతీయులను ఇస్లామిక్ క్రూర రాజ్యాలు బానిసలుగా చేసుకొన్నాయి. భారతభూభాగాలపై ముస్లింలు జరిపిన దండయాత్రలు బహుశా ప్రపంచచరిత్రలో అత్యంత రక్తసిక్తమైనవేమో! ఖాన్:201వ పుటలో చరిత్రకారుడైన డ్యురంట్ ఇలా అన్నాడు:
"హిందువుల ఊచకోత, బలవంతపు మతమార్పిడులు, హిందూ దేవాలయాల కూల్చివేత, బానిస సంతల్లో వేలంవేయడానికి చెరపట్టుకుపోబడిన హిందూ స్త్రీలు, పిల్లలను గూర్చిన విషయాలను, ముస్లిం రాజులు క్రీ. శ. 800-1700 వరకు జరిగించిన భయంకరమైన రాక్షస కార్యాలని గొప్ప విజయాలుగా గర్వంతో అత్యుత్సాహంతో ముస్లిం చరిత్రకారులు ఇస్లామిక్ రాజుల గ్రంథాలలో వర్ణశోభితంగా వ్రాసారు." 

అరబ్బు ఆక్రమణదార్లు అసలేంచేసారో తెలుపుతు రిజ్వాన్ సలీం ఇలా వ్రాసారు:
"నాగరికతలో అత్యంత హేయమైన క్రూరులుగా పిలవబడుటకు ఏ సంస్కృతీ ఇష్టపడని ముష్కరులు అరేబియా మరియు పశ్చిమాసియా నుండి 7వ శతాబ్దంలో భారతభూమిలోకి రాసాగిరి. ఈ ఇస్లామిక్ ఆక్రమణదార్లు దండెత్తి వచ్చి మగవారినందరిని తెగనరికి, అనేక హైందవ దేవాలయాల్ని, విగ్రహాలని, శిల్పాలని తుత్తినియలుచేసి, కోటలను రాజమందిరాలని కొల్లగొట్టి విస్తారమైన దోపుడు సొమ్మును, స్త్రీలను పట్టుకొనిపోయిరి.....కానీ చాలామంది భారతీయులు, ఎంతో పరిణతిచెందిన, అన్ని నాగరికతలకంటె విజ్ఞానంలో, వైద్యంలో ఇంకా అనేక శాస్త్రాలలో ముందున్న నాగరికత, ఎంతో సృజనాత్మకత కలిగిన, శాంతికరమైన సంస్కృతిని ఈ ముస్లిం ముష్కరులు నాశనం చేసారన్న విషయం గ్రహింపకున్నారు (ఖాన్:179వ పుటలో)." 

ఇస్లాం ఇండియాలో ప్రవేశింపకమునుపు కూడా యుద్ధాలు జరిగాయికాని, అవి ఒక జాతి లేక రాజ్య వినాశనానికి, అసంఖ్యాకమైన బానిసలకోసం, స్త్రీలకు, పిల్లలకు చివరకు పసికందులకు కనీస విలువ ఇవ్వకుండా, కొంచెమైనా కనికరం చూపకుండా కామతృప్తికొరకైన వస్తువులునగా వాడుటకు, దేవాలయాల్ని నాశనం చేయుటకు, చేలను పాడుచేసి రైతులను జంతువులనుగా పనిచేయించుటకు ఈ యుద్ధాలు జరుగలేదు మరియు ఈ యుద్ధాలు ఇరు సైన్యాల మధ్య జరిగేవి, రాజ్యాధికారం మారుతూ ఉండేది కాని సామాన్యుని ప్రాణానికి మానానికి ఇంటికి ఆస్తికి ముప్పువాటిల్లేదికాదు. దోపిడీలు ఊచకోతలు ఈ యుద్ధాలలో జరిగేవికాదు. కాబట్టి ఇస్లామిక్ దండయాత్రల పర్యవసానాలను భారతప్రజలు గ్రహింపలేకపోయారు. రాజు, ప్రజా తేడాలేకుండా ముస్లిం పాలకుల చేతుల్లో అందరూ విలవిలలాడారు. వీరి సమాజం, ఇస్లాం పాలకులయొక్క అధిక శిస్తులతో, శిక్షలతో చిన్నాభిన్నమైపోయింది. గత్యంతరంలేక కొందరు మతం మారారు, ఇంకొందరు అడవులకు, కొండలలోకి పారిపోయి బలహీనులై రోగాలతో, క్రూరమృగాలబారిన పడి తనువులు చాలించారు. ముస్లింలు, హిందూస్త్రీల భర్తలను వారి కళ్ళముందే చంపి, భర్తల నెత్తురు చల్లారకముందే వారి భార్యలతో బలవంతంగా శయనించేవారు. భారత సమాజాన్ని ఘోరంగా కీంచపరచి, సంస్కృతిని పాడుచేసి, తిరగబడినవారిని కిరాతకంగా చంపుతూ, అన్యాయంగా నేరారోపణలు చేస్తూ భారతావనిని దయనీయస్థితిలోకి చేర్చారు. అప్పుడప్పుడూ ముస్లిం రాజుల మధ్య జరిగే యుద్ధాల్లోను హిందువులే అధికంగా బలైయ్యేవారు, ఎందుకంటే హిందువులను ముందు  కవచంగా (battlefield front line) ఉపయోగించుకొనేవారు (ఖాన్ 205-207 పుటల్లో).   

భారతీయ బానిస వ్యాపారం-1

భారతదేశానికి ఎంతో ఉన్నతమైన, ప్రాచీన సాంస్కృతిక చరిత్ర ఉన్నది. క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితం హైందవమతం, క్రీ.పూ. 600 సంవత్సరాలక్రితం బౌద్ధమతం ప్రారంభమైయ్యాయి. భారతసంస్కృతి శాస్త్రాలలో, కళలలో, మతంలో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. భారతీయ విద్వాంసులు సైన్స్ లో, గణితంలో ఎంతో ప్రగతిని సాధించారు (సున్నా, భీజగణితం, రేఖాగణితం, దశాంశ విధానం మొదలగు అరబిక్ గణితావిష్కరణలు వాస్తవంగా "హిందూ ప్రజల ఆవిష్కరణలు! ఇవి ముమ్మాటికి భారతీయ విజ్ఞానుల విజ్ఞతే!). భారతీయ విద్వాంసులు ఈ గణిత విజ్ఞానాన్నే గాక, వైద్యశాస్త్రం, తర్కశాస్త్రంలోని అనేక ప్రావీణ్యతలను, ఉన్నత ప్రమాణాలను ఇతర రాజ్యములలోకి తీసుకువెళ్లిరి (ముస్లిం రాజ్యాలకు కూడా! ఉదా: బాగ్దాద్).

ఎక్కడెక్కడినుంచో ఇతరులు భారతీయ విశ్వవిద్యాలయాలలో చదువునభ్యసించుటకు వచ్చేవారు (నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అతిపురాతనమైనది). భారతీయ విద్యార్థులు విస్తారమైన అంశములలో, అనగా సైన్స్, గణితం, తర్కశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలగువాటిని అభ్యసించేవారు. భారతీయ కళలు, కట్టడాలు అద్భుతంగా ఉండేవి. భారతతీయులు పరిణతిచెందిన ప్రగతిశీలురైయుండిరి. ఇటువంటి సమయంలో క్రీ.శ. 7వ శతాబ్దంలో భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. వెంటనే భోగభాగ్యాలు పోయి, ఊచకోతలు, అత్యాచారాలు, హింస, దోపిడీలు, సాంస్కృతిక, హైదవ కట్టడాలను, పట్టణాలను, కళలను, క్షేత్రాలను వినాశనం చేయడం ఆరంభమైనది. కొన్నిచోట్ల వాటి స్థానంలోనే ఇస్లామిక్ కట్టడాలు వెలిసాయి. జనాలలో వైజ్ఞానిక తృష్ణ కుంచించుకుపోయింది, హింసాప్రవృత్తి, స్వార్థం పెరిగిపోయింది. హింస, కరువులు, దోపిడీలు, మానభంగాల భయంతో బలవన్మరణాలు, మతమార్పిడులు విస్తారంగా జరిగాయి. ఇస్లాం ప్రకారం ఏదైనా విషయం ఇస్లాంలో అపరిచితమైతే లేక ఇస్లామునకు పూర్వమైనదైతే అదివారికి మూఢమైన కాలానికి (అజ్ఞానాంధకార చరిత్రకి) చెందినదిగా (jahiliyya- time of ignorance) భావిస్తారు మరియు ఇస్లాం ప్రకారం దానిని నాశనం చేయాల్సిందే (ఉదా: ఆఫ్గాన్ లో హిందూ మరియు బౌద్ధ ఆలయాలు, విగ్రహాలు స్థూపాలు). ఒకవేళ అది విలువైనది, లాభకరమైనదైతే దానిని ఇస్లాం పరం చేసుకోవాల్సిందే (ఈజిప్ట్ పిరమిడ్లు- సందర్శకుల వలన చాలా లాభం!). ఈ నిరంతర ఊచకోత జనాల్ని అస్థిరులుగా, సంచారకులుగా (gypsies) చేసింది, హైందవ ఆఫ్గానిస్తాన్ని నాశనం గావించి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లను పుట్టించింది!             

Sunday 24 July 2011

"దేవుడున్నాడా?"- ఇంకొన్ని తర్కవాదాలు.

దేవుడున్నాడా? అనే శీర్షికతో దేవుని ఉనికిని తార్కికంగా, హేతుబద్ధంగా, శాస్త్రీయంగా నిరూపించడానికి కారణకార్యములు- విశ్వశాస్త్ర తర్కాన్ని 6 భాగాలలో వివరించాను. అయితే దేవుడున్నాడు అనడానికి సృష్టిలో సృజనాత్మక రూపక తర్కం (Teleological Argument) మరియు ఇంకొన్ని వాదనలనుకూడా ఈ బ్లాగులో వివరిస్తాను.

ఈ బ్లాగులో ఇంకా జీవపరిణామం evolution, పురావస్తుశాస్త్రం archaeology, జీవశాస్త్రం Life sciences, భౌతికశాస్త్రం physics, చరిత్ర history మొదలగు అంశాలపై విస్తృతమైన వ్యాసాలు, చదువుటకు అనుగుణంగా చిన్న చిన్న భాగాలుగా ప్రచురించాలని యోచిస్తున్నాను. 

దేవుడున్నాడా?-6

3. విశ్వం సృజింపబడిందా?

విశ్వానికి ఒక ఆరంభమైనా ఉండాలి లేక అది ఆదిసంభువైయుండాలి. మనకున్న అధారాలనుబట్టి విశ్వానికి ఒక పుట్టుక (ఆరంభం) ఉన్నది అని స్పష్టమవుతుంది. "ఆరంభం" అనేది ఒక కార్యం కాబట్టి దానికి ఒక కారణం ఉండాలి (Law of Cause and Effect). అంటే విశ్వాన్ని ఏదైనా లేక ఎవరైనా సృష్టించి ఉండాలి. కారణం లేక కర్త లేనిది ఏ కార్యం జరుగదు.

విశ్వం ఆదిసంభువు మరియు విశ్వం స్వీయోత్పత్తి గావించుకొన్నది అనే ప్రతిపాదనలు వ్యర్థమైనవని గత భాగాల్లో వివరించబడింది. ఇక మిగిలింది విశ్వం సృజింపబడుట అనే ప్రత్యామ్నాయం. కాబట్టి విశ్వం తనకంటే బలమైన ఒక శక్తిచే సృజింపబడినది.

ఇంకో విషయం ఏమిటంటే, ఒకప్పుడు అంతా శూన్యముంటే, ఇప్పుడూ ఇంకెప్పుడూ శూన్యమే ఉండాలి. సైన్స్ ప్రకారం శూన్యం శూన్యాన్నే ఇవ్వగలదు కాని పదార్థాన్ని కాదు. ఈ కారణంగా ఇప్పుడు పదార్థం (విశ్వం) ఉంది గనుక నిత్యత్వం కలిగిన, స్వయంభువైన రాశి లేక శక్తి ఉండియుండాలి. ఆ శక్తి సృజన గావించాలంటే జీవముగలదై లేక గలవాడైయుండాలి (Nothing produces nothing and something produces something; And that something which is capable of producing or creating ought to be superior and eternal).    

ఇప్పటివరకు గమనించిన విషయాలను పరిగణలోకి తీసుకొంటె, ఒక ఆస్తికుని వాదం ఇలా ఉంటుంది:
1) ఉనికి కలిగియున్న సర్వం పదార్థం మరియు సృజన శక్తి కలిగిన జీవమైయుండాలి.
2)ఇప్పుడు పదార్థ లేక వస్తువు ఉనికి ఉంది గనుక అనాదిగా ఉనికికలిగియున్నదేదైనా ఉండియుండాలి.
3)కాబట్టి పదార్థం లేక సృజన శక్తి అను రెంటిలో ఒకటి ఆదిసంభువైయుండాలి.
4)పదార్థం (విశ్వం) తననుతాను సృజించుకొనలేదు కాబట్టి అది ఆదిసంభువు కాదని మనము తెలుసుకొన్నాం.
5)కాబట్టి సృజన శక్తి కలిగినదే లేక కలిగినవాడే ఆదిసంభువు లేక నిత్యుడు.

ఆస్తికుడు కానటువంటి రాబర్ట్ జస్త్రో ఇలా అన్నాడు: "మనకున్న ఆధారలనుబట్టి విజ్ఞానానికందని ఒక అద్వితీయమైన శక్తి ఉన్నది అనునది సైన్స్ కూడా తప్పక చెప్పే సత్యం! (1982)."

దీనంతటినీ ఒక సామాన్యభాషలో చెప్పాలంటే:

ఉదాహరణకు, ఒకచోట కొన్ని సిమెంట్ బస్తాలు, ఇసుక, నీరు, ఇటుకలు, రాళ్ళు ఉన్నాయనుకోండి. తాపిపనివాడు లేకుండా వాటంతటవే ఒక నిర్మాణంగా రూపుదిద్దుకొంటాయా?
"రూపుదిద్దుకొంటాయి" అని మన పిల్లలను పంపే స్కూల్లలో గొప్ప scientific factsగా బోధించుచున్నారు! రూపుదిద్దుకొంటే దిద్దుకొన్నాయి, అసలు ఈ ముడి పదార్థాలు ఎక్కడివి? "అవీ వాటంతట అవే శూన్యం నుండి వచ్చాయి!"- ఇది మన సైన్స్!
సత్యమేదో మీరే గ్రహించండి. ఎందుకంటే సత్యం మనలను స్వంతంత్రులనుగా చేస్తుంది!

సత్యమేవ జయతే!!

NOTE: I'm not against science, but some 'madness' is proclaimed as science and an exhaustive propaganda campaign has been launched just out of resentment and anger against the idea of God! I absolutely uphold, accept, and follow true science, and true science always reflects true God which is unfortunately a buried and lost truth! 

------------------END------------------------

Saturday 23 July 2011

దేవుడున్నాడా?-5

యెస్లింగ్ వ్యాసాన్ని చదివి అనేకులు Skeptical Inquirer పత్రికకు ఉత్తరాలు వ్రాసారు. వాటికి యెస్లింగ్ సమాధానాలిచ్చారు. ఈ ఉత్తరప్రత్యుత్తరాల్ని 1995లో ఆ పత్రికలో ప్రచురించారు. యెస్లింగ్ ఒకచోట ఇలా వ్రాసారు: "సైన్స్ కూడా ఒక ఊహతోనే మొదలవుతుంది. మనం ఊహించిన ఆలోచన నిజమా కాదా అని నిర్ధారించుకోడానికి అనుభవపూర్వకమైన సాక్ష్యం కావాలి. నేటి వరకు మన కంటికి కనిపించే మరియు దృష్టికి అతీతంగా విశాలంగా ఉన్న విశ్వం శూన్యం లోనుండి జన్మించినట్లు కనీస సాక్షాధారాలు లేవు. కాబట్టి రాతిలో దేవుడున్నాడు అనేది ఎంత మూఢనమ్మకమో ఇదీ అంతేకాని ఏమాత్రం విజ్ఞానం కాదు (1995)".

యెస్లింగ్ చెప్పింది నేటి (2011) వరకు నిజమే. పదార్థం శూన్యంలో నుండి ఉత్పన్నమవడం అసాధ్యం. ఏ ప్రయోగశాలలోనూ ఇది నిరూపించబడలేదు, నిరూపించబడనేరదు కూడా! ఇది 1st & 2nd Law of Thermodynamicsకి పూర్తి విరుద్ధమైన సిద్ధాంతం.  

ఏదైనా విషయం గమనించబడగలిగి తిరిగి రూపొందించగలిగినదైతే అది నికార్సైన విజ్ఞామవుతుంది. అంతేగాని ఏదో ఊహించి దాన్ని రుజువుచేయకుండానే ప్రామాణికంగా పరిగణించి దానిని అబివృద్ధి చేస్తే అది ఎంత బావున్నా విజ్ఞానం కానేరదు. ప్రయోగాత్మకంగా నిరూపించబడగలిగినదే సైన్స్.

సుప్రసిద్ధ ఖగోళ-భౌతిక శాస్త్రవేత్తైన స్టీఫెన్ హాకింగ్ ఇలా అన్నాడు: విశ్వం తనంతటతాను శూన్యంలోనుండి ఉత్పత్తిగావించుకొన్నది అని చెప్పే The new inflationary model విఫలమైనది. ఇది వైజ్ఞానికంగా తాత్వికంగా నిజంకాదు. అయినా ఇదే నిజమనే భ్రమలో కొందరు ఇంకా దీనిపై వ్యాసాలు వ్రాస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు.  

దేవుడున్నాడా?-4

2. విశ్వం శూన్యంలోనుండి తననుతాను సృష్టించుకుందా?

విశ్వం స్వయంసృష్టి చేసుకుంది అని చెప్పే శాస్త్రఙులు ఇంతకుమునుపు లేరు. భౌతికశాస్త్రవేత్తైన జార్జ్ డేవీస్, "మనకున్న పరిజ్ఞానాన్నిబట్టి ఏ పదార్థం స్వయంసృష్టి చేసుకోజాలదు అనే విషయం స్పష్టమగుచున్నది" (1958) అని చెప్పారు. కాబట్టి విశ్వం సృష్టింపబడినదేకాని సృష్టికర్త కాదు.

అయినప్పటికీ, ఆశ్చర్యకరంగా కొందరు విఙానులు మరియు తత్వవేత్తలు విశ్వం స్వయంసృజన చేసుకోగలదనే వాదనను బలపర్చడానికి ముందుకొచ్చారు. ఉదాహరణకు, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో భౌతికశాస్త్రంలో ప్రొఫెస్సరైన Edward, P. Tryonగారు,"భౌతికశాస్త్ర నియమాలకు లోబడి విశ్వం స్వయంసృష్టి గావించుకుంది అని నేను 1973లో ప్రకటించాను. అయితే ఇది జనానికి ప్రకృతివిరుద్ధమైన, విస్మయకరమైన ప్రకటనగా తోచింది (1984). అయితే మే 1984లో "సైంటిఫిక్ అమెరికన్" అనే వైఙానిక పత్రికలో ప్రచురించిన "The Inflationary Universe"అనే వ్యాసం అనేకులు విశ్వం స్వయముత్పత్తి గావించుకొన్నది అని ఒప్పుకొనుటకు దోహదపడింది. జీవపరిణామవాదులైన (Evolutionists) అలెన్ గుత్ మరియు పాల్ స్టైన్-హర్డ్ ఇలా వ్రాసారు:



"చారిత్రిక నేపధ్యంలో సంచలనాత్మకమైన విషయం ఏమిటంటే విశ్వం ఒక నిగూఢమైన, అతిసూక్ష్మమైన మర్మ ప్రదేశంలోని శూన్యం నుండి ఒక్కసారిగా దానికదే స్వీయోత్పత్తి చెంది కాంతికంటే వేగంగా శూన్యంలోకి విస్తరించుటనారంభించింది. విశ్వావిర్భవానికి ఇంతకంటే మెరుగైన వైజ్ఞానిక వివరణలేదు (1984)." 


అయితే ట్రైయాన్, గుత్, స్టైన్-హర్డ్ మరియు ఇంకొందరి ఇలాంటి ప్రకటనలు, వైజ్ఞానిక రచనలు సైంటిఫిక్ కమ్యూనిటీలో వివాదాస్పదమైన చర్చకు దారితీసాయి. ప్రముఖ సైన్స్ పత్రికలలో, వేదికలపై విశ్వం స్వీయోత్పత్తి చేసుకొందనే దృక్పథానికి బాగా ప్రాచుర్యం కల్పించారు. కొందరు ఈ సిద్ధాంతాన్ని బలంగా వ్యతిరేకించారు. ఉదాహరణకు, 1994 సమ్మర్ ఎడిషన్ Skeptical Enquirerలో బ్రిటీషువాడైన రాల్ఫ్ యెస్లింగ్ విశ్వం యొక్క స్వీయోత్పత్తి అనే అంశాన్ని విమర్శిస్తూ ఇలా చురకలంటించాడు: 

"సైంటిస్టులు సైన్స్ మాట్లాడితే బాగుంటుంది. కాని కొందరు భూతం ఆవహించినట్లు ఒక్కసారిగా అపారజ్ఞానసంపన్నులైన తత్వవేత్తలుగా మారి గొప్పమర్మాన్ని ఛేదించినట్లు ఒక చౌకబారు సిద్ధాంతాన్ని లేక విషయాన్ని ప్రకటించి దాన్ని నికార్సైన విజ్ఞానమంటారు. గుడ్డెద్దు చేలో పడినట్లు వీరు అనాలోచితంగా స్వార్థంతో వారి సిద్ధాంతానికి విపరీతమైన ప్రాచుర్యం కల్పిస్తారు. తానా అంటే తందానా అన్నట్లు, కాస్మాలజిస్ట్లు, క్వాంటం థియరిస్ట్లు ఈ సిద్ధాంతాలకి తమదైన ధోరణిలో మసాలా జోడించి, ఈ వ్యర్థసిద్ధాంతాలకి ఇంకా బలం చేకూరుస్తారు. శూన్యలోనుండి పదార్థోత్పత్తి వైజ్ఞానికంగా అసంభవమనే విషయం మరుగైపోతుంది. అసలు ఈ కాస్మాలజిస్టకి, క్వాంటం థీరిస్ట్లకి సైన్స్ తో ఏంపని? ప్రతిపాదనలై అధారపడి వారి పనిని కొనసాగించేవీరు, అసలు ఆ ప్రతిపాదన అంగీకారయోగ్యమైనదా లేదా అని గమనించలేనత బుద్ధిమాంద్యంతో ఉన్నారా? (1994)"     



Wednesday 20 July 2011

దేవుడున్నాడా?-3

1. విశ్వం ఆద్యంతరహితమైనదా?  (విశ్వం స్వయంభువా?)

దేవుడు లేడని వాదించే నాస్తికుడికి "విశ్వం ఆద్యంతరహితమైనది" అనే దృక్పదం కలిగి ఉండటం ఇష్టం, ఎందుకంటే విశ్వానికి ఆరంభం-ముగింపు అనే ప్రస్తావనే లేదు కాబట్టి ఎవరు ఆరంభించారనే ప్రశ్నే తలెత్తదు. దేవుడులేడని చెప్పడానికే జీవపరిణామవాదులైన (evolutionists) Thomas Gold, Hermann Bondi, మరియు Fred Hoyle అనువారు Steady State Theoryని అబివృద్ధి చేసిరి. విశ్వం రోజు రోజుకి వ్యాప్తి చెందుతొంది. దీనికి కారణం విశ్వ విశాలంలో irtrons అనే కేంద్రాలలో శూన్యములోనుండి బయటకు వస్తున్న హైడ్రోజన్ అణువులు విస్తరించడం వలననే అని ఈ శాస్త్రఙులు ప్రతిపాదించిరి. ఈ హైడ్రోజన్ అణువులు ప్రాథమిక మేఘాలుగా మారి అందులో నూతన పాలపుంతలు, నక్షత్రాలు రూపుదిద్దుకొంటాయని Dr. Hoyle ప్రతిపాదించారు. 

అయితే ఈ Steady State Theory, శక్తిని నూతనంగా సృష్తించడం లేక నాశనంచేయడం అసంభవం అని సూచించే First law of Thermodynamicsకి విరుద్ధంగా ఉండటంతో చాలా వరకు విఫలమైనది. ఖగోలశాస్త్రఙుడైన Robert Jastrow పరిశీలించినదేమనగా:

"పదార్థాన్ని శక్తిగా లేక శక్తిని పదార్థంగా మార్చవచ్చుగాని, శూన్యం నుండి పదార్థాన్ని సృష్టించడం అసాధ్యం. విశ్వంలో ఉన్న పదార్థం మరియు శక్తి ఎప్పటికి స్థిరం. ఈ నియమాన్ని పాటించని ఏ సిద్ధాంతాన్ని ఒప్పుకొనలేము."

కాబట్టి చరిత్రలో Steady State Theory పనికిరాని చెత్తలా అయ్యింది. అయినప్పటికీ ఎదో ప్రత్యామ్నాయం దొరక్కపోతుందా అని, విశ్వం నిత్యమైనది అని భావించేవారికి అది 2nd Law of Thermodynamicsకి కూడా విరుద్ధమే అగుటవలన ఇంకా సమస్యలు పెరిగాయి. 2nd Law ప్రకారం శక్తిని ఖర్చుచేసినప్పుడు లేక వాడినప్పుడు అది వాడుటకు వీలులేని స్థితిలోకి మారుతుంది. వాస్తవానికి విశ్వం విస్తరించడం క్షీణించుతోంది, ఎందుకంటే శక్తి ఖర్చవడం వలన, విస్తరించడానికి కావల్సిన శక్తి తగ్గిపోతూ ఉంది. అంటే విశ్వం విస్తరించే వేగం నానాటికీ తగ్గిపోతూంది. మున్ముందు ఇక విస్తరించడం ఆగిపోవొచ్చు (శక్తి అంతా ఖర్చైపోతుంది కాబట్టి).

ఇప్పుడున్న ఆధారాలను బట్టి విశ్వం నిత్యమైనది అనటం సమంజసంకాదు. విశ్వానికి తప్పకుండా ఒక ప్రారంభ గడియ ఉన్నది అని Jastrow అభిప్రాయం. ఇది సరైన అభిప్రాయమే! ఎందుకంటే నిత్యత్వంగలవి క్షీణించుకుపోవు, కాని విశ్వం క్షీణిస్తోంది. Henry Morisగారన్నట్లు, 2nd Law of Thermodynamics ప్రకారం విశ్వానికి ఒక ఆరంభం తప్పక ఉన్నది, అంతేకాని శాస్తవేత్తల ప్రతిపాదనైన- విశ్వం నిత్యత్వం గలది- అనునది ఆ విజ్ఞాన శాస్త్రం ప్రకారమే తప్పు!   

Monday 18 July 2011

దేవుడున్నాడా?-2

కారణకార్యములు- విశ్వశాస్త్ర తర్కం

ఈ విశ్వం, అనగా మనము ఉన్న ఈ లోకం, జీవరాశి, అనంత ఆకాశం మనముందున్నవి. ఇవి ఏలాగు సంభవించినవో తెలుసుకోవాలి- మానవ చరిత్రలో అనాదిగానున్న తర్కమిది. R. C. Sproul తన NOT A CHANCE అనే పుస్తకంలో ఇట్లు విశదపరచారు.
"కారణం లేకుండా ఏదీ సంభవించదు కాబట్టి దేవుడున్నాడు అనేది సాంప్రదాయ ఆస్తిక వాదన. అనగా, ఈ విశ్వం సంభవించినది కాబట్టి సంభవింపజేసినవాడు ఉండాలి, అతడే కర్త లేక దేవుడైయున్నాడు. శూన్యము గాక ఎదోఒకటి ఉన్నది గనుక దానికి సరైన సమాధానం కర్తయే అనునది సాంప్రదాయ వాదం."

విశ్వం యొక్క ఉనికి సత్యం- విశ్వం ఉనికి కలిగి ఉండటమేకాదు అది బ్రహ్మండమైన వైవిధ్యంతో కూడికొనియున్నదని నాస్తికులు, ప్రత్యక్షవాదులు అంగీకరిస్తారు. ఒక పదార్థం తన అస్తిత్వాన్ని వివరింపలేక పోయిన యెడల అది అనిశ్చితమైన పదార్థంగా పరిగణించబడును. కాబట్టి విశ్వం కూడా ఒక అనిశ్చితమైన పదార్థమే- ఎందుకంటే అది తనని తాను సృష్టించుకోలేదు లేక దాని అస్తిత్వానికి సరైన కారణములను సూచింపలేదు. (NOTE: Big Bang Theory is just a theory which does not have any experimental proof yet. It is an assumption and is not any better or superior idea than a mere belief. Desperate attempts made by so-called scientists to prove Big Bang Theory have been utter failures). తన ఉనికిని నిర్వచింపలేని పదార్థం సంభవించడానికి కారణం తప్పక ఉండాలి. కాబట్టి ఈ విశ్వం సంభవించిన కార్యమునకు కారణం ఏమిటి లేక ఎవరు అనేది మనముందున్న ప్రశ్న!

దీని మూలంగానే కారణకార్య సింద్ధాంతం (Law of Cause and Effect) విశ్వశాస్త్ర తర్కంతో ముడిపడియున్నది. ఒక పదార్థం సంభవించుటకు మునుపు దాని అస్తిత్వం ఏర్పడుటకు ఒక కారణం ఉంటుంది అనేది Law of Cause and Effect. ఇంతకుమునుపు Law of Excluded Middle ఏలాగు రూఢియైయున్నదో ఇదీ ఆలాగే సత్యమైయున్నది. ఉదాహరణకు, ఒక ప్రాచీన కోట ఉన్నదనుకోండి. అది మనము గమనించగలిగిన విషయం కనుక దానిని కట్టినవానిని చూడకపోయినను ఉండెనని కోట ఉనికినిబట్టి రూఢిగా మనకు తెలుసు. అంతేకాని కోట మరేదో రీతిగా సంభవించింది అని అనుకోము. Sproul దీనిని గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు.

"కారణము, కార్యము రెండూ వేరైనప్పటికీ తార్కిక విశ్లేషణలో ఇవి విడదీయజాలనివి. ఒక త్రిభుజానికి మూడు కోణాలున్నట్లు, లేక బ్రహ్మచారి అంటే పెండ్లి కానివాడు అను వాక్యములు ఎంత సత్యమో, కార్యమునకు కారణము అంతే సత్యం. అకారణముగా కార్యము సంభవించుట లేక కార్యము దాల్చలేని కారణముండుట అనునవి నిరర్థకమైనవి, ఏ తర్కానికి సరిపోనివి. కార్యము సంభవించుటకు కారణమవశ్యము మరియు కారణముంటే కార్యము తప్పక జరుగును!

సరిపడని కారణం లేకుండా సంభవించిన కార్యములు లేవు. అలాగే కారణమనునది కార్యము తరువాత వచ్చుట అసంబద్ధం. కార్యము కారణముకంటే ఎన్నడును శ్రేష్ఠమైనది కాదు. కారణకార్య సిద్ధాంతమునకు (Law of cause and effect) ఈ ప్రమాణాలు అవశ్యం. ఉదాహరణకు, కప్ప గెంతటం వల్ల నది బురదమయం కాదు; ఈగ వాలడం వలన పుస్తకం టేబుల్ పైనుండి కిందపడిపోదు- ఇవి సరైన కారణాలు కాదు. కాబట్టి ఒక కార్యమునకు సరియైన కారణము తెలుసుకోవాలి. ఇది మన ప్రశ్నను పునరావృత్తం చేస్తోంది- ఈ విశ్వం సంభవించుటకు కారణమేమిటి లేక ఎవరు?

దీనికి మూడు సమాధానాలు సాధ్యముగానున్నవి. 1) విశ్వం నిత్యమైనది లేక ఆద్యంతరహితమైనది; దాని ఉనికి ఎన్నటినుంచో ఉండెను, ఇకను ఎన్నటికీ ఉండును. 2) విశ్వం నిత్యమైనది కాదు; అది తననుతానే శూన్యమునుండి సృష్టించుకొన్నది. 3) విశ్వం నిత్యమైనది కాదు మరియు తనని తాను శూన్యమునుండి సృష్టించుకోలేదు; కానీ, దానికి బాహ్యంగానున్న, దానికంటే శ్రేష్ఠమైన దానిచే (లేక వానిచే) సృజింపబడినది. తప్పకుండా ఈ మూడింట్లో ఏదో ఒకటి మన సమాధానమైయున్నది. వీటిని జాగ్రత్తగా పరిశీలిద్దాం.

దేవుడున్నాడా?-1

"దేవుడున్నాడా?"- అనేకుల మనసులో మెదులుతున్న ప్రశ్న ఇది. తర్క శాస్త్రం ప్రకారం ఎదైనా విషయం విశ్లేషనాత్మకంగా వివరింపబడితే దానిని అంగీకరించవచ్చు.  ఈ తర్క శాస్త్రంలో Law of Excluded Middle ఏమి చెబుతుందంటే- ఒక వస్తువు ఒకే సమయంలో ఒక గుణం కలిగి మరియు అదే గుణం లేకుండా వుండజాలదు.  ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదనలకు అన్వయించినపుడు, ఎదైన ప్రతిపాదన నిజం లేక అబద్ధం అవునుగాని ఒకే సమయంలో ఒకే రీతిగా అది రెండూ (నిజం మరియు అబద్ధం) కానేరదు.

"దేవుడున్నాడు" అనే వాక్యం ఒక కచ్చితమైన ప్రతిపాదన కాబట్టి ఇది సత్యం లేక అసత్యం అయ్యుండాలి కాని రెండూ కానేరదు. దేవుడున్నాడు లేక లేడు- ఈ రెండిటిలో ఒకటే నిజం, రెండు పరిణామాలు సాధ్యం కాదు, మధ్యేమార్గం లేదు! నాస్తికుడేమో దేవుడు లేడని కుండబద్దలు కొట్టినట్లు చెబుతాడు; ఆస్తికుడు దేవుడున్నాడని అంతే రూఢిగా చెబుతాడు; ప్రత్యక్షవాదేమో (agnostic) దేవుడున్నాడని రుజువు చేయడానికి సరైన లేక సరిపోయినన్ని ఆధారాల్లేవు అంటాడు; చార్వాకుడేమో (skeptic) దేవుడున్నాడని రుజువు చేయడం అసాధ్యం అంటాడు. ఎవరిని నమ్మాలి? ఏది నిజం? దేవుడున్నాడా లేడా? 

ఈ ప్రశ్నకు సమాధానం- మనం అధారాలను పరిశీలించాల్సిందే. దేవుడున్నట్లైతే, ఆయన ఉనికికి సంబంధించిన అధారాల్ని మనకు అందుబాటులో కచ్చితంగా ఉంచివుండాలి. అటువంటి ఆధారం ఒక్కటైనా వుందా? వుంటే అసలు అదేమిటి? దాని స్వభావమేమిటి? 

ఆస్తికుడు, దేవుడున్నాడు అనడానికి బలమైన అధారాలున్నాయి అని వాదిస్తాడు. దేవుని ఉనికిని గూర్చి ఎటువంటి సందేహం లేదని చెబుతాడు. అయితే, ఒక సంచిలో ఒక కిలో కూరగాయలున్నాయి అని కొలిచి లేక గుండెలో నాలుగు గదులున్నాయి అని శాస్త్రీయంగా ఎలా రుజువు చేయగలమో అలా దేవుడున్నాడని రుజువు చేయడం సాధ్యమేనా? ఇది సాధ్యం కాక పోవచ్చేమో1 ఎందుకంటే కూరగాయల బరువు, గుండెలో గదులు వంటివి మన పంచేద్రియాల ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగిన విషయాలు. అయితే ఒక విషయాన్ని అనుభవపూర్వకంగా రుజువు చేయడం నిస్సందేహంగా సరైనా విధానం కాని ఇదొక్కటే మార్గం మాత్రం కాదు. ఉదాహరణకు, ఒక విషయానికి రుజువుగా న్యాయవిభాగంలో ప్రాథమిక సాక్షాన్ని (prima facie) పరిగణలోకి తీసుకొంటారు. కాబట్టి ఒక ఆస్తికుడు కూడా దేవుడున్నాడనడానికి ప్రాథమిక అధారాలను (prima facie case) రుజువుగా తెలుపుచున్నాడు. అయితే వీటితో ఏకిభవించకపోతే దానికి తగిన వాదాన్ని నాస్తికులు లేక వ్యతిరేకులు వినిపించాలి. ఇక్కడ ఈ ఆస్తిక వాదం మీముందుచబడును. దానిని పరిశీలించి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు.